ఉండకూడని లక్షణం
భాగవతంలో కార్తవీర్యార్జునుడి లోభం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నీ ఉన్నా మనుషులు ఇలా దిగజారతారా అనిపిస్తుంది. ఆయన తన పరివారంతో సహా అడవికి వేటకు వెళ్ళాడు. తిరిగి తిరిగి చివరకు జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కాస్త దప్పిక తీరితే చాలనుకుంటున్నప్పుడు మహర్షి భోజనమే పెడతానన్నాడు.
భాగవతంలో కార్తవీర్యార్జునుడి లోభం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నీ ఉన్నా మనుషులు ఇలా దిగజారతారా అనిపిస్తుంది. ఆయన తన పరివారంతో సహా అడవికి వేటకు వెళ్ళాడు. తిరిగి తిరిగి చివరకు జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కాస్త దప్పిక తీరితే చాలనుకుంటున్నప్పుడు మహర్షి భోజనమే పెడతానన్నాడు. కందమూలాలు అనుకుంటే, షడ్రసోపేతమైన విందుభోజనమే పెట్టాడు. తనకే కాదు, తనతో ఉన్న సైన్యం అంతటికీ దప్పిక, ఆకలి పూర్తిగా తీరిపోయాయి. అప్పటికప్పుడు అంతమందికి అంత గొప్ప విందు ఏర్పాట్లు ఎలా జరిగాయని రాజుకు అనుమానం వచ్చింది.
జమదగ్ని మహర్షి దగ్గర సుశీల అనే గోవు ఉంది. అది కామధేనువు. దాన్ని ప్రార్థించి రాజోచితమైన విందు భోజనాలను అంతమందికి మహర్షి కొద్ది వ్యవధిలోనే ఏర్పాటు చెయ్యగలిగాడు. ఆశ్చర్యానికి లోనైన రాజు కన్ను కామధేనువుపై పడింది.
మనిషి స్వభావంలో ఒక చిత్రమైన విషయం ఏమిటంటే కోరికలు తీరేకొద్దీ- కొత్తవి పుడుతూనే ఉంటాయి. ఒకటి తీరేసరికి మరొకటి, అది తీరే సరికి ఇంకొకటి. అంతేకాదు- చివరికి ఇంకొకడికి దక్కనివ్వకుండా మొత్తం దోచేద్దామని అనిపిస్తుంది. దాన్నే లోభం అంటారు.
సరిగ్గా ఇలాంటి సన్నివేశమే రామాయణంలోనూ ఉంది. విశ్వామిత్రుడు అప్పటికింకా రాజు మాత్రమే, రుషి కాలేదు. ఆయనోసారి ఇలాగే సైన్యంతో ఊరేగుతూ వసిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ బృందానికి వసిష్ఠుడు తన దగ్గరున్న శబల అనే ధేనువు సాయంతో జమదగ్నిలాగే మహత్తరమైన విందు చేశాడు. కార్తవీర్యుడు జమదగ్నిని కోరినట్లే విశ్వామిత్రుడు వసిష్ఠుణ్ని కోరాడు- ఆ ధేనువును తన సొంతం చెయ్యమని. ఇది లోభానికి పరాకాష్ఠ!
మహాభారతంలో ధృతరాష్ట్రుడిది రాజ్యలోభం. ఆయన పుట్టుగుడ్డి. కనుక ధర్మశాస్త్ర రీత్యా ఆయనకు రాజ్యాధికారం దక్కలేదు. తమ్ముడు పాండురాజు రాజయ్యాడు. కొద్దికాలానికి పాండురాజు ఆకస్మికంగా మరణించడంతో రాజ్య సంరక్షణ బాధ్యత ధృతరాష్ట్రుడికి సంక్రమించింది. క్రమంగా రాజభోగాలకు ఆయన బాగా అలవాటు పడ్డాడు. అది లోభానికి దారితీసింది. తన చేజిక్కని రాజ్యశ్రీని కనీసం తన కొడుక్కి అయినా కట్టబెట్టాలని అనిపించి, ఆయన ఎన్నో పన్నాగాలు పన్నాడు. చివరకు రాజ్యాన్నే కాదు, నూరుమంది సంతానాన్ని పోగొట్టుకొన్నాడు.
రామాయణంలో భరతుడికి లభించిందీ తాత్కాలిక రాజభోగమే. అయితే భరతుడు ప్రలోభానికి లోనుకాలేదు. రాముడి రాజ్యానికి కేవలం ధర్మకర్తగానే వ్యవహరించాడు. రావణ సంహారం పిదప రాముడు తనకన్నా ముందుగా హనుమను పంపి, భరతుడి మదిలో ఏ మూలనైనా రాజ్యకాంక్ష మెదులుతున్నదేమో గమనించమని కోరాడు. శీలపరీక్ష లాంటిదది. అందులో భరతుడు గెలిచాడు. తన లోభరాహిత్యాన్ని నిరూపించుకొని లోకంనుంచి గౌరవాలను పొందాడు. లోభం ఆవరించి మనిషి గుడ్డివాడు కారాదని తన ప్రవర్తన ద్వారా లోకానికి బోధించాడు.
భారత భాగవత రామాయణ కథల్లోని వ్యత్యాసం, పరమార్థం గ్రహించిననాడు మనిషి లోభం నుంచి, వ్యామోహం నుంచి బయటపడతాడు.
- ఎర్రాప్రగడ రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే...
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?