ఉత్తేజ ఇంధనం
ప్రశంస మనిషిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని ప్రేరేపించే తారక మంత్రం. ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించి ముందుకు నడిపించే ఇంధనం. మనిషి తాను సాధించిన విజయాలకు ఎదుటివారి గుర్తింపును ఆశిస్తుంటాడు. తద్వారా తన అస్తిత్వాన్ని చాటుకోవాలని తపిస్తుంటాడు.
ప్రశంస మనిషిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని ప్రేరేపించే తారక మంత్రం. ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించి ముందుకు నడిపించే ఇంధనం. మనిషి తాను సాధించిన విజయాలకు ఎదుటివారి గుర్తింపును ఆశిస్తుంటాడు. తద్వారా తన అస్తిత్వాన్ని చాటుకోవాలని తపిస్తుంటాడు.
విద్యా ప్రదర్శన సభలో తన పుట్టుకను ప్రశ్నించినప్పుడు కర్ణుడు అవమాన భారంతో తల దించుకుంటాడు. కర్ణుడిలోని అస్త్రవిద్యా ప్రావీణ్యాన్ని గుర్తించిన దుర్యోధనుడు అంగరాజ్యానికి రాజును చేసి ఆదరించినప్పుడు, అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగి తుది దాకా రారాజుకు బాసటగా నిలిచి అర్జునుణ్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది.
పిల్లవాడు నడక నేర్చే క్రమంలో ఎన్నోసార్లు పడుతూ లేస్తూ ఉంటాడు. వాడు వేసే ప్రతి అడుగుకీ మురిసిపోతూ తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహమే వాణ్ని తిరిగి నడిపిస్తుంది. పరుగులు తీయిస్తుంది. శారీరక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంత అవసరమో మానసిక ఎదుగుదలకు ప్రశంసా అంతే అవసరం.
మనిషి అన్ని దశలలోనూ ప్రశంస, ప్రోత్సాహాల అవసరం ఉంటుంది. మనిషి కుంగుబాటుకు గురయినప్పుడు అతడి పూర్వ ప్రతిభను గుర్తుచేసి ప్రోత్సహిస్తే పడిలేచిన కెరటమై అపూర్వ విజయాలను అందుకుంటాడు.
ఏ వ్యక్తికైనా తల్లిదండ్రులే తొలి గురువులు. వారి ఆలనా పాలనలోనే వ్యక్తిత్వం రూపు దిద్దుకొంటుంది. పెద్దలపట్ల గౌరవం, ప్రేమ, సహకారం, సానుభూతి, కరుణ వంటి విలువలతో తల్లిదండ్రులు మెలగాలి. అప్పుడే పిల్లలు వారిని అనుకరిస్తారు. అనుసరిస్తారు. ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక ప్రతిభ నిగూఢంగా దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే ఆ అంతర్గత శక్తిని అద్భుత శక్తిగా మార్చుకుని విజయం సాధిస్తారు.
‘నా ధీర యువకులారా! మీరందరూ మహత్కార్యాలు సాధించడానికి జన్మించారన్న విశ్వాసాన్ని కలిగి ఉండండి’ అంటూ తన ప్రసంగాల ద్వారా యువతలోని స్తబ్ధతను, నైరాశ్యాన్ని పారదోలే ప్రయత్నం చేశారు స్వామి వివేకానంద. వారిలో నిద్రాణమై ఉన్న అనంతశక్తిని వెలికితీసి, ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. అదే బాటలో నడచిన అబ్దుల్ కలాం తన ప్రసంగాల ద్వారా యువతను ‘కలలు కనండి... ఆ కలలను సాకారం చేసుకోండి’ అని ప్రోత్సహిస్తూ, ప్రతిభ కనబరచిన యువతపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను పటిష్ఠపరచేందుకు తోడ్పడాలి. పరస్పర ప్రశంసలు పిల్లలపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను నిత్యనూతనం చేసి పరిమళింపజేసే శక్తి ప్రశంసకే సొంతం. ఆధునిక శాస్త్రవేత్తలు, మానసిక వైద్యులు సైతం చెప్పే మాట అదే.
ప్రశంస పొగడ్తలా మనిషిని ఆకాశంలో కూర్చోబెట్టేలా ఉండకూడదు. ప్రశంసకు, పొగడ్తకు వ్యత్యాసముంది. పొగడ్తలో అతిశయోక్తి ఉండవచ్చు. ప్రశంస నిజాయతీగా ఉండాలి. ప్రశంసలో ఎదుటివారి విజయానికి ఇచ్చే చిన్న మెచ్చుకోలు మాత్రమే ఉండాలి. పరిమితమైన ప్రశంస పథ్యం లాంటిది. అవసరమైన మేరకే శక్తినిస్తుంది. ప్రశంస స్ఫూర్తినిచ్చి, బాధ్యత పెంచేదిలా ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది.
మనిషి తనలోని శక్తి సామర్థ్యాలను తనకు తానుగా తెలుసుకోవాలి. అప్పుడే ఎటువంటి ప్రశంసలకు పొంగిపోని, విమర్శలకు కుంగిపోని సమస్థితి అలవడుతుంది. స్థితప్రజ్ఞ ఏర్పడుతుంది. ఒకసారి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలు పెట్టాక అతడికి బాహ్య ప్రశంసల అవసరం ఉండదు. సాధకుడి దృష్టి అంతర్ముఖమై సాగుతుంది. అంతర్యామిని దర్శిస్తుంది.
- శశిధర్ పింగళి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే...