ధన్యచరిత
శాక్యముని గౌతమ బుద్ధుడి జీవితంలో ఎన్నో రమణీయ ఘట్టాలు. ఆ మహానుభావుణ్ని సేవించి ధన్యులైన వారెందరో. వారిలో సుజాత వృత్తాంతం విశేష ప్రాముఖ్యం గలది. తథాగతుడి జీవితంలో ఆమె పాత్ర విలక్షణమైంది.
శాక్యముని గౌతమ బుద్ధుడి జీవితంలో ఎన్నో రమణీయ ఘట్టాలు. ఆ మహానుభావుణ్ని సేవించి ధన్యులైన వారెందరో. వారిలో సుజాత వృత్తాంతం విశేష ప్రాముఖ్యం గలది. తథాగతుడి జీవితంలో ఆమె పాత్ర విలక్షణమైంది.
బుద్ధుడి జీవితంలో అతడు సంబోధి(జ్ఞానం) పొందడానికి ముందు సుజాత అనే గృహిణి పాయసాహారాన్ని సమర్పించిన సన్నివేశానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వైశాఖ పూర్ణిమనాటి మధ్యాహ్నం సుజాత సిద్ధార్థుడికి పాయసం ఇచ్చిన వృత్తాంతం సుత్త పిటకంలో ఉంది. లలిత విస్తరం, అశ్వఘోషుడి బుద్ధ చరిత్ర, బుద్ధ ఘోషుడి పద్య చూడామణి కావ్యాల్లో, ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన ‘లైట్ ఆఫ్ ఆసియా’ ఆంగ్ల గ్రంథంలోనూ ఈ ఘట్టం చోటుచేసుకుంది. తిరుపతి వేంకట కవుల ‘బుద్ధ చరిత్ర’ కావ్యంలోనూ సుజాత కథ రమణీయంగా చిత్రితమైంది. బౌద్ధుల చిత్రకళలోనూ ఆమె సంపాదించుకున్న స్థానం అనన్యసామాన్యం. బుద్ధుడి దృష్టిలోనూ ఈ ఘట్టం చిరస్మరణీయం.
సిద్ధార్థుడు బుద్ధుడైన ప్రాంతం ఉరువేలవనం. అక్కడ సేనాని అనే గ్రామం ఉండేది. ఆ గ్రామ పెద్ద పేరు కూడా సేనాని కావడం విశేషం. అతడు సంపన్న గృహస్థుడు. భూసంపద, గోసంపద విస్తారంగా ఉన్నాయి. అతడి భార్య సుజాత సార్థక నామధేయురాలు, నిర్మల చరిత, రూపవతి, సాధ్వి, కరుణాళువు, మృదుభాషిణి. యాచకుల పాలిట కల్పతరువు. సంతానం లేకపోవడం ఆ దంపతులకు పెద్ద లోటుగా ఉండేది. సంతానం కోసం ఆమె చేయని పూజ లేదు, ఆచరించని వ్రతం లేదు.
కోరికలు నెరవేరడానికి వృక్షాలను పూజించడం భారతదేశంలో ప్రాచీన సంప్రదాయం. సుజాత నిరంజనా(ప్రస్తుతం ఫాల్గూ)నదీ తీరంలో గల ఒక రావిచెట్టుకు ప్రదక్షిణం చేసి తనకు సంతానం కలిగితే మధుర భక్ష్యాలు నైవేద్యంగా సమర్పించగలనని మొక్కుకుంది. తరవాత ఆమె గర్భం ధరించింది. పుత్ర సంతానం కలిగింది. మొక్కు చెల్లించాలనుకుంది. ఆ వృక్ష ప్రాంతాన్ని శుభ్రంచేసి అలంకరించమని పరిచారికను పంపింది. అక్కడ వృక్షమూలంలో నిర్మల దీప కళికలా నిశ్చల కాంతితో ప్రకాశిస్తున్న సిద్ధార్థుణ్ని చూసి పరిచారిక యజమానురాలికి తాను చూసిన దృశ్యాన్ని వివరించింది.
సుజాత పాయసాహారంతో సిద్ధార్థుడున్న వనంలోకి వెళ్ళింది. అతణ్ని మానవరూపంలో ఉన్న వనదేవతగా భావించింది. ఆ దైవ కృప వల్లనే తనకు సంతానం కలిగిందనుకుంది. బంగారు పాత్రలోని పాయసాన్ని సమర్పించింది. కొన్ని రోజులుగా నిరాహారంగా ఉన్న గౌతముడు సొమ్మసిల్లి పడిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ పాయసాన్ని ఆరగించాడు. ఆ పాయస మాధుర్యం అతడికి ఆశ్చర్యం కలిగించింది. ఆ పదార్థం భక్షించాక గొప్పశక్తి తన దేహంలో ప్రవేశించినట్టు గుర్తించాడు. ఆ పాయసం ఎలా తయారు చేశారని సుజాతను ప్రశ్నించాడు. తమ ఆవుల మందలోని వంద గోవుల క్షీరాన్ని యాభై గోవులకు తాగించి, ఆ యాభై గోవుల పాలను ఇరవై అయిదు గోవులకు పట్టి, ఆ గోవుల పాలను పన్నెండు ధేనువులతో తాగించి, వాటి పాలను ఆరు ఆవులకు పోశానని సుజాత చెప్పింది. ఆ ఆరు గోవుల పాలలో పరిమళద్రవ్యాలు కలిపి తెల్లని బియ్యంతో పాయసం వండినట్లు ఆమె చెప్పింది.
తాను వనదేవతను కాదని శుద్ధోదనుడి పుత్రుణ్నని సిద్ధార్థుడు ఆమెకు తెలిపాడు. సుజాత ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయాక ధ్యానంలో ఉన్న సిద్ధార్థుడికి జ్ఞానోదయమైంది. అతడు బుద్ధుడయ్యాడు. సుజాత ఆతిథ్యంలోని భక్తి మాధుర్యా లను ఎన్నడూ బుద్ధుడు మరచిపోలేదు. చివరి ఘడియల్లోనూ ఆమె విందు తనకు జ్ఞానోదయ కారణమైందని ప్రశంసించాడు.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ