వాక్కులే వరాలు
మన మనసేమిటో వాక్కుల ద్వారా వెల్లడవుతుంది. ఆత్మీయత, ఆప్యాయతానురాగాలు మాటల్లో అమృతాన్ని నింపుతాయి. అసూయ, ద్వేషం నిండిన వాక్కులు విషాన్ని వెదజల్లుతాయి. వాక్కులే మన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. వాక్కులతో పాటు ముఖ కవళికలు, శరీర
మన మనసేమిటో వాక్కుల ద్వారా వెల్లడవుతుంది. ఆత్మీయత, ఆప్యాయతానురాగాలు మాటల్లో అమృతాన్ని నింపుతాయి. అసూయ, ద్వేషం నిండిన వాక్కులు విషాన్ని వెదజల్లుతాయి. వాక్కులే మన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. వాక్కులతో పాటు ముఖ కవళికలు, శరీర కదలికలూ ఎంతో ప్రాముఖ్యం వహిస్తాయి. రుష్య మూక పర్వతం మీదకు తరలివస్తున్న రామలక్ష్మణులను చూస్తూనే- వాలి భయం ఆవహించిన సుగ్రీవుడు కంపించిపోతాడు. తనను అంతం చెయ్యడానికి ఆ ఇద్దరినీ వాలి పంపాడేమోనన్న శంక కలిగి, వివరాలు తెలుసుకురమ్మని ఆంజనేయుణ్ని పంపిస్తాడు. కామరూపుడైన మారుతి రూపం మార్చుకుని వెళ్ళి రామలక్ష్మణుల వివరాల్ని ఎంతో వినయంగా, సంస్కారయుతంగా అడిగి తెలుసుకుంటాడు. రాముడు ఆంజనేయుడి మృదు సంభాషణ గురించి లక్ష్మణుడికి ఎంతో గొప్పగా ప్రశంసాపూర్వకంగా చెబుతాడు. ఉన్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, అనవసర శరీర విన్యాసాలు, తల ఎగురవెయ్యడం లాంటి వికార చేష్టలు లేకుండా ఆంజనేయుడు మాట్లాడతాడు. ఇక్కడ వాల్మీకి రాముడి పాత్రపరంగా హనుమ గురించి ప్రస్తా వించిన అంశాలు, ఇప్పటి కాలంలో మనం చెప్పుకొనే వ్యక్తిత్వ వికాసానికి మూలసూత్రాలు. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అవి ఎంతో ఉపకరించే మార్గదర్శకాలు. పురాణ, ఇతిహాసాల పట్ల చులకన, నిర్లక్ష్యం చూపనివాళ్లకు ఇలాంటి అమూల్య రత్నాలనదగినవి ఎన్నో లభిస్తాయి.
కాళిదాసు శివపార్వతుల అనుబంధాన్ని వాక్కు, అర్థం (వాగర్థాల) మధ్యగల అవినాభావ సంబంధంగా చెబుతాడు. నిజానికి ఇలాంటి అనుబంధం అందరు దంపతుల మధ్యా ఉండాలి. పురుషాధిక్యంతో పరుషంగా మాట్లాడే భర్త చేజేతులా తన సంసారాన్ని కలతలపాలు చేసుకుంటాడు. గయ్యాళి భార్య అయినా అంతే. వాక్కులను పరిమళభరిత పుష్పాలుగా, మృదువుగా ఎదుటివారి మనసును తాకేలా మలచడానికి మనకు మనం తర్ఫీదు ఇచ్చుకోవాలి.
పరీక్షిత్తుకు శాపం ఇచ్చిన మునిబాలకుడు, బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వత్థామ (మంత్రాలనే వాక్కుల ద్వారా) ఉపసంహరించుకోలేని అసమర్థులు కావడం వల్ల అనర్థం వాటిల్లింది. శాపం అంటే తపస్సు ద్వారా ఆర్జించిన అమూల్య దివ్యశక్తిని దుర్వినియోగం చెయ్యడం. వరం అంటే సద్వినియోగం చెయ్యడం. తాపసులు తామసులు కాకూడదు. శివాంశ సంభూతుడైనా తామస లక్షణం వల్ల దుర్వాసుడికి చెడ్డ పేరు వచ్చింది.
అల్పాయుష్కుడైన మార్కండేయుడు నారద మహర్షి సహృదయ వాక్కులతో ఇచ్చిన ఆశీస్సులతో చిరంజీవి అయ్యాడు. ఆదిశంకరులు బీద ఇల్లాలు భక్తితో ఇచ్చిన అమలక ఫలం స్వీకరిస్తూనే, కరుణ ఉప్పొంగి ఆశువుగా కనకధారాస్తవం చెప్పగానే- అమ్మవారు బంగారు ఉసిరికాయలు వర్షించినట్లు చెబుతారు. అలా ఉంటుంది వాక్కుల శక్తి. బాధాతప్త హృదయానికి పన్నీటిజల్లు లాంటి ఓదార్పు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఆ చల్లని మాటలు అగ్నిలా దహిస్తున్న బాధను ఉపశమింపజేస్తాయి. శ్రీరామ విరహాగ్నిలో తపించిపోతున్న సీతమ్మ తల్లికి ఆంజనేయుడి రామసందేశ వాక్కులు సంజీవని చినుకుల్లా సంబరం కలిగిస్తాయి. ఆశల్ని పునరుజ్జీవింపజేస్తాయి.
ప్రతి మాటా బీజాక్షరాల సంపుటి. అది అక్షర దేవతల అద్భుత శక్తితో నిండి ఉంటుంది. వాటిని పూలబాణాల్లా, శుభకామనలుగా ప్రయోగించినప్పుడు వాక్కులే వరాలవుతాయి. పరిపక్వమైన ఆధ్యాత్మికత కలవారి వాక్కులన్నీ వరాల మూటలే. మన మాటల్ని కూడా వరవీణా మృదురాగాలుగా మార్చుకొనే ప్రయత్నం చేద్దాం.
- కాటూరు రవీంద్రత్రివిక్రమ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.