పండంటి జీవితానికి...
మానవ జీవితం సుసంపన్నం కావడానికి గాను ప్రవర్తనా నియమావళిలో కొన్ని న్యాయాలను పాటించాలని, అవి పన్నెండు అని చెబుతున్నాయి గ్రంథాలు. వాటిలో మొదటిది- ఇచ్చిపుచ్చుకొనే న్యాయం. తాము ఏదైనా పొందాలనుకునే వారు ముందుగా
మానవ జీవితం సుసంపన్నం కావడానికి గాను ప్రవర్తనా నియమావళిలో కొన్ని న్యాయాలను పాటించాలని, అవి పన్నెండు అని చెబుతున్నాయి గ్రంథాలు. వాటిలో మొదటిది- ఇచ్చిపుచ్చుకొనే న్యాయం. తాము ఏదైనా పొందాలనుకునే వారు ముందుగా ఇవ్వడం నేర్చుకోవాలి. మొక్కలు, చెట్ల నుంచి ఫలాలు కావాలనుకునేవారు వాటికి సంరక్షణను ఇవ్వాలి.
తాము మారి ఆదర్శంగా నిలిచి ఎదుటివారిని మార్చే ప్రయత్నం చేయడం మానవతా న్యాయం. మూడోది- బాధ్యతా న్యాయం. అంటే... ‘ఎవరు చేసిన పనులకు వారే నిజాయతీగా బాధ్యత వహించాలి. అది మంచిదైనా చెడ్డదైనా సరే. అంతే తప్ప... మంచి జరిగితే తన ప్రతిభేనని, జరగరానిది జరిగితే ఎదుటివారి పైకి నెట్టే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదు. తరవాతది- ఏకాగ్రతా(లగ్న) న్యాయం. చేసే పనిపట్ల ఎప్పుడూ ఏకాగ్రత కలిగి ఉండాలి. ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి. పనిమీదే మనసు లగ్నం చేయాలి. ఒకేసారి రెండు, మూడు పనులు చేయకూడదు. నేడు మానవ ప్రవర్తనలో ఇది ఎక్కువగా ఉంది. తింటూ చదవడం, బండి నడుపుతూ ఫోను మాట్లాడటం లాంటివి దీనికి ఉదాహరణ. దీనివల్ల ప్రయోజనానికి బదులు ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువ.
తెలిసో, తెలియకో జరిగిన పొరపాట్లను తలచుకుంటూ ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు. గతాన్ని నెమరువేసుకుంటూ కూర్చోకుండా జరగవలసిన కార్యాల గురించి ఆలోచించాలి అనేది ‘గతజలసేతు బంధన’ న్యాయం. ‘ఓర్పు బట్టే ప్రతిఫలం అనేది మరొక న్యాయం. విసుగు, విరామం లేకుండా గట్టి పట్టుదలతో ప్రయత్నించండి. ఓడిపోయినా నిరాశపడకుండా ఓర్పు వహించి మరల మరల ప్రయత్నించండి. ఫలితం బాగుంటుంది’ అనేది దీని బోధనా సారాంశం. ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగదు. జరిగేటట్లు ప్రయత్నం చేయాలి. లేదా జరిగిన దానిలోని మంచిని గ్రహించే ప్రయత్నం చేయాలి. ఆ తత్వాన్ని అలవాటు చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. దీన్ని ‘కృత్య న్యాయం’ అని పేర్కొంటున్నాయి గ్రంథాలు.
మనల్ని మనం మార్చుకోగలిగితే మన జీవితాలూ మారతాయి. జీవితంలో ఒకసారి కోల్పోతే తిరిగి తీసుకోలేనివి కొన్ని ఉంటాయి. ఎదుటివారి పైకి విసిరిన రాయి, నోటినుంచి వెలువడిన మాట, ఒకసారి తప్పిపోయిన అవకాశం, గడిచిపోయిన కాలం, కోల్పోయిన నమ్మకం... అలాంటివే ఇవి జరగకుండా జాగ్రత్త పడాలని చెబుతోంది ‘ఎదుగుదల న్యాయం’. గతం, వర్తమానం, భవిష్యత్తు... ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. దానికి తగినట్లుగా సంబంధ బాంధవ్యాల పట్ల శ్రద్ధ వహించాలని చెప్పేది ‘సంబంధ బాంధవ్య న్యాయం’. ఆలోచనల్ని బట్టే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. సరైన ఆలోచనలు చేయాలి అనేది ‘ఆలోచనా న్యాయం’.
చరిత్ర లక్షణం పునరావృతం అవుతూ ఉండటం. ఆయా మార్పులకు అనుగుణంగా తమ మార్గాన్ని, ప్రవర్తనను, జీవన విధానాన్ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఇది ‘అనుసరణ న్యాయం’. మన ప్రయత్నాలను బట్టే ఫలితం ఉంటుంది. కాబట్టి ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే మాటను మననం చేసుకుంటూ ముందుకు సాగడం ‘ప్రేరణ న్యాయం’.
ఈ పన్నెండు సూత్రాలను కచ్చితంగా పాటిస్తే ‘పండంటి జీవితం మన సొంతం’ అని చెబుతోంది మన వాంగ్మయం.
- అయ్యగారి శ్రీనివాసరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు