తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా భక్తులు ఆరాధించే దివ్య స్వరూపుడు! యజ్ఞయశస్సు, స్థలతేజస్సు, ఉత్సవ ఉషస్సు సమ్మిళితమైన తిరుమల క్షేత్రం భూలోక వైకుంఠంగా భాసిల్లుతోంది.
శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా భక్తులు ఆరాధించే దివ్య స్వరూపుడు! యజ్ఞయశస్సు, స్థలతేజస్సు, ఉత్సవ ఉషస్సు సమ్మిళితమైన తిరుమల క్షేత్రం భూలోక వైకుంఠంగా భాసిల్లుతోంది. శ్రీనివాస పరంజ్యోతి తిరుమల సన్నిధి వార్షిక బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ప్రతి సంవత్సరం సూర్యుడు కన్యారాశిలో ఉన్న మాసంలో చిత్తా నక్షత్రం నుంచి శ్రవణా నక్షత్రం ఉన్నరోజు వరకు నవనవోన్మేషంగా, నయనానందకరంగా బ్రహ్మోత్సవ సంరంభం కొనసాగుతుంది. వరాహ, భవిష్యోత్తర స్కాంద పురాణాల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రశస్తి కనిపిస్తుంది. తిరుమలేశుడికి ఏటా నిర్వహించే నాలుగు వందల పైచిలుకు ఉత్సవాలలో సర్వోత్కృష్టమైన కైంకర్యం- బ్రహ్మోత్సవ సంబరం!
చారిత్రకంగా పరిశీలిస్తే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి 58కి పైగా శాసనాలు అనేక విషయాల్ని వెల్లడిస్తున్నాయి. క్రీ.శ. 966 సంవత్సరంలో పల్లవరాణి పేరిందేవి శాసనం నుంచి క్రీ.శ. 1606 సంవత్సరం బొక్కసం కృష్ణయ్యర్ శాసనం వరకు అన్నీ బ్రహ్మోత్సవ వైభవాన్ని విశ్లేషిస్తున్నాయి. క్రీ.శ. 1254లో పల్లవరాజు విజయగండ గోపాల దేవుడు ‘ఆడి తిరునాళ్లు’ పేరుతో, క్రీ.శ. 1328లో తిరువేంకటనాథ రాయలు ‘దేవదివ్యోత్సవాలు’ పేరుతో బ్రహ్మోత్సవాల్ని నిర్వహించారు.
పరమాత్ముడైన పరంధాముడు తనను దర్శించడానికి వచ్చిన భక్తుల సమక్షానికి తానే మలయప్పగా సపరివారంగా తరలిరావడం బ్రహ్మోత్సవ ప్రత్యే కత! తిరుమాడ వీధుల్లో బారులు తీరిన భక్తజన సందోహం మధ్యకు సర్వాలంకార శోభితంగా, ఇరు దేవేరులతో కోనేటిరాయడు వివిధ వాహనాలపై విచ్చేస్తాడు.
బ్రహ్మోత్సవ సందడిలో ప్రాభవమంతా ఉత్సవమూర్తి మలయప్పస్వామిదే! భోగ శ్రీనివాస, కొలువు శ్రీనివాస, ఉగ్ర శ్రీనివాస అనే ‘ఉత్సవ బేరాలు’ ఉన్నా, ఉత్సవ వైభవమంతా 14వ శతాబ్దం నుంచీ మలయప్పకే ఆపాదితమవుతోంది. ‘బృహత్తర- వృద్ధితమ’ అనే జంట సంప్రదాయాలతో తొమ్మిది రోజులపాటు నిర్విరామంగా కొనసాగే బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఉదయం, సాయంత్రం శ్రీవారు రెండు వాహనసేవల్ని స్వీకరిస్తారు. స్వామి విహరించే వాహనాలన్నీ వైవిధ్యమైన శక్తులకు, విలక్షణ యుక్తులకు ప్రతీకలు. ఈ వాహన సేవలు శుభదాయక సందేశాల్ని అందిస్తాయి. శేషవాహనం నిత్య చైతన్యాన్ని, హంస నిర్మల హృదయాన్ని, సింహం మనోస్థైర్యాన్ని, ముత్యపు పందిరి ఆనందతత్త్వాన్ని, కల్పవృక్షం అభీష్ట సిద్ధిని, సర్వభూపాలం కీర్తిని, గరుడం అమేయశక్తిని, హనుమంతం బుద్ధిశక్తిని, గజం దార్శనికతను, సూర్యచంద్ర ప్రభలు క్రాంతిర్మయత్వాన్ని, అశ్వం కాలనియమ విచక్షణను సంకేతిస్తాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం అంకురార్పణతో ఆరంభమవుతుంది. ఇది మానవ దేహం ఆవిష్కారాన్ని సూచిస్తుంది. అంకురించిన ఆ చిగురులోనూ ఆత్మతత్త్వం ప్రకటితమవుతుంది. ఈ ఆత్మశోధనలో జీవి, తన జన్మకు ముందు తొమ్మిది నెలలపాటు గర్భాలయంలో కొలువై ఉంటుంది. ఈ తొమ్మిది నెలలకు ప్రతిఫలనంగా పరంధాముడు తొమ్మిదిరోజులపాటు జీవుల ఆత్మోద్ధరణకు పలు వాహనాలపై ఊరేగుతాడు. ఆత్మకు అభ్యున్నతి చేకూర్చడానికి పరమాత్మే జీవులకు ఎన్నో అలౌకికమైన సందేశాల్ని అనుగ్రహిస్తాడు. శ్రీవారి అనుగ్రహ విశేష సమాహారమే- బ్రహ్మోత్సవ దివ్యదర్శనం!
- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ