గొప్ప రచయిత
మాలాకారుడు పూలు, దారం, ఆకులు, మెరిసే తీగలతో చక్కని దండను తయారు చేస్తాడు. కుంభకారుడు మట్టి, రంగులు తదితరాలతో అందమైన కుండలను, పాత్రలను రూపొందిస్తాడు. అలాగే కవి, రచయిత, శిల్పకారుడు, స్వరకర్త... తదితరులంతా రచయితలే! అద్భుతమైన ప్రావీణ్యంతో వారు ప్రజలను ఆనందింపజేస్తారు.
మాలాకారుడు పూలు, దారం, ఆకులు, మెరిసే తీగలతో చక్కని దండను తయారు చేస్తాడు. కుంభకారుడు మట్టి, రంగులు తదితరాలతో అందమైన కుండలను, పాత్రలను రూపొందిస్తాడు. అలాగే కవి, రచయిత, శిల్పకారుడు, స్వరకర్త... తదితరులంతా రచయితలే! అద్భుతమైన ప్రావీణ్యంతో వారు ప్రజలను ఆనందింపజేస్తారు. వారి తపన అంతా మనోరంజనం కోసమే. రచన అంటే దేన్నైనా కొత్తగా సృష్టించడం. రచయిత అంటే సృష్టికర్త అనే అర్థమూ ఉంది. పైన చెప్పిన వారందరినీ మించిన గొప్ప రచయిత ఒకరున్నారు. ఆయనను సృష్టికర్త, దేవదేవుడు, సర్వవ్యాపి... ఇలా ఎవరికి ఇష్టమైన పేరుతో వారు పిలుస్తారు. చరాచర ప్రాణులు, నదులు, పర్వతాలు, ఆకాశం... అదీ ఇదీ అని లేకుండా పిపీలికాది బ్రహ్మ పర్యంతం, అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నింటినీ సృష్టించింది ఆయనే.
పరమాత్మ ఈ భువనాలను, విశ్వాన్ని, సృష్టిని, ప్రకృతిని ఎలా రచించాడనే విషయాన్ని తెలుసుకోవాలి. అందులో అంతర్భాగంగా ఈ చరాచర సృష్టిని రచించాడనీ గ్రహించాలి. ఆ విషయం తెలుసుకొంటే ఆ సృష్టికర్త రచనా సంవిధానం అర్థమవుతుంది. విశ్వసృష్టి రచనను ఉపనిషద్రష్టలు, మహాత్ములు, రుషులు సమాధి స్థితిలో అంతర్నేత్రంతో పరిశీలించి దాని స్వరూప స్వభావాలను మనకు తెలిసేలా చెప్పారు. వారు గమనించిన ప్రక్రియ అంతా భౌతిక సృష్టి ఏర్పడటానికి ముందు జరిగిన ఆధ్యాత్మిక ప్రక్రియ.
ఉపనిషత్తుల్లో, ఇంకా ఇతర గ్రంథాల్లో విశ్వసృష్టి రచన గురించి విశదీకరణ ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. దాన్ని తత్త్వ దృష్టితోనే చూడాలి తప్ప పరిమితమైన మానవ మేధతో అంచనా వేసే ప్రయత్నం చేయడం సరికాదు. ఈ అనంత సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ప్రకాశిస్తూ ఉండేవాడు. ఈ పరిణామ జగత్తు అప్పుడు లేదు. ఈ పరమాత్మే అన్ని లోకాలనూ సృష్టి చేయడానికి సంకల్పించి, ఆ ప్రక్రియకు పూనుకొన్నాడు. అలాంటి విశ్వ రచయితకు నమస్కారం అని ఐతరేయోపనిషత్ ప్రథమాధ్యాయం ప్రథమ ఖండం స్పష్టంగా చెప్పింది.
ఈ జగత్తు రచనకు కారణమైన సృష్టికర్తకు వ్యాప్తిత్వం, నిత్యత్వం, సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వాత్మకం అనే ధర్మాలున్నాయని బ్రహ్మసూత్రాల వల్ల తెలుస్తోంది. ఆ శక్తుల వల్ల ఆయన చేసిన విశ్వ రచనలో భాగాలైన చీకటిని, కష్టాలను, సమస్యలను, హెచ్చుతగ్గులను చూసి ఆయన సృష్టిని విమర్శించేవారు ఉన్నారు. ఆయనే సృష్టించిన సంతోషం, ఆనందం, వెలుగు లాంటివి- ప్రతికూల పరిస్థితుల తరవాత మరింత ప్రభావాన్వితమవుతాయి.
విశ్వం, ప్రపంచం, దేశం, ప్రాంతం, స్థానం... ఇలా అన్ని చోట్లా ఎన్నింటినో రచించే ఆయన రచన రుచిరం అనేవారు, రుచించని వారూ ఉంటారు. మరోవైపున ఆ విశ్వ రచయితకు సైతం రూప రచన చేసే వారూ ఎందరో. ఎవరికి నచ్చిన విధంగా వారు ఆయన రూపాన్ని రచన చేస్తారు. అది మానసికంగా, భౌతికంగా కూడా కావచ్చు. ఆ రూపాన్ని మదిలో పదిలపరచుకొనేవారు కొందరైతే, బహిర్గతం చేసేవారు మరికొందరు. ఆరాధించేవారు కొందరైతే, అందలం ఎక్కించేవారు ఇంకొందరు. విమర్శించేవారు కొందరైతే, వివాదాలకు దిగేవారు మరికొందరు. వాటిలో దేనితోనూ ఆయనకు సంబంధం ఉండదు. వేటికీ ఆయన వత్తాసు పలకడు. వద్దని వారించడు. తన కర్తవ్యం తాను నిర్వర్తించడమే ఆయన పని. విశ్వ రచనే ఆయన నిరంతర ప్రక్రియ...
- అయ్యగారి శ్రీనివాసరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిలువపై సత్య సందేశం
ఒక బోధకుడు రాత్రిపూట ఒక అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఒక దొంగ ఆ బోధకుడిని అడ్డగించాడు. ‘నీవద్దనున్న సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తాను’ అంటూ కత్తి చూపి భయపెట్టాడు. -
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు