మనోజ్ఞ స్వరూపం
మానవ జన్మ దుర్లభమని అంటారు. కోట్లాది ఇతర జీవరాశుల్లో లేని ప్రత్యేకత, సామర్థ్యం మనిషిలోనే ఉన్నాయి. మనిషి ఆలోచించగలడు. దుఃఖాన్ని తొలగించుకొని సంతోషంగా ఉండగలడు. ప్రాణాపాయం
మానవ జన్మ దుర్లభమని అంటారు. కోట్లాది ఇతర జీవరాశుల్లో లేని ప్రత్యేకత, సామర్థ్యం మనిషిలోనే ఉన్నాయి. మనిషి ఆలోచించగలడు. దుఃఖాన్ని తొలగించుకొని సంతోషంగా ఉండగలడు. ప్రాణాపాయం నుంచి తనను తాను రక్షించుకోగలడు. హర్షుడు రాసిన నాగానందంలో- మనిషి చేయలేని కార్యమే లేదన్నాడు.
ఈ భూమిమీద దైవం మనిషి కోసమే గాక సకల ప్రాణులకు అవసరమైన వస్తువులనెన్నింటినో అందుబాటులో ఉంచాడు. ఆ అవసరాలన్నీ వినియోగిస్తూ వాటిని జీవుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన దైవం ఎంత దయాళువో! తానెవరో, ఎందుకు ఈ పృథ్వి మీద ఆ అదృశ్య శక్తి వెసులుబాట్లు కల్పించాడో తెలుసుకోవడం మనిషి కర్తవ్యం. ఈ వెతుకులాటలో సదా తపిస్తూ మహత్వపూర్ణమైన జీవితాన్ని పొందే ఆనవాళ్లకోసం శోధించాలని శతపథ బ్రాహ్మణానికి శాండిల్యుడు చేసిన వ్యాఖ్యానం చెబుతోంది.
శ్రీహరి వల్లే- ఈ భూమి, ఈ జీవకోటి, ఈ ప్రకృతి ఉన్నాయి. మనలోని ఈ ఎరుక కారణంగానే ఈ ప్రపంచం ఇలా ఆనందమయమై నిరంతరం సౌభాగ్యకరం అవుతోందని అరబిందో ఘోష్ తన పుస్తకం ది హ్యుమన్ సైకిల్లో ప్రస్తావించారు. సర్వ కాలాల్లో అత్యంత మహిమాన్వితమైన దైవాన్ని స్మరించడం ఉత్తమమైన సాధన అని ఆయన చెబుతారు. ఆ దైవం కరుణకు మారుపేరు. శ్రీహరే రక్షకుడు, పాలకుడు. భూమిపైని ఈ ప్రాకృతిక సౌందర్యాలు, శరత్కాలంలోని చంద్రుడిలోని చల్లదనాలు, సూర్య కిరణాల్లోని ఎన్నో ఔషధీయ గుణాలు, రుతువుల్లో మార్పులు... మనిషికి లభించిన వరాలు.
రక్షించేవాడు దైవం. అతడి మేనిఛాయ ఆకాశంలాగా నీలి వర్ణం. ఆ గగనం లాగానే అందడు. నిరంతరం చైతన్యంతో వెతుకులాడాలి. కన్నతండ్రిని సమ్మానించినట్లే ఆ తండ్రుల గన్న తండ్రిని ఆరాధించాలి, శ్లాఘించాలి, ప్రేమించాలి. జీవరాశులన్నింటికీ మూలమైన సముద్రమే ఆయన నిలయం. ఆయన సృజించిన ప్రకృతిలోని అందాలు దైవంలోని సొగసుకు ప్రతిరూపాలు. రంగురంగుల పువ్వుల్లోని సౌరభాలు ఆయన నిశ్వాసాలేనని విష్ణుపురాణం చెబుతోంది. వేదాల సారం ఆ దైవం.
‘రాజా... సోమరితనం అతినిద్ర పాపం అలక్ష్యం ఆడంబరాలు దురభిమానాలు విషయ సుఖాలు దుర్వ్యసన దురాచారాలను విడిచి పెట్టాలి’ అని రఘువంశం రాయడానికి ముందు ఉజ్జయిని కాళికాలయంలో తన రాజు విక్రమాదిత్యుడితో కాళిదాసు అన్నట్లు చెబుతారు. మానవ దేహం దుర్లభమైంది. ఇదే గొప్ప అని అనుకోరాదు. స్వర్గ సుఖం సైతం అల్పమైందే. దేవాదిదేవుడైన విష్ణుమూర్తిని చేరడమే మనిషి లక్ష్యం కావాలి. ఈ మానవ శరీరాన్ని ఇచ్చి తన ఉనికి కోసం వెతికే శక్తిని సైతం ప్రసాదించిన దైవానిది మనోజ్ఞ స్వరూపం. ఆ అందాలను చూడగలగాలి. మనిషి జీవితంలో అదృష్టం కంటే ఎక్కువ ఫలితాలనిచ్చేది దైవం కోసం నిరంతర సాధన. విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివరించినట్లు- ఆ దైవం చతుర్భుజుడు, పంచాయుధాలను ధరించినవాడు, పాల సముద్రంలో శేషుడిపై పవళించినవాడు. శ్రీదేవి, భూదేవి చేత పూజలందుకొంటున్నవాడు. శ్రీవత్సచిహ్నాన్ని కౌస్తుభాన్ని, జయంతీ మాలను ధరించినవాడు. ఆ గరుడవాహనుడైన శ్రీహరి చక్కదనాలకే నిర్వచనం. ఆ మనోజ్ఞ స్వరూప దర్శనం దక్కిందా... ఆ భాగ్యం అనంతం!
- అప్పరుసు రమాకాంతరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిలువపై సత్య సందేశం
ఒక బోధకుడు రాత్రిపూట ఒక అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఒక దొంగ ఆ బోధకుడిని అడ్డగించాడు. ‘నీవద్దనున్న సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తాను’ అంటూ కత్తి చూపి భయపెట్టాడు. -
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు.