యోగదర్శనం
యోగం అంటే ఆత్మ పరమాత్మల అనుసంధానమనే అర్థం ఉన్నా, యోగశాస్త్రం దాన్ని చిత్తవృత్తుల నిరోధంగా నిర్వచించింది. చిత్తం అంటే మనసు. అది స్వాధీనమైతే, విశ్వమంతా అధీనమవుతుందనేది ఈ శాస్త్ర సారాంశం. మనిషి తనను తాను ఎలా నియంత్రించుకోవాలో, అనుకూల ...
యోగం అంటే ఆత్మ పరమాత్మల అనుసంధానమనే అర్థం ఉన్నా, యోగశాస్త్రం దాన్ని చిత్తవృత్తుల నిరోధంగా నిర్వచించింది. చిత్తం అంటే మనసు. అది స్వాధీనమైతే, విశ్వమంతా అధీనమవుతుందనేది ఈ శాస్త్ర సారాంశం. మనిషి తనను తాను ఎలా నియంత్రించుకోవాలో, అనుకూల ప్రతికూల స్థితుల్లో స్థిరంగా ఎలా ఉండాలో సందేశాన్నిచ్చి, నేడు ప్రపంచ మేధావులందరి మన్ననలను అందుకుంటోంది. ప్రాచీన భారతీయ ఋషి మేధకు, అనితరసాధ్యమైన అంతరంగ సూక్ష్మ శోధనా సామర్థ్యానికి నేడు ప్రపంచం పలికే జేజేలు ఈ శాస్త్ర ఔన్నత్యానికి అద్దం పడతాయి. ఛాందస భావాలకు దూరంగా శాస్త్రీయ దృక్పథానికి దగ్గరగా దీని బోధనలుంటాయి. మానసిక శాంతి, శరీర ఆరోగ్యం కోసం యోగశాస్త్రం అందరూ ఆచరించదగింది. దాని ఆధారంగానే ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రాలు, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు, సానుకూల దృక్పథాన్ని ప్రబోధించే కేంద్రాలు పుట్టుకొచ్చాయి. యోగం మనిషిని సంస్కరిస్తుంది. మనసును కట్టడిచేస్తుంది. దేహాన్ని దృఢం చేస్తుంది. ఆయురారోగ్యాలను పెంచుతుంది. బుద్ధిని వికసింపజేేస్తుంది. చిత్తానికి శాంతిని విశ్రాంతిని ఇస్తుంది. వ్యక్తిగా మనిషిని, సమష్టిగా సంఘాన్ని సముద్ధరిస్తుంది.
యోగం ప్రస్తావన వేదాల్లో ఉన్నప్పటికీ, దాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా తీర్చిదిద్దింది, షట్ దర్శనాలలో ఒకటిగా చేర్చింది మాత్రం- పతంజలి మహర్షి. న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, వేదాంత, మీమాంసలే షట్ దర్శనాలుగా ప్రఖ్యాతిగాంచాయి. క్రీ.పూ.రెండో శతాబ్దంలో జన్మించిన మహర్షి వేదాల్లో యోగవిద్యాసారాన్ని శాస్త్రీయంగా క్లుప్తీకరించి, యోగసూత్రాలను రచించారు. దోషరహితంగా, అసందిగ్ధంగా సారవంతమైన బహుచిన్న వాక్యాలుగా ఈ సూత్రాలుంటాయి. అభ్యాస వైరాగ్యాలను మనసుకు అలవాటు చేస్తే, నిలకడ సాధ్యమవుతుందంటాయి యోగసూత్రాలు. యమ నియమాలు, ఆసన ప్రాణాయామాలు, ప్రత్యాహార ధారణలు, ధ్యానసమాధులతో కూడిన అష్టాంగయోగాన్ని అభ్యసించాలని అవి సూచిస్తాయి.
మనసుపై పట్టు సాధించాలంటే దాని మర్మం బాగా తెలియాలి. ఏది సాధించాలన్నా మనిషికి మనసే ఆధారం. నిజానికి మనసు బాహ్యరూపమే మనిషి. మనిషికి బలం బలహీనత అదే. మనసును మనసుతోనే జయించాలి. మనసు చంచల స్వభావి. స్పందించడం, చలించడం, విసుగు, విరామం, విశ్రాంతి లేకుండా సంచరించడం... మనసు నైజాలు. బాహ్య విషయ వాంఛలవైపు పోకుండా మనసును ముందు అరికట్టాలి. యోగ పరిభాషలో దాన్ని ప్రత్యాహారమంటారు. దేనిపై మక్కువ ఎక్కువ ఉంటే, దానిపైనే మనసు నిలకడగా ఉంటుంది. ధ్యానంపై మనసుకు ప్రీతి కలిగించాలి. ధ్యానించాలనే భావనను మనసు ధారణచేయాలి. తరవాత నెమ్మదిగా ధ్యానాన్ని అలవరచాలి. గాలి వెలుతురు సమంగా ఉండి, శుభ్రంగా ఉన్న ఏకాంత ప్రదేశంలో సుఖాసనంపై స్థిరంగా కూర్చోవాలి. దృష్టి నలుదిక్కులా పోకుండా చూడాలి. నడుము మెడ తలను నిటారుగా(లంబకోణంలో) ఉంచాలి. అంటే వెన్నెముక వంచకూడదు. మనసును ముక్కుకొనపై గాని, కనుబొమల మధ్య గాని నిలపాలి. ఇదే ధ్యానం. ధ్యానం చక్కగా సాగేందుకు శరీరాన్ని దృఢంగా మనసును ఉల్లాసంగా ఉంచాలి. ప్రాణాయామంతో ప్రాణచలనాన్ని అరికట్టగలిగితే అది సాధ్యమవుతుంది. దీర్ఘశ్వాస తీసుకుని, బంధించి, తిరిగి నెమ్మదిగా వదలడాన్ని ప్రాణాయామం అంటారు. దానికి తోడుగా యోగాసనాలను క్రమం తప్పకుండా వేస్తే దేహాంగాల పనితీరు మెరుగవుతుంది. బ్రహ్మచర్యం, అహింస, ఈశ్వరభావన, ఆహార విహారాలలో నియంత్రణను పాటించాలి. వాటిని యమ నియమాలంటారు. వాటిని ఆచరిస్తూ ధ్యానాన్ని కొనసాగిస్తే మనసు ఆలోచనారహితమనే సమాధిని చేరుతుందంటుంది యోగశాస్త్రం.
- పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’