Antaryami: దృష్టి కోణం
కొన్ని ప్రత్యేకతల వల్ల సాధారణ విషయం సైతం విశేషత్వాన్ని సంతరించుకుంటుంది. దీన్నే ‘గురి కుదిరితే గులకరాయైనా గుడిలో దైవంలా కనబడుతుంది’ అంటారు తత్వజ్ఞులు. సామాన్యంగా ఉన్నప్పటి స్థితికి, ప్రత్యేకత సంతరించుకున్నప్పటి స్థితికి చాలా తేడా వచ్చేస్తుంది.
కొన్ని ప్రత్యేకతల వల్ల సాధారణ విషయం సైతం విశేషత్వాన్ని సంతరించుకుంటుంది. దీన్నే ‘గురి కుదిరితే గులకరాయైనా గుడిలో దైవంలా కనబడుతుంది’ అంటారు తత్వజ్ఞులు. సామాన్యంగా ఉన్నప్పటి స్థితికి, ప్రత్యేకత సంతరించుకున్నప్పటి స్థితికి చాలా తేడా వచ్చేస్తుంది. అప్పుడు వాటిని తేలిగ్గా చూడటం, సులభంగా పొందడం, మామూలుగా దగ్గరకు చేరడం కుదరదు.
చెట్టు నుంచి కోసి తినే పండు కడుపు నింపుతుంది. దానితో ఒక్కరి ఆకలి మాత్రమే తీరవచ్చు. అంతకంటే మరే అనుభూతినీ ఇవ్వదు. అదే పండును దేవుడికి నివేదన చేస్తే ప్రసాదం అవుతుంది. చిన్న ముక్కలుగా చేసి ఎందరికి పంచినా స్వీకరించే వారందరికీ ‘భగవంతుడి అనుగ్రహం పొందగలిగాం’ అనే అనుభూతికి లోనయేట్టు చేస్తుంది. ఆ తృప్తి జీవితాన ఉత్సాహాన్ని నింపుతుంది.
ఏ ఆశయం లేకుండా గంగానదిలో స్నానం చేసినా, అది సాధారణ స్నాన జలమే అవుతుంది. మామూలు చోట స్నానం లాగానే అక్కడా స్నానం చేసేవారికి అంతకంటే అందులో ఏ ప్రత్యేకతా కనిపించదు. గంగ నుంచే కాకుండా ఏ ఇతర జల వనరు నుంచి తెచ్చిన నీటినైనా శంఖంలో పోస్తే అది తీర్థం అనిపించుకుంటుంది. పవిత్రమైనదనే భావనను కలిగిస్తుంది. చుక్కలుగా అరచేతిలో పడిన ఆ ఉద్ధరిణెడు బిందువులనే ‘తీర్థప్రసాదం’ అంటారు. అది స్వీకరించిన వారికి మనోబలాన్ని పెంచుతుంది. సంతృప్తిని ఇస్తుంది. సాధారణ గరిక(గడ్డి)నే వినాయక చవితి నాడు ఆయనకు పూజాద్రవ్యంగా సమర్పిస్తే పవిత్రతను సంతరించుకుంటుంది. విఘ్నేశ్వరుడికి ప్రీతిపాత్రమైన పత్రిగా ప్రసిద్ధి పొందింది ఆ గరికే.
రోజుల్లో సైతం ఒకే రోజు ఒకరికి స్మరణ దినం. మరొకరికి సంబరదినం, ఇంకొకరికి పర్వదినం కావచ్చు. ఆయా వ్యక్తుల అనుభవాలు, అనుభూతులే దాన్ని నిర్ధారిస్తాయి. మనిషి జీవితం కూడా అంతే. సాధారణంగా గడుపుతూ పోతే కాలమే గడిచి పోతుంది. కొన్నాళ్ళకు ఆయువూ తీరిపోతుంది.
అదే మనిషి ఏదైనా ఘనత సాధిస్తే, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటే... మహనీయుడు, స్ఫూర్తిదాత, మార్గదర్శి, ఆదర్శ పురుషుడు... ఇలా ఎన్నో అవుతాడు. పదవి, అధికారం లాంటివి వచ్చిన వారు నిన్నటి వరకు నీతో కలిసి మెలిసి తిరిగిన వారే కావచ్చు. కానీ ఒక రోజులోనే మీ మీ స్థానాల్లో చాలా తేడా వచ్చేస్తుంది.
‘మరి అలాంటప్పుడు అందరికీ ప్రసాదం, తీర్థం దొరుకుతాయా... అందరూ పండుగ చేసుకోగలరా, అందరూ మహనీయులు కాగలరా?’ అనే ఆలోచన రావచ్చు. అందుకోసమే నీటినంతటినీ తీర్థంగా, పదార్థాలనన్నింటినీ భగవత్ప్రసాదంగా, ప్రతి రోజునూ పండుగలా చూడటం అలవాటు చేసుకోవాలి. అది మనోభావన మీదే ఆధారపడి ఉంటుంది అంటారు బోధకులు, సాధకులు.
అలా ప్రతి పదార్థాన్నీ ప్రసాదంగా భావించిన నాడు దుబారా, దుర్వినియోగం తగ్గుతాయి. ప్రతి నీటినీ తీర్థంగా భావించిన నాడు నీటిని కలుషితం చేయడానికి వెనకాడతారు. ప్రతి రోజునూ పండుగగా భావించిననాడు మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా అనుకూల భావనలతో జీవిస్తారు. తోటి వారందరినీ భగవత్స్వరూపులుగా భావించిన నాడు లోకంలో విద్వేషాలు, విభేదాలు లేకుండా ‘వసుధైక కుటుంబం’ అనిపించుకుంటుంది. అప్పుడు ‘స్వర్గమంటే ఎక్కడో లేదు. ఆ లోకం ఇదే’ అనిపిస్తుంది. ‘దృష్టి కోణం మారితే, సృష్టి కోణం మారుతుంది’ అనే మాటకు అర్థం ఇదే.
- అయ్యగారి శ్రీనివాస రావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. అన్ని దానాల్లోకీ వాగ్దానం... -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?