ముక్తికి మార్గం భక్తే
భక్తి- పలకడానికి చాలా చిన్న పదం. కానీ ఏ వ్యక్తి అయినా నిర్మల, నిశ్చలమైన భక్తిమార్గంలో పయనిస్తే తద్వారా వారికి లభించే ఫలితాంశం- అద్భుతం, అమృతమయం. భగవంతుణ్ని ప్రేమించడంలో, పూజించడంలో, సేవించడంలో, కీర్తించడంలో కలిగే అనురాగమే
భక్తి- పలకడానికి చాలా చిన్న పదం. కానీ ఏ వ్యక్తి అయినా నిర్మల, నిశ్చలమైన భక్తిమార్గంలో పయనిస్తే తద్వారా వారికి లభించే ఫలితాంశం- అద్భుతం, అమృతమయం. భగవంతుణ్ని ప్రేమించడంలో, పూజించడంలో, సేవించడంలో, కీర్తించడంలో కలిగే అనురాగమే భక్తి అంటూ చక్కటి వివరణ ఇచ్చారు వేద వ్యాసులవారు. పరమాత్ముడు సర్వజీవుల్లో ఉన్నాడు. ప్రతి జీవిపై ప్రేమ కలిగి ఉండటమే నిజమైన భక్తి అంటూ సూక్ష్మ పద్ధతిలో భక్తి గురించి తెలియజేశారు నారదమహర్షి. ఆత్మానందానికి దోహదపడే విషయాలను ప్రోత్సహించే ప్రక్రియే భక్తి అంటూ వివరించారు శాండిల్య మహాముని. అన్నింటికీ ఆధారభూతమైన పరమాత్మ తత్త్వచింతనను భక్తి అని చెప్పుకోవాలి అంటారు జగద్గురువు ఆదిశంకరాచార్య.
మోక్షాన్ని సాధించే ముఖ్యమార్గాల్లో భక్తిని ఎన్నుకొని దానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు జ్ఞానజనులు. కలియుగంలో మోక్షసాధనకు అనువైన, అవసరమైన మార్గాల్లో భక్తి మార్గమే విశిష్టమైనదని ఆదిశంకరులవారు పలుచోట్ల వివరించారు. స్వార్థపూరితమైన కోర్కెలు మనిషిలో అంకురించాయంటే చిత్తశుద్ధికి ఆటంకమేర్పడి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సముపార్జనకు, తద్వారా లభించే మోక్షగతికి అడ్డుకట్ట వేసినట్టవుతుంది.
భక్తి తొమ్మిది రకాలు- శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, సఖ్యం, ఆత్మనివేదనం, పాదసేవనం, దాస్యం. సర్వేంద్రియాలను భగవంతు డిపైనే నవవిధ భక్తుల్లో ఏదైనా పాటిస్తూ తమ సర్వస్వాన్ని ఎవరైతే అర్పించగలుగుతారో వారే నిజమైన భక్తులు. అలా అర్పించడాన్ని పరమ భక్తి అంటారు. భక్తి మార్గాన్ని భక్తియోగం అనీ అంటారు. నారదుడు, వాల్మీకి, హనుమంతుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, పోతన... వంటి మహ నీయులు నవవిధ భక్తి మార్గాల్లో వారికి అనుకూలమైనదాన్ని అను సరించి ఆత్మజ్ఞానాన్ని పొంది మాన వాళికి మార్గదర్శకులై నిలిచారు.
భాగవతంలో పోతన రచించిన మధురాతి మధుర ఘట్టాల్లో కుచేలోపాఖ్యానం ఒకటి. లౌకిక, వేదాంత విషయాలు రెండూ మేళవించి రచించిన గాథ అది. నవవిధ భక్తిమార్గాల్లో సఖ్యభక్తి మార్గానికి చెందిన కథ ఇది. స్నేహితుల పట్ల ధన మదాంధతను ప్రకటించరాదని, వారికి సాయం చేయడమే కర్తవ్యంగా భావించడం స్నేహధర్మమని అది చెబుతోంది. కుచేలం అంటే జీర్ణవస్త్రం. కుచేలుడు సుచేలుడు కావాలంటే శ్రీహరి కటాక్షం ఉండి తీరాలన్న ఆధ్యాత్మిక రహస్యం ఇందులో ఇమిడి ఉంది. భక్తి అన్నది సంపూర్ణ విశ్వాసంతో నిండి ఉండాలి. అంతా ఆ పరమాత్మే అనే నమ్మకం ప్రధానం.
ఆదిశంకరుల వారు శివానందలహరిలో జ్ఞాని అయిన భక్తుడు మానసిక పూజలో తన హృదయాన్ని భగవంతుడికి ఆలయంగా చేసి శమ దమాలతో స్థలశుద్ధి చేసి అందులో సర్వేశ్వరుణ్ని ప్రతిష్ఠించమన్నారు. ఈ పూజా విధానంలో ధూప, దీప, నైవేద్యాలు ఏవీ పెట్టనక్కరలేదు. కేవలం తన మనసులోనే అన్నీ సిద్ధం చేసి పూజ చేసుకొంటున్నట్టు భావించాలి. చివరికి సర్వం ఆ పరమేశ్వరుడికే సమర్పించినట్టుగా చెప్పుకోవాలి. దీనికి పరిపక్వత చెందిన భక్తి ప్రధానం. చిత్తశుద్ధితో పూజలు చేస్తూ అదే విశ్వాసంతో భక్తి అనే నావలో పయనం సాగిస్తే భవసాగరాన్ని సులభంగా దాటుకోగలం అంటారు శంకరులవారు. ఆయన సూచించిన దారిలో మనమూ పయనిద్దాం.
- యం.సి.శివశంకర శాస్త్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. -
ధర్మ రక్షణ
సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్