శాంతి మంత్రం
జీవితం సుఖంగా, ప్రశాంతంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కోరికలు మానవ సహజం. కోరికలు ఊరికే తీరవు. కోరిన కోరికలను నెరవేర్చుకోవడానికి దారులు వెతకాలి. సరైన దారిలో ముందుకు సాగితే అనుకున్నవి సాధించవచ్చు. ఈ ప్రపంచంలో
జీవితం సుఖంగా, ప్రశాంతంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కోరికలు మానవ సహజం. కోరికలు ఊరికే తీరవు. కోరిన కోరికలను నెరవేర్చుకోవడానికి దారులు వెతకాలి. సరైన దారిలో ముందుకు సాగితే అనుకున్నవి సాధించవచ్చు. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, వస్తువులు ఉన్నాయి. ఆకాశంలో చందమామను తీసుకురావాలని, మిలమిలలాడే తారలను కోసుకు రావాలని ఆశపడితే అది తీరని కోరికే అవుతుంది. పరిమితమైన జీవితానికి అవసరమైన మేరకు కోరికలనూ పరిమితం చేసుకోవాలి. తెలివిగా సాధించగలిగితే సుఖశాంతులకు ఏ లోటూ ఉండదు.
సముద్రం ప్రశాంతంగా ఉంటేనే నౌకాయానం సుఖంగా సాగుతుంది. రహదారి మీద బండి నల్లేరు మీద నడకలా సాఫీగా నడుస్తుంది. అశాంతిలో కొట్టుకుపోయేవాడికి సుఖం అందని ద్రాక్షపండు. శాంతం లేకపోతే సుఖమూ లేదు. వేదాలు పదేపదే శాంతి మంత్రాలను వల్లెవేస్తాయి. యజుర్వేదం (36-17) ఆకాశం, అంతరిక్షం, భూమి, జలం, ఓషధులు, మొక్కలు, పండితులు, పరబ్రహ్మ, పదార్థాలు, పర్యావరణం బాగుండాలని, శాంతి వర్ధిల్లాలని కోరుకుంటుంది.
ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలూ శాంతియుతంగా సహజీవనం సాగిస్తే ప్రపంచ శాంతికి చక్కని అవకాశం కలుగుతుంది. మానవ జాతులన్నీ ఏకమైతే ప్రపంచమంతాప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. లోకా లన్నీ సుఖంగా ఉండాలని, మనుషులందరూ సంతోషంగా ఉండాలని వేదం చెబుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణీ తన పరిమితుల మేరకు సుఖంగానే జీవిస్తున్నది. భూమి పైన జంతు వులు ఆహారం, నిద్ర, మైథునం అనే మూడు కోరికలకు పరిమితమై ముచ్చటగానే జీవిస్తున్నాయి. మనిషి మాత్రమే సుఖశాంతుల కోసం వెంపర్లాలాడుతున్నాడు.
మనిషి ఒక విచిత్రమైన జంతువు. భూమి పైన ఉంటూ ఆకాశానికి నిచ్చెన వేసే ఆశాజీవి. ఆలోచించడానికి మెదడు, ఆచరించడానికి చేవ- మనిషికి భగవంతుడు ఇచ్చిన వరాలు. ఈ వరాలు అందుకోవడానికి ఎన్నో జన్మలు కష్టపడి ఉండాలి. ఆ కష్టాలకు ప్రతిఫలంగా మనిషి జన్మ వచ్చింది. దుర్లభమైన మానవ జన్మను సద్వినియోగ పరచుకునే అవకాశం ఉంది. ఇంద్రియ సుఖాల కోసం తారట్లాడుతూ తీరని కోరిక అనే మరీచిక వెంటపడితే జీవితకాలం అడవి కాచిన వెన్నెల అవుతుంది. వివేకవంతుడు క్షణిక సుఖాన్ని ఇవ్వగల భౌతిక వస్తువులకు, చెడు కర్మలకు దూరంగా- శాశ్వతమైన ఆనందం పొందడానికి, ప్రశాంత జీవితం గడపడానికి, ఒక పద్ధతి ప్రకారం నడుచుకుని జీవిత పరమార్థం అందుకుంటాడు. అజ్ఞాని కదిలే వంతెన మీద కాలు జారి పాము నోట్లో పాచికలా పతనమవుతాడు. మితాహారం ఆరోగ్యానికి, హితవచనం ఆనందానికి పరమ ఔషధాలు.
ఆరుగురు శత్రువులు, ఆరుగురు మిత్రులూ ఉన్నారని గీతోపనిషత్తు చెబుతోంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం... మనిషిని మృగంగా మారుస్తాయి. వీటిని ఆసురీ శక్తులంటారు. కామాంధుడు ఒళ్ళు మరిచి తన పతనానికి తానే బాధ్యుడు అవుతాడు. అలాంటి మూఢులకు పరమార్థం చిక్కదు. పరమ పదం దక్కదు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, సహనం, శ్రద్ధ, ఏకాగ్రత, మోక్షకాంక్ష... ఈ ఆరూ మనిషికి దేవుడు అనుగ్రహించిన దివ్యాస్త్రాలు. శత్రు సంహారం సాగించి, విజయం సాధించినప్పుడే జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి!
- ఉప్పు రాఘవేంద్రరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు