మయూరుడి సూర్యశతకం
సూర్యుడు ప్రత్యక్ష దైవం. సకల జగతికి చైతన్యకారకుడు. కర్మసాక్షి. సూర్యుడి పరంగా వివిధ భాషల్లో వివిధ ప్రక్రియల్లో అపారమైన సాహిత్యం వెలువడింది. సంస్కృతంలో మయూరుడు రచించిన సూర్యశతకం సౌరసాహితిలో శ్రేష్ఠమైన కావ్యం. మయూరభట్టు కశ్మీర ప్రాంతానికి చెందిన కవి.
సూర్యుడు ప్రత్యక్ష దైవం. సకల జగతికి చైతన్యకారకుడు. కర్మసాక్షి. సూర్యుడి పరంగా వివిధ భాషల్లో వివిధ ప్రక్రియల్లో అపారమైన సాహిత్యం వెలువడింది. సంస్కృతంలో మయూరుడు రచించిన సూర్యశతకం సౌరసాహితిలో శ్రేష్ఠమైన కావ్యం. మయూరభట్టు కశ్మీర ప్రాంతానికి చెందిన కవి. క్రీ.శ. ఏడో శతాబ్దానికి చెందినవాడు. హర్షుడి ఆస్థానకవి. బాణుడు కూడా హర్షుడి ఆస్థానంలో ఉండేవాడు. అతడు మయూరుడి అల్లుడని కొందరు భావిస్తున్నారు. పద్మగుప్తుడు రచించిన ‘నవసాహసాంక’ చరిత్రనుబట్టి బాణమయూరులకు స్పర్ధ ఉండేదని తెలుస్తోంది. ఒక సందర్భంలో బాణుడు కోపంతో మయూరుణ్ని కుష్ఠురోగివి కమ్మని శాపం ఇస్తే మయూరుడు ఆగ్రహించి ప్రతిశాపం ఇచ్చాడట. మయూరుడు సూర్యశతకం రాసి శాపవిముక్తి పొందగా, బాణుడు చండీ శతక రచనతో శాపంనుంచి విముక్తుడయ్యాడని జనశ్రుతి. ఈ ఉదంతానికి సంబంధించిన శ్లోకాలూ ప్రచారంలో ఉన్నాయి. ఇందులో సత్యమెంత ఉన్నా ఇద్దరూ సమకాలికులనే విషయం చారిత్రక వాస్తవం.
మయూరుడి సూర్యశతకంలో సూర్యకిరణాలు, సూర్యాశ్వాలు, రథసారథి అరుణుడు, సూర్యమండలం అనే అంశాల వర్ణన ఉంది. సూర్యుడు ప్రకాశించేటప్పుడు భూమ్మీద జరిగే పరిణామాలు, సూర్యుడి సార్వ భౌమత్వం... శతకంలో చోటు చేసు కొన్నాయి. సూర్య తత్వాన్ని విపులంగా వివరించాడు. కవి స్రగ్ధర ఛందస్సులో శతకం రాశారు. శైలి ఓజో గుణ ప్రధానం. గౌడీ రీతిలో ఉంది. కవిత్వం ప్రౌఢమైంది.
కవి ప్రతి శ్లోకం చివర లోకులకు సూర్యుడు శుభం కలిగించాలని, ప్రజల్ని రక్షించాలని, వారి పాపాలు నశింపజేయాలని ప్రార్థించాడు. తన ఆరోగ్యం కాంక్షించి మయూరుడు ఈ రచన చేసినట్లు జనంలో ప్రచారం ఉన్నా లోక కల్యాణమే లక్ష్యంగా రచన సాగినట్లు స్పష్టమవుతోంది.
సూర్యకిరణాల వైశిష్ట్యాన్ని కవి అనేక విధాలుగా వర్ణించాడు. అవి సమూహంగా ఏకైక వస్తువు. వివిధ ప్రాణులు వస్తువుల రూపాలను తమ రెండు కళ్లతో చూడటానికి సహకరిస్తాయి. కనుక, రెండు నేత్రాల వంటివి. ముల్లోకాల్లోనూ బ్రహ్మదేవుడి నాలుగు నోళ్ల నుంచి సూర్య స్తుతి వినిపిస్తుంది. సూర్య కిరణాలు అగ్ని రూపాలు గనుక పంచభూతాల్లో అయిదోదిగా ఉన్నాయి. రవి కిరణాలు ఆరు రుతువుల్లోనూ ఆరు విధాలుగా ఉంటాయి. సప్తరుషులు నిత్యం సూర్య తేజాన్ని నుతిస్తారు. సూర్యకిరణాలు అష్ట దిక్కుల్ని ఆశ్రయించి ఉంటాయి. అవి ప్రాతః కాలంలో నవత్వాన్ని అంటే కొత్తదనాన్ని పొందుతాయి. నవ అంటే తొమ్మిది అనే అర్థం ఉంది కదా. సూర్యుడు సహస్ర కిరణుడు. వెయ్యి అంటే దశశతకం. ఈ విధంగా బహుసంఖ్యా భేదాన్ని ఇవి సూచిస్తున్నాయని కవి చమత్కారం.
సూర్యరశ్మి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వృక్ష జాతులు పెరుగుతున్నాయి. సకల ప్రాణులకు ఆహారం లభిస్తోంది. ఈ విధంగా రవి జగదుత్పత్తికి, వృద్ధికి, స్థితికి హేతువై తానే బ్రహ్మగా, విష్ణువుగా పాత్ర నిర్వహిస్తున్నాడు. భానుడు తన వివిధ ధర్మాల మూలంగా శివుడి అష్టమూర్తిగానూ ప్రకాశిస్తున్నాడు. ఇటువంటి విలక్షణమైన భావాలను పొందుపరచిన కవి- వేదాలు సూర్యభగవానుడి రూపమేనంటాడు.
శ్రీనాథుడు కాశీఖండంలో ఈ శతకంలోని కొన్ని శ్లోకాలను ఆంధ్రీకరించాడు. వేదపురాణ శాస్త్రాల్లోని విభిన్నాంశాలను ప్రతిబింబించే ఈ శతకం ఉత్తమ పారాయణ గ్రంథం. సూర్యోపాసకులకు కల్పతరువు.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. -
ధర్మ రక్షణ
సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది. -
శివ మహిమ
ప్రపంచాన్ని నిర్వహించే పరమ చైతన్యాన్ని ‘జ్యోతి’గా వేదం వర్ణించింది. సూర్య, నక్షత్రాదులకూ ప్రకాశాన్నిచ్చి, విశ్వ చలనానికి హేతువైన ఆ ‘పరంజ్యోతి’ శుద్ధమై, శాంతమై, శుభమై ఉన్న స్వయంప్రకాశ పరమేశ్వర స్వరూపం. -
వనితా వందనం
సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. కానీ పురుషులు తామే అధికులమని అహంకరిస్తారు. నిజానికి ఆమెలేని అతడి జీవితం అర్థరహితం. మగవారి జీవితంలో మగువ మధురభావన. మగువ మానవ మనుగడలో మాధుర్యం నింపి వెలుగునిస్తుంది. అతడి వెనక ఆమె నిలబడి తగు సలహాలను ఇచ్చి విజయపథంలో నడిపిస్తుంది. -
మనో నియంత్రణ
మానవుడి దేహంలోని అన్ని ఇంద్రియాలూ పనిచేయడానికి మూలం మనసేనని రామాయణం చెబుతోంది. మనసే అన్నింటికీ మూలమని అందరూ అంగీకరించే సత్యం. మనసు ప్రేరేపించకుండా ఏ మనిషీ ఏ పనీ చేయలేడు. -
అసలు కథ
‘మరణం సంభవించే క్షణం’ అనే విషయమై చాలా ఏళ్ల క్రితం ఓంటారియో శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు చేసింది. గమనించిన అంశాలను వారు మాంట్రియల్ గెజిట్లో ప్రకటించారు. గుండె కవాటాల మార్పిడిలో అత్యంత నిపుణుడిగా పేరొందిన డాక్టర్ విల్ఫ్రెడ్ జి.బ్రెజిలో వాటిని సోదాహరణంగా వివరించారు. -
నమ్మకమే నడిపిస్తుంది!
అప్పటివరకూ నేల మీద పాకుతాడు పసిబిడ్డడు. నడవగలననే నమ్మకం ఆ బిడ్డను తొలిఅడుగు వేసేటట్టు చేస్తుంది. నమ్మకంతో వేసిన ఆ తొలి అడుగే అతడి సర్వతోముఖాభివృద్ధికి కారణమవుతుంది. స్వప్నసాకారానికి పూర్వ రూపం నమ్మకం. సహజంగానో, సిద్ధంగానో మనిషిలో ఉండే చైతన్య స్వరూపమే నమ్మకం. -
ధనవ్యామోహం
మనిషి డబ్బును సృష్టించాడు. తాను సృష్టించిన ధనానికి దాసుడయ్యాడు. అంతులేని ధనదాహం దీర్ఘవ్యాధిలా మనిషిని వ్యాకులపరుస్తుంది. బాధను రగులుస్తుంది. గృహాల్లో ప్రశాంతతను చెడగొడుతుంది. -
శంఖం చరిత్ర
ఆధ్యాత్మికంగా శంఖం పవిత్రతకు చిహ్నం, శుభాలకు సూచిక, వైజ్ఞానిక ప్రయోజనాల ఖని. అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో పాలసముద్రం నుంచి అది బయటకు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. దానికే పాంచజన్యం అని పేరు. దాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించాడు. దాని తరవాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా ఆయనే స్వీకరించాడు. -
సమయమే సంపద
మనిషి తనకు ఇష్టమైన పని అయితే ఎంత సమయమైనా వెచ్చిస్తాడు. ఇష్టం కాని పనిని కష్టంగా భావించి అసలు సమయమే కేటాయించడు. జీవితం ఎంతో అమూల్యమైంది. సమయం అంతకు మించి విలువైంది. -
విజయీభవ
భయపడేవాడిని లోకం మరింత భయపెడుతుంది. భయంతో కుంచించుకుపోయిన మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. భయానికి విరుగుడు సాహసం. ధైర్య సాహసాలున్న చోట అపజయానికి చోటుండదు. భయానికి ఎదురొడ్డి నిలబడటమే విజయానికి తొలి సోపానం.
తాజా వార్తలు (Latest News)
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై