ఆ తపనకు జేజేలు!
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. ద్వితీయ స్థానంలో ఉన్న అద్వితీయమైన వ్యక్తి నాన్న. పిల్లల వెనక నీడలా, ముందు నిలువెత్తు అద్దంలా అనుక్షణం భరోసా నింపే అనురాగ రూపం
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. ద్వితీయ స్థానంలో ఉన్న అద్వితీయమైన వ్యక్తి నాన్న. పిల్లల వెనక నీడలా, ముందు నిలువెత్తు అద్దంలా అనుక్షణం భరోసా నింపే అనురాగ రూపం నాన్న. ఓర్పునకు మారుపేరు, మార్పునకు మార్గదర్శి, పిల్లల ప్రగతి సోపానం- నాన్న.
తండ్రితో సమానమైన ఆదిగురువు ప్రపంచంలో ఎవరూ ఉండరు. అక్షరాలు అక్కర్లేని జీవిత పాఠాలు బోధించేవాడు నాన్న. నాన్న భావాలకు భాషతో పని లేదు. అమ్మ చెప్పే నమ్మకం నాన్న. జీవితాంతం వెంట ఉండే నీడ నాన్న. అమ్మ పేగుబంధం అయితే, నాన్నది పెరిగే బంధం. అమ్మ జన్మనిస్తే, నాన్న పిల్లల కోసమే జీవితాంతం జీవిస్తాడు. అమ్మ ఆయువు ఇస్తే, నాన్న ప్రాణవాయువు అవుతాడు. అమ్మ గోరుముద్దలు తినిపిస్తే, నాన్న విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. బాల్యంలో అమ్మ మాటలు నేర్పిస్తే, నాన్న ఎదగడానికి అవసరమైన భాషలు నేర్పించి, బాటలు వేస్తాడు.
నాన్నంటే బాధ్యత, ధైర్యం, భద్రత, భరోసా. అన్నిటినీ మించి త్యాగానికి మారుపేరు నాన్న. పిల్లల సుఖం కోసం తన అవసరాలు, ఆరోగ్యం, ఆనందాల్ని పక్కన పెడతాడు. పిల్లలు ఒక్కో మెట్టు ఎక్కుతూంటే లోలోపల పొంగిపోతాడు. పిల్లల విజయాన్ని తన విజయంగా భావించి చిన్న పిల్లాడిలా, పదిమందితో పంచుకుంటాడు. యుక్తవయస్సు వచ్చిన పిల్లలను స్నేహితులుగా భావించే తొలి వ్యక్తి నాన్న. ఎదిగిన పిల్లలతో నాన్న మాట్లాడే విధానంలో, స్పర్శలో స్నేహ గాఢత స్పష్టంగా తెలుస్తుంది.
పిల్లలు ఎంత ఎదిగినా వాళ్ల దృష్టిలో తొలి కథానాయకుడు నాన్నే. బాల్యంలో పిల్లలు ఎక్కే తొలి విమానం నాన్న భుజాలే. కొడుకును బడికి పంపుతూ ఉపాధ్యాయుడికి ఓ తండ్రి ఉత్తరం రాశాడు. అందులో ‘నా కొడుక్కి చదువుతోపాటు, తప్పు చేయడానికి భయపడే స్వభావాన్ని నేర్పించండి’ అని రాశాడు. ఆయనే అబ్రహాం లింకన్.
ప్రతి వ్యక్తి జీవితంలోనూ మొదటి బ్యాంక్ నాన్న జేబే. ఆ బ్యాంకుకు తిరిగి అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. చెల్లించాలని ఏ తండ్రీ ఆశించడు. ఎందుకంటే నాన్న కష్టానికి మూల్యం ఎవరం చెల్లించలేం.
అమ్మ ఆలన. నాన్న పాలన. అమ్మ ఆలనలో లాలిత్యం దాగుంటుంది. నాన్న పాలనలో కాఠిన్యం వెన్నంటి ఉంటాయి. బాల్యంలో వేలు పట్టుకుని నడక నేర్పిస్తాడు. తప్పటడుగులు వేస్తే సరి చేస్తాడు. జీవితంలో తప్పుటడుగులు వేస్తే, నడత సరిదిద్దడానికి కాఠిన్యం ప్రదర్శిస్తాడు. అయినా పిల్లలకు ఏ కష్టం వచ్చినా తక్షణం మనసులో ప్రత్యక్షమయ్యే దైవం నాన్నే.
పిల్లల అభివృద్ధిని అంబరాన్ని తాకేంతగా మనసులోనే నిస్వార్థ సంబరాలు చేసుకుని మురిసిపోయే ఏకైక వ్యక్తి నాన్న. తన పిల్లలు ఎప్పుడూ తనకంటే ఉన్నతంగా ఉండాలని తపిస్తాడు నాన్న. పిల్లల దీర్ఘకాలిక ప్రగతికి దిక్సూచి నాన్న. అమ్మ ప్రేమ ఆమె కళ్ళతో చూస్తే, నాన్న ప్రేమ ఆయన హృదయంతో చూస్తుంది.
ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి పట్ల పుత్ర వాత్సల్యంతో పక్షపాత వైఖరి ప్రదర్శించేవాడు. అది పిల్లల్ని పతనం వైపు అడుగులు వేయిస్తుంది. అందుకే ఏ తండ్రీ పిల్లల్ని వాళ్ల ముందు పొగిడేందుకు ఇష్టపడడు. వందమంది గురువుల కంటే తండ్రి స్థానం గొప్పదని శాస్త్రాలు చెప్పాయి.
నాన్న త్యాగాలు, నిస్వార్థ ప్రేమ నిరంతరం మనసా, వాచా మనతోనే నీడలా ఉన్నా, విశ్వమంతా ఒకే రోజు నాన్నను స్మరించుకునే రోజున- ప్రపంచంలో ఉన్న నాన్నలందరికీ జేజేలు!
- ఎం.వెంకటేశ్వరరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!