జీవన్ముక్తి
వేద పీఠానికి బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మూడు కాళ్లు. ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయం అంటారు. వేద రుషులు మానవ సమాజానికి తరగని జ్ఞాన సంపదను సమకూర్చారు. శ్రుతులు, స్మృతులు ఆధ్యాత్మిక మార్గానికి ఇరువైపులా అమర్చిన దారిదీపాలు.
వేద పీఠానికి బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మూడు కాళ్లు. ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయం అంటారు. వేద రుషులు మానవ సమాజానికి తరగని జ్ఞాన సంపదను సమకూర్చారు. శ్రుతులు, స్మృతులు ఆధ్యాత్మిక మార్గానికి ఇరువైపులా అమర్చిన దారిదీపాలు. వేద విజ్ఞానం వ్యాసమహర్షి ప్రసాదించిన ధనమే కాదు, ఒక తరగని వారసత్వంగా ప్రపంచానికే వెలుగు ప్రసరిస్తున్న దివ్య ప్రబంధం. మాక్స్ముల్లర్, ఎడ్విన్ ఆర్నల్డ్, ఆల్డస్ హక్స్లే వంటి పాశ్చాత్య మేధావులు వేద సారాన్ని ప్రపంచ దేశాలకు అందించారు.
ఆధునిక రుషి అరవిందులు ఉపనిషత్తులను, భగవద్గీతను మధించి తనదైన బాణీలో దివ్యజీవన ప్రబంధాన్ని ప్రపంచానికి అందించారు. వ్యక్తికి, విశ్వానికి, పరమాత్మకు ఉన్న అనుబంధాన్ని తన రచనల్లో అనుశీలించారు. దార్శనికపు తొలి కానుక అయిన ఈశోపనిషత్తు తొలి శ్లోకం ఈ సత్యాన్ని ఆవిష్కరిస్తున్నది. వ్యక్తి చైతన్య వికసనం అయినప్పుడే ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపమేనన్న ఎరుక కలుగుతుంది. ‘ఈశావాస్య మిదం సర్వం’ అని చెబుతూ అతిథిగృహం లాంటి ఈ లోకంలో మనిషి ఎలా ఉండాలో తెలియజేస్తున్నది తొలి శ్లోకం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, అతిథిగృహం లాంటి భౌతిక ప్రపంచంలో అవసరాల మేరకు వస్తువులు సేకరించమని, పరుల సొమ్ము పామువంటిదని హెచ్చరిస్తోంది. కాలచక్షువు, కర్మసాక్షి అయిన సూర్యుడిని- నీ బంగారు పళ్లెం తొలగించి, నిజదర్శన భాగ్యం కలిగించమని అర్థించడం గమనించదగ్గ విషయం.
తత్త్వజ్ఞానం కలిగినప్పుడే ఈ ప్రపంచ నిజరూపం తెలుస్తుంది. నిద్ర నుంచి మేలుకోగానే స్వప్నలోకం మాయమై నట్లు ఇదీ కనిపించదు. అస్తిత్వం లేని తలకిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించాలి. అలాంటి తత్త్వజ్ఞానివై కృతార్థుడివి కావాలి- అని కృష్ణుడు చెప్పడంలో ఓ అంతరార్థం ఉన్నది.
సంసార జీవితాన్ని వదిలేసి పారిపోయేవాడు సన్యాసి కాదు, పిరికివాడు. కష్టసుఖాలు అనుభవించి, ఇంద్రియాల వల్ల జరిగే ఈ పరిణామాలు తాత్కాలికమైనవని గ్రహించినప్పుడే దృష్టి మరలి, శాశ్వతమైన ఆనందం కోసం ఉవ్విళూరుతుంది మనసు. దాని కోసం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. అది లోపల ఉన్నందువల్ల ఎవరూ చిరునామా మార్చుకుని మోక్షం వెంట పరుగెత్తవలసిన పని లేదు. ఇక్కడే ఈ శరీరంతోనే శాశ్వతానందం పొందాలనుకుని ప్రయత్నం చేసే వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు అరవిందులు. అతడి జీవిత విధానమే దివ్యజీవనం. అంతర్గత యోగ సాధన ద్వారా పావనమైన జీవనమే దివ్య జీవనం. జీవితమే ఒక యోగం అయితే దివ్య శక్తి తనకు తానుగా అందులోకి ప్రవేశిస్తుంది. దివ్యశక్తికి మరో పేరు సచ్చిదానందం.
ఈ ప్రపంచం ఆ దివ్యశక్తి అభివ్యక్తి (ప్రకటన). దాని ప్రకటన వల్ల విస్తారమైన ఈ విశ్వాన్ని ఆ దివ్యశక్తే గమనిస్తున్నది- అంటున్నాయి ఉపనిషత్తులు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనిషి అతిమానసిక స్థితికి ఎదగాలి. అంటే వ్యక్తి చైతన్యం పూర్తిగా వికసించాలి. దివ్య చైతన్యం, విశ్వచైతన్యం, వ్యక్తి చైతన్యం... మూడూ ఒకటి అని తెలుసుకోవడమే జీవన్ముక్తి. వివేకం, వ్యక్తిత్వ వికాసమే ముక్తికి రాజమార్గం.
- ఉప్పు రాఘవేంద్రరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్