అంతరంగ ప్రజ్ఞ
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. బయటికి కనిపించే ఆహార్యం, నడవడిక ద్వారా అతడి జ్ఞానాన్ని అంచనా వేయలేం. వ్యక్తిత్వ పాండిత్యాలను పరిశీలించ గలిగితేనే అవి బహిర్గతం అవుతాయంటారు పెద్దలు. వ్యక్తికి భుజకీర్తులు, రత్నహారాలు, చందన
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. బయటికి కనిపించే ఆహార్యం, నడవడిక ద్వారా అతడి జ్ఞానాన్ని అంచనా వేయలేం. వ్యక్తిత్వ పాండిత్యాలను పరిశీలించ గలిగితేనే అవి బహిర్గతం అవుతాయంటారు పెద్దలు. వ్యక్తికి భుజకీర్తులు, రత్నహారాలు, చందన లేపనాలు- ఇవేమీ అలంకారాలు కావు... శాస్త్ర సంస్కారంగల ప్రజ్ఞతో కూడిన నడవడి, విద్య, వివేకం, జ్ఞానం మాత్రమే నిజమైన అలంకారాలు అంటాడు భర్తృహరి. అవే సత్పురుషులకు భూషణాలనీ చెబుతాడు.
సీతాన్వేషణలో భాగంగా రాముడి దూతగా వచ్చిన ఆంజనేయుణ్ని రావణాసురుడు మొదట సాధారణ వానరుడిగా భావించాడు. ఆయన బల పరాక్రమాలను తక్కువ అంచనా వేశాడు. దూతను సంహరించడం రాజధర్మం కాదంటూ ఆ వానరుడి తోకకు నిప్పంటించమన్నాడు. ఆ తోకతోనే లంకను కాల్చి సూర్యుడిలా ఆంజనేయుడు ప్రకాశించాడని సుందరకాండ చెబుతోంది. సభా మండపంలో తనతో వాదన సమయంలో ప్రస్ఫుటమైన ప్రభు భక్తికి ముగ్ధుడై- రూపం కన్నా గుణం మిన్న అయిన ఇలాంటి చెలికాడు ఉన్నవారి జీవితం ధన్యమని రావణుడు మనసులోనే మారుతిని గురించి భావించాడని చంపూ రామాయణం చెబుతోంది.
అశోకవనంలో రాక్షస స్త్రీలు సీతను చుట్టుముట్టి రకరకాలుగా హింసిస్తుంటారు. బెదిరిస్తుంటారు. చూడటానికి రాక్షసాకారంలో ఉన్న స్త్రీ అయిన త్రిజట మాత్రం తనకు వచ్చిన కల గురించి వాళ్లకు చెప్పి సీత జోలికి వెళ్ళవద్దని హితవు పలుకుతుంది.
తల్లి కడుపులో ఉన్నప్పుడే తండ్రి శాపం వల్ల వంకరల ఆకారంతో పుట్టాడు అష్టావక్రుడు. తన ఆకృతికి కారకుడైనప్పటికీ అతడు తండ్రిని నిందించలేదు. పైగా తన తండ్రి చెరను విడిపించడానికి జనక మహారాజు కొలువుకు వెళ్ళాడు. అతడికి రాజాస్థానంలోనికి ప్రవేశానుమతి దొరకలేదు. అప్పుడు అసమాన పాండిత్యంతో అక్కడివారిని, ఆస్థాన పండితుడైన వందిని ఓడించి తన తండ్రిని విడిపించాడు. మోహిని రూపాన్ని చూసి మోసపోయి భస్మాసురుడు నాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. అదే మోహిని తన రూపంతో రాక్షసులను తప్పుదోవ పట్టించింది. రూపంవల్ల వినాయకుడు అవహేళనలు పొందినా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్లనే గణాధిపత్యాన్ని పొందాడు. తన ఘంటాన్ని వేగంగా కదిలించి వ్యాసభారతాన్నీ మనకందించాడు.
ముళ్లను చూసి దూరంగా ఉంటే గులాబి సువాసనలను ఆఘ్రాణించలేం. బురదలో నుంచి పుట్టిన పద్మం ఆ విధాతకే ఆసనమైంది. అందరూ అసహ్యించుకునే గొంగళి పురుగు కాలాంతరంలో అందమైన సీతాకోకచిలుకగా రూపాంతరం చెందుతుంది.
అందుకే ఏ వ్యక్తినైనా చూడగానే ఓ అంచనాకు రాకుండా, అతడిలోని ప్రతిభకు, ప్రేమతత్వానికి ప్రాధాన్యమివ్వాలి. పొట్టివాడైన వామనుడు బలిచక్రవర్తి అంతటివాడిని పాతాళానికి అణిచాడు. భౌతిక ఆకారాన్ని కాక అంతరంగంలోని పరమాత్మను దర్శించమనే సందేశాన్ని భగవంతుడి అవతారాలు తెలియజేస్తున్నాయి.
వివేకానందుడు అమెరికా వెళ్ళిన తొలినాళ్లలో వేషధారణ వల్ల ఎన్నో అవమానాలను ఎదుర్కోవలసి వచ్చింది. తరవాత సర్వమత మహాసభలో పాల్గొన్న ఆయన ఉపన్యాసాలు ఎలా విశ్వవ్యాప్తం అయ్యాయో అందరికీ తెలిసిందే. రంగు రూపులను అనుసరించి తీవ్ర అవమానాలను ఎదుర్కొన్న గాంధీజీ, నెల్సన్ మండేలా వంటి నాయకులు ఎందరో ఉన్నారు. తెలుపు నలుపు పొట్టి పొడుగు వంటి భౌతిక ఆకారాలను అనుసరించి ఒక వ్యక్తిని గౌరవించడం, కించపరచడం తగదు.
- గంటి ఉషాబాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. -
ధర్మ రక్షణ
సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు