కనకధారా స్తోత్రం
భగవంతుణ్ని పలు రూపాల్లో ఉపాసించే భక్తులు తమ అనుభూతికి, ఆత్మ నివేదనకు అక్షర రూపంగా అపారస్తోత్ర వాంగ్మయాన్ని సంతరించారు. ఈ స్తోత్రాలు పఠన పారాయణ యోగ్యతను పొందాయి. ఆది
భగవంతుణ్ని పలు రూపాల్లో ఉపాసించే భక్తులు తమ అనుభూతికి, ఆత్మ నివేదనకు అక్షర రూపంగా అపారస్తోత్ర వాంగ్మయాన్ని సంతరించారు. ఈ స్తోత్రాలు పఠన పారాయణ యోగ్యతను పొందాయి. ఆది శంకరుల స్తోత్ర సాహిత్యం ఉజ్జ్వలమైంది. జ్ఞానంతో అద్వైత స్థితిని అందుకోలేని సామాన్యులు భక్తితో నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శంకరుల స్తోత్రాలు ఉపకరిస్తాయి.
శంకరులు బాల బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక మధ్యాహ్నం వేళ ఓ ఇంటిముందు నిలబడి భిక్షనర్థించారు. ఇల్లాలు ఇల్లంతా వెదికింది. బాల సన్యాసికి పెట్టేందుకు ఇంట్లో ఏమీ లేదు. పెరట్లోని ఉసిరిక చెట్టున ఒక కాయ ఉంది. ఆ ఉసిరిక తెచ్చి స్వామిచేతిలో ఉంచింది. తనవంటి దరిద్రులు ఇంకేమీ ఇవ్వలేరని దుఃఖిస్తూ గద్గదస్వరంతో పలికింది. బాలవటువు హృదయం ద్రవించింది. లక్ష్మీదేవిని ప్రార్థించాడు. మహాలక్ష్మి కరుణించింది. ఆ పేద ఇంట్లో బంగారు ఉసిరికల వానకురిసింది. ఆనాటి శంకరుల స్తోత్రమే కనకధారాస్తవం.
మనసు లగ్నం చేసి మహా భక్తులు ఏ స్తోత్రం చేసినా దేవతలు దిగి రావలసిందే. భక్తుల కోరికలు నెరవేర్చవలసిందే. శంకరుల స్తోత్రాల్లోని ఆర్ద్రత దేవతల్ని కదిలిస్తుంది. వారి స్తోత్రాల్లో అనిర్వచనీయ భావాలు, అపూర్వమైన వర్ణనలు, రమణీయమైన పదాల కూర్పు మేళవించి ఉంటాయి. కనకధారా స్తవం ఆదిశంకరుల రచనల్లో మొదటిదని పండితుల అభిప్రాయం.
ఆయన లక్ష్మీదేవి క్రీగంటి చూపును పరిపరి విధాల వర్ణించారు. ఏ దేవి క్రీగంటి చూపు సోకగానే సర్వవ్యాపియైన విష్ణువు సకల లోకాల పాలనకు పూనుకొంటాడో ఆ అమ్మ మందమైన ఓర చూపు తనపై ప్రసరించాలని కోరుకున్నారు. మహాలక్ష్మి శుభప్రదాయిని. ఆమె దృష్టి మంగళప్రదం. శ్రీమహావిష్ణువుకు ఆనందాన్నిచ్చే ఆమె సౌభాగ్య స్వరూపిణి. ఆమెది ప్రేమదృష్టి. ఆ దృష్టి క్షణకాలం సోకినా చాలు జన్మాంతరం సంక్రమించిన చింతలన్నీ మటుమాయమైపోతాయి. శ్రీహరి వక్షస్థలంపై కౌస్తుభమణి ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడే ఇంద్ర నీలమణుల హారం వలె శ్రీదేవి కడగంటి చూపు నిలిచి ఉంటుంది. మహావిష్ణువును మేఘంతోను, మహాలక్ష్మిని మెరుపుతోను శంకరులు పోల్చారు. మేఘం ఉన్నచోటే మెరుపు మెరుస్తుంది. పరమాత్మ ఉన్నచోటే ప్రకాశం ఉంటుంది. అమ్మవారి దయాపవనం వీచి కటాక్షమేఘం వర్షించాలని బాలసన్యాసి వేడుకోలు.
పద్మం జ్ఞానానికి సంకేతం. మహాలక్ష్మి కమలవాసిని. పద్మాల కాంతి వంటి ఛాయతో ప్రకాశిస్తుంది. ఆమె క్రీగంటి చూపు అక్షయ సంపదలను అనుగ్రహిస్తుంది. పాల సముద్రంలో పుట్టిన ఆ తల్లి చంద్రుడికి, అమృతానికి సహోదరి. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తే, అమృతం అమరుల్ని చేస్తుంది. కరుణనిండిన చూపుల్ని తనపై ప్రసరించమని శంకరుల అభ్యర్థన. సృష్టి కాలంలో బ్రహ్మదేవుడి పత్నియైన శారదగా, స్థితికాలంలో విష్ణుదేవుడి సతియైన లక్ష్మీదేవి పేరుతో, లయకాలంలో శంకరుడి భార్య శాంకరిగా శోభిల్లుతూ ఉండే శ్రీమహాలక్ష్మికి ఆయన నమస్కరించారు.
లక్ష్మీదేవినే ప్రసన్నం చేసుకోగల శంకరుడు భిక్షకు వెళ్ళడంలోని ఆంతర్యాన్ని అవగతం చేసుకోవాలి. అది ఆశ్రమధర్మం. ఆయన ప్రార్థన తన కోసం కాదు. ఆర్తుల దుఃఖాన్ని, దారిద్య్రాన్ని తొలగించడమే ఆయన సంకల్పం. మహాత్ములది నిష్కామభక్తి. వారు పరమాత్మను కోరుకున్నా, వేడుకున్నా అది లోకహితం కోసమే.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య