ఆరోగ్యమే ఐశ్వర్యం
సిరిసంపదల పట్ల ప్రతి మనిషీ ఎంతో ఆశగా ఉంటాడు. డబ్బులేకపోతే జీవితచక్రం ముందుకు కదలదు. బాల్యంలో తీవ్ర కష్టాలు అనుభవించినవాళ్లు పట్టుదలగా, కసిగా రేయింబవళ్లు శ్రమించి తృప్తిలేనట్లుగా ఆర్జిస్తారు.
సిరిసంపదల పట్ల ప్రతి మనిషీ ఎంతో ఆశగా ఉంటాడు. డబ్బులేకపోతే జీవితచక్రం ముందుకు కదలదు. బాల్యంలో తీవ్ర కష్టాలు అనుభవించినవాళ్లు పట్టుదలగా, కసిగా రేయింబవళ్లు శ్రమించి తృప్తిలేనట్లుగా ఆర్జిస్తారు. డబ్బుతో ముడివడిన సౌకర్యాలన్నీ అమర్చుకుంటారు. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పూర్తిగా అశ్రద్ధ చేస్తారు. సకల సంపదలు ఉన్నా ఆరోగ్యం లేకపోతే, ఏమీ లేనట్లే. దుర్భరమైన ఆ జీవితం నరకప్రాయంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం రోజూ గుప్పెడు మందులు మింగడం, పథ్యం పేరుతో రుచి లేని ఆహారం తినాల్సి రావడంతో బతుకు నిస్సారమనిపిస్తుంది. కొందరు విరక్తితో బలవంతంగా తనువు చాలిస్తారు.
భారతీయ ఆధ్యాత్మికతలో క్రమశిక్షణ కీలకమైంది. శరీరం భూమిక. దాన్ని యోగవిద్యల ద్వారా అదుపులోకి తెచ్చుకోవాలి. మనసు చంచలం. దాన్ని ధ్యానం ద్వారా నిగ్రహించాలి. ఆత్మ సర్వోన్నతం. దాన్ని జ్ఞాననేత్రాలతోనే దర్శించగలం. శరీరం, మనసు, ఆత్మ ఏకత్వాన్ని పొందినప్పుడు దివ్యానందం కలుగుతుంది. ఇతర ఆనందాలన్నీ దాని ముందు దిగదిడుపే.
సుఖం వేరు. ఆనందం వేరు. సుఖంలో సంతోషం ఉంటుంది. అది ఆనంద స్థాయి కంటే చాలా తక్కువలో ఉంటుంది. ఆనందం సుఖాన్ని అపేక్షించదు. అది ఆత్మకు సంబంధించింది. సాధకుడు అంచెలంచెలుగా ఆత్మానుభూతికి చేరుకోవాలి. అంటే ప్రాపంచిక సుఖసంతోషాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకూడదు.
ఆరోగ్యం సహకరించకుండా ఎవరూ ఎలాంటి సాధనలూ చెయ్యలేరు. మంచి శరీరదారుఢ్యం, ఆరోగ్యం ఉన్నవారినే సైనికులుగా ఎంపిక చేస్తారు. అలాంటివారే శత్రువులపై పోరాడగలరు. విజయం సాధించగలరు. బలహీనులు తమకు తామే సాయం చేసుకోలేరు. ఇక వారు ఇతరులకు ఏ సాయం చెయ్యగలరు?
రైతులు ఏడాది పొడవునా కాయకష్టం చేస్తూనే ఉంటారు. ఫలసాయంతో ధాన్యపు సిరులు పెంచుకుంటూ ఉంటారు. ఆరోగ్యమే వాళ్ల మూలధనం. విద్యార్థులు, ఉద్యోగులు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థి దశ పరిమితంగానే ఉంటుంది. ప్రాథమిక విద్య పునాదిలాంటిది. బలమైన పునాదితోనే భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుంది. ఈ మూల సత్యాన్ని అందరూ గ్రహించలేరు. తల్లిదండ్రులు తాము పడిన కష్టాన్ని పిల్లలు పడకూడదని ప్రేమగా అనేక సౌకర్యాలు కల్పిస్తారు. వాటికి అలవాటుపడిన పిల్లలు కష్టించి పనిచేయడానికి ఇష్టపడరు. కష్టపడనివారికి సుఖపడే అర్హత లేదు.
పెద్దలు ప్రేమకు, గారాబానికి మధ్య గల తేడా గమనించరు. ప్రేమ మోతాదు ఎక్కువైతే అది గారాబం అవుతుంది. గారాబంతో పిల్లలు పూర్తిగా పాడయ్యాక ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. సింహానికి రోజూ ఆహారం నోటికందిస్తుంటే, వేట ఎలాగో మరచిపోతుంది. పిల్లలకు కష్టం తెలియకపోతే పరమ బద్ధకస్తులవుతారు. విపరీతంగా బరువు పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యం బాధిస్తుంది. పిల్లల భవిత బావుండాలంటే పెద్దలు తమ కర్తవ్యాన్ని బాధ్యతను సక్రమంగా పాటించాలి.
కేవలం ఆరోగ్యానికే ప్రాధాన్యమిస్తూ కండలు పెంచుకున్నా ఉపయోగం లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కర్తవ్య దీక్షతో, ఇష్టంగా కష్టపడాలి. జీవిత లక్ష్యాన్ని సాధించాలి. మనిషి ఏ దశలో ఉన్నా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ జీవించడమే అసలైన ఐశ్వర్యం.
కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిలువపై సత్య సందేశం
ఒక బోధకుడు రాత్రిపూట ఒక అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఒక దొంగ ఆ బోధకుడిని అడ్డగించాడు. ‘నీవద్దనున్న సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తాను’ అంటూ కత్తి చూపి భయపెట్టాడు. -
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్