గంజాయి వనంలో...
మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. సద్గుణాల ప్రభావం కొందరిలో ఎక్కువ పాలుంటుంది. దుర్గుణాల ప్రభావం ఇంకొందరిలో ఎక్కువగా ఉంటుంది. దానవుల్లోనూ ధర్మవర్తనులున్నారు. మానవుల్లోనూ ఆసురీ ప్రవృత్తిగలవారున్నారు. శ్రీరామ వనవాస సమయంలో సీతమ్మను
మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. సద్గుణాల ప్రభావం కొందరిలో ఎక్కువ పాలుంటుంది. దుర్గుణాల ప్రభావం ఇంకొందరిలో ఎక్కువగా ఉంటుంది. దానవుల్లోనూ ధర్మవర్తనులున్నారు. మానవుల్లోనూ ఆసురీ ప్రవృత్తిగలవారున్నారు. శ్రీరామ వనవాస సమయంలో సీతమ్మను అపహరించదలచిన రావణుడు మారీచుణ్ని బంగారు లేడి రూపం ధరించి, సీతను ఆకర్షించమని ఆదేశిస్తాడు. రామబాణ ప్రభావాన్ని లోగడ చవిచూసి గుణపాఠం నేర్చుకున్నవాడు కనుక రాముడి జోలికి వెళ్ళవద్దని, అతడు ధర్మ స్వరూపుడని మారీచుడు ఎంతగానో హితవు చెబుతాడు. తాను చెప్పింది చెయ్యకపోతే చంపుతానంటాడు రావణుడు. ఆ దుర్మార్గుడి చేతిలో చావడం కంటే ధర్మమూర్తి రాముడి చేతిలో చావడమే శ్రేయస్కరమనుకుని, విధిలేక మారీచుడు రావణుడి ఆనతికి తలొగ్గుతాడు. దానవ లక్షణం లేని మారీచుడు రామచంద్రమూర్తి ఆదర్శ వ్యక్తిత్వాన్ని గ్రహించిన ధార్మికుడు.
శ్రీరాముడి గురించి తెలిసిన విభీషణుడు అన్న రావణుడికి ఎంతగానో హితబోధ చేశాడు. విసిగి, రాముడి శరణు వేడుకున్నాడు. ధర్మమెటువైపు ఉంటే అక్కడే జయం లభిస్తుందని గ్రహించిన జ్ఞాని- విభీషణుడు.
ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పక్షాన ఉన్నా, ఏ వర్గాన ఉన్నా మంచిని మంచి అనే చెప్పుకొంటాం. చెడును చెడు అనే చెప్పుకొంటాం. విష్ణువును ద్వేషించడమే కాకుండా, దూషించడమే కాకుండా, శ్రీహరిని అహర్నిశలు స్మరించే ప్రహ్లాదుణ్ని, తన తనయుడని అయినా ఆలోచించక పుత్రవాత్సల్యాన్ని విస్మరించి, చిత్రహింసలకు గురిచేశాడు హిరణ్యకశిపుడు. రాముడి మీద అమితమైన వాత్సల్యమున్న కైకమ్మ మంధర దుర్బోధల వల్ల యుగయుగాల్లోనూ సర్వుల చేత దూషితురాలైపోయింది.
దానవ సాధ్వి మండోదరి భర్త రావణుడికి ఎంతగానో ధర్మబద్ధమైన సలహాలు ఇచ్చింది. అశోకవనంలో త్రిజట అనే రాక్షసి సీతకు ధైర్యం చెప్పి, తన స్వప్న వృత్తాంతం వెల్లడించి ఓదారుస్తుంది. కౌరవ సోదరుల్లో యుయుత్సుడు, వికర్ణుడు ధర్మ పరాయణులైన పాండవులనే సమర్థించారు. రాక్షసుడైనా బలిచక్రవర్తి తన దానశీలతతో కీర్తి గడించాడు. శల్యుడు కర్ణుడికి రథసారథిగా వ్యవహరించినా అర్జునుడి విజయానికే సహకరించాడు.
రాక్షస చక్రవర్తి బాణాసురుడి పుత్రిక ఉష శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుణ్ని ప్రేమించి, వివాహమాడింది. రాక్షస మహిళ హిడింబి కుమారుడు ఘటోత్కచుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ పక్షం నుంచే పోరాడి వీరమరణం పొందాడు. వీరంతా గంజాయి వనంలో తులసి మొక్కల్లాంటి వారు.
భారతావని తపోభూమిగా, పుణ్యభూమిగా, ఆర్య భూమిగా విశ్వవిఖ్యాతమైంది. మునులు, తపోధనులు, యోగులు, అవధూతలు, ప్రవచనకారులు, ఆచార్యులు, విద్వాంసులు, కళాకారులు, సమాజ సేవకులు, నాయకులు, సుపరిపాలకులు... అసంఖ్యాకంగా ఈ భూమి మీద ఆవిర్భవించారు. జాతిని ఎంతగానో ప్రభావితం చేశారు, చేస్తున్నారు. ప్రపంచానికే ఆదర్శవంతమైన జ్ఞాన వాకిలిగా విరాజిల్లుతోంది మన దేశం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల జ్ఞాన భాండాగారమంతా అందుబాటులో ఉంది. దీన్ని జాతి తన జీవన ప్రస్థానంలో సమన్వయ పరచుకోవాలి. సత్సాంగత్యం ప్రభావం అపారం. సత్కథాశ్రవణ ఫలితం అనంతం. సద్గ్రంథ పఠన అభ్యాసం ఆవశ్యకం.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె