శివతత్త్వం
ఆనందం శివుడి స్వభావం. ఆనందం శివుడి స్వరూపం. శివతత్త్వాన్ని అధ్యయనం చేయడం అంటే అచ్చమైన ఆనందంతో పరిచయం పెంచుకోవడమే! పరమ శివానంద స్థితిని సాధించడమే మనిషికి లక్ష్యం. ఈశ్వర చైతన్యాన్ని సత్యం, శివం, సుందరం అని వర్ణించింది వేదం.
ఆనందం శివుడి స్వభావం. ఆనందం శివుడి స్వరూపం. శివతత్త్వాన్ని అధ్యయనం చేయడం అంటే అచ్చమైన ఆనందంతో పరిచయం పెంచుకోవడమే! పరమ శివానంద స్థితిని సాధించడమే మనిషికి లక్ష్యం. ఈశ్వర చైతన్యాన్ని సత్యం, శివం, సుందరం అని వర్ణించింది వేదం. ఇరువైపులా గల సత్యం, సుందరం- మధ్యలో ఉన్న శివుణ్ని ఆవరించి ఉంటాయి. మనం శివుణ్ని ఆశ్రయిస్తే ఆ రెండింటితో స్నేహం కుదురుతుంది.
‘ఈశావాస్య మిదం సర్వం’ అని చెబుతోంది వేదం. ఈ చరాచర జగత్తు సర్వస్వం ఈశ్వరుడి చైతన్యంలోనే మునిగి ఉందని ఆ మాటకు తాత్పర్యం. భగవంతుణ్ని స్థాణువు అన్నారు. ఎక్కడికీ కదలని వాడని దాని అర్థం. అంటే కదలలేక పోవడం కాదు, కదలడానికి వేరే చోటు లేకపోవడం. అణువణువునా అంతటా నిండిపోయినవాడు వేరే ఎక్కడికని కదులుతాడు? అందుకే కదిలేందుకు ఇక చోటులేక స్థాణువుగా మిగిలిపోయాడు.
శివుడు అభిషేక ప్రియుడు. అభిషేక విధికి కుల మత వర్గాలతో పని లేదు. ఆయన అందరి దేవుడు. భక్త సులభుడు. ‘నీలకంఠుని శిరస్సుపై నీళ్లుజల్లి పత్రి ఇసుమంత ఎవ్వడు పారవైచునో వాడింట కామధేనువు నిలుస్తుంది, కల్పతరువు మొలుస్తుంది’ అని రాజశేఖర చరిత్రలో మాదయగారి మల్లన చెప్పిన మాట- శివుడి నిరాడంబరత్వానికి చిహ్నం. ఎవరో తెచ్చిన ద్రవ్యాలతో, ఇచ్చిన పంచామృతాలతో మరెవరో అభిషేకిస్తుంటే ఊరికే నిలబడి చూస్తున్న వారికి సైతం ఆ దృశ్యం అద్భుతంగాను, ఆనందంగాను అనిపించడం శివ చైతన్యానికి ఆనవాలు. హంగులూ ఆర్భాటాలకు దూరంగా ఉంటాయి శివాలయాలు. ప్రశాంతంగా ఉంటాయి గర్భగుడులు. తృప్తిగా తీరిగ్గా లభిస్తుంది ఆయన దర్శనం! అర్చన సైతం నిరాడంబరం. పల్లెల్లో అడుగడుగునా శివాలయాలు నెలకొనడానికి అదే కారణం. భక్తితో చిత్తశుద్ధితో తనను సేవించే వారందరినీ ఆదుకోవడం ఆయన స్వభావం. పశుపక్ష్యాదులు, జంతువులు సైతం ఆయన కారుణ్యానికి అర్హమైనవేనని శ్రీకాళహస్తి సాక్ష్యం చెబుతోంది.
అమృతాన్ని సాధించాలని దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం సాగించారు. అమృతం కన్నా ముందు కాలకూట విషం పుట్టుకొచ్చింది. పార్వతి ఎలా స్పందించింది? ‘లోక క్షేమం కోసమేగా... పోన్లే మింగెయ్యి’ అని భర్తకు సలహా ఇచ్చింది. పోతన ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ గొప్ప పద్యం చెప్పాడు. ‘మ్రింగెడిది గరళమనియును, మేలని ప్రజకున్ మ్రింగుమనె సర్వమంగళ’ అన్నాడు. సర్వమంగళ అనడంలో ఉంది ఆయువుపట్టు. ‘మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో’ అనే చివరి వాక్యానికి అదే ప్రాణం. ఇక్కడో రహస్యం ఉంది. సూత్రం అంటే పుస్తెల తాడు అని ఒకటే కాదు. ఆ మాటకు సిద్ధాంతం అనే అర్థమూ ఉంది. లోకక్షేమం, సర్వదా మంగళం ఆమె సిద్ధాంతాలు. పార్వతి ఆ సిద్ధాంతాలకు కట్టుబడిందని ఆ పద్యంలోని అంతరార్థం. అన్యోన్యత అనే పదానికి ఆది దంపతులు ఇచ్చిన నిర్వచనం లాంటిది ఆ పద్యం! వారిద్దరూ వాగర్థాల్లాంటివారు- అన్న కాళిదాసు మాటను మనం ఈ కోణంలోంచి అర్థం చేసుకోవాలి. వారిద్దరూ పేరుకే ఇద్దరు. దేహం, భావం, సిద్ధాంతం... అన్నీ ఒక్కటే! లోకంలోని జంటలన్నింటికీ వారు ఆదర్శం. ఈ రహస్యం ఎరిగింది కాబట్టి రుక్మిణీదేవి ‘నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్’ అంటూ వారిని ఆది పురాణ దంపతులుగా ఆరాధించింది. కృష్ణుణ్ని తనకు పెనిమిటిని చేయమని ప్రార్థించింది. అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఈ దారిలో ఆలోచించాలి. ఈ ఆధునిక యుగంలో దాని అవసరాన్ని గుర్తించాలి. ప్రశాంత జీవనాన్ని ఆశించేవారు పరమశివుణ్ని ఆశ్రయిస్తారు.
- వై.శ్రీలక్ష్మి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?