మహాభారతం మానవ చరితం
పుట్టగానే శిశువు ఏడుస్తుంది. వయసు పెరిగిన కొద్దీ మనసు వికసించి, ఆకాశం వంక దృష్టి మళ్ళుతుంది. శిశువు జిజ్ఞాసువుగా మారుతుంది. భౌతిక ప్రపంచం చుట్టూ తిరిగినంత కాలం శాశ్వతమైన సుఖశాంతులు అందవు.
పుట్టగానే శిశువు ఏడుస్తుంది. వయసు పెరిగిన కొద్దీ మనసు వికసించి, ఆకాశం వంక దృష్టి మళ్ళుతుంది. శిశువు జిజ్ఞాసువుగా మారుతుంది. భౌతిక ప్రపంచం చుట్టూ తిరిగినంత కాలం శాశ్వతమైన సుఖశాంతులు అందవు. యథార్థం ఏమిటో తెలుసుకోవాలన్న ఆకాంక్ష భౌతిక విషయాల పట్ల ఉన్న కుతూహలం కన్నా ఉన్నతమైనది. అదే జ్ఞానానికి తొలి సోపానం.
సృష్టిని గురించి, ఈ లోకంలో తన ఉనికి గురించి రకరకాల ఆలోచనలు మొలకెత్తుతాయి. సృష్టి ఎలా జరిగింది, ఎప్పుడు మొదలైంది, ఎవరు సృష్టించారు, ఎంతకాలం సాగుతుంది, ఎప్పుడు ఎలా అంతం అవుతుంది? మానవ మేధలో గిరగిరలాడుతున్న ప్రశ్నావళికి మహాభారతం జవాబు చెబుతున్నది. ప్రకృతి శక్తులను జయించి, పరమాత్మను చేరుకునే మార్గదర్శనం చేయిస్తుంది మహాభారతం. ధర్మ విజయానికి సంకేతంగా వ్యాసుడి మహాభారతం జయగ్రంథంగా పేరుపొందింది.
వేదాలు తొలి చదువులు. వేదార్థాన్ని తెలపడానికి కృష్ణద్వైపాయనుడు ఉపవేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు విప్పి చెప్పాడు. సర్వ విజ్ఞానసారంగా తోచడం వల్ల సారమతులు మహాభారతాన్ని పంచమవేదంగా అంగీకరించారు. వేదాన్ని మూడు కోణాలనుంచి విశ్లేషించుకోవాలి. వేదా లేక విద్ అంటే తెలుసుకోవడం. తెలుసుకోవలసింది ఏమిటి? విద్యతే- తెలుసుకోమంటోంది. విందతి- అనుభవించి తెలుసుకుంటే మంచిది. వేత్తి- ప్రపంచం గురించి, ఆత్మ గురించి విచారం చేయాలి. విద్యతే, విందతి, వేత్తి... వెరసి- వేదం. రుగ్వేదం అగ్నివిద్య. యజుర్వేదం ప్రాణ (వాయు) విద్య. సామవేదం జ్యోతిర్విద్య. అధర్వణవేదం భూ- జల విద్య. పంచభూతాల పంచత్వమే భూమిపైన ప్రాణికోటి అస్తిత్వానికి కారణం. పంచమ వేదమైన భారతానికి, పాంచభౌతికమైన మానవ శరీరానికి లంకె ఉన్నది. ద్రోణుడు, ద్రుపదుడు, కర్ణుడు శరీర భాగాలకు, ద్రౌపది మనోబలానికి ఉదాహరణలు. మహాభారతం ఇతిహాసం. భూత, భవిష్యత్, వర్తమానాలలో అది జరుగుతూనే ఉన్నది. దాన్ని మూడు విధాలుగా విశ్లేషించుకోవాలి.
ఆరువేల సంవత్సరాల వెనక కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం జరిగింది. ఇది భౌతిక సత్యం. ఆధ్యాత్మికంగా మానవ హృదయ క్షేత్రంలో నిరంతరం మంచి-చెడుల నడుమ జరిగే స్పర్ధ ఓ విధమైన యుద్ధమే. సూర్యమండలం నుంచి విడుదల అవుతున్న ప్రాణశక్తి భూమండలంపైన ఉన్న జీవరాశి మనుగడకు మూల కారణం. సూర్యవంశం కశ్యప ప్రజాపతితో మహాభారతం ఆరంభం అయింది. ఇది దైవికమైన చర్య.
అండాండంలోని లక్షణాలు పిండాండంలో ఉన్నట్టుగా, మానవ శరీరంలో మహాభారతం ఆగని ప్రవాహమై సాగుతూ అలరిస్తున్నది. ‘ఒక్కొక్క భావ రూపము ఒక్కొక్క భవ స్వరూపమై’ మహాభారతంలోని పాత్రలు నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేస్తాయి. భూమి, చంద్రుడు, సూర్యుడు, పరమేష్ఠి, స్వయంభు అనే అయిదు మండలాల సమష్టి రూపమే ఈ ప్రపంచం. చివరి రెండు మండలాలు కంటికి కనిపించవు. పాంచ భౌతిక శరీరం జీవాత్మకు ఉపాధి. పాంచమాండలిక ప్రపంచం పరమాత్మకు ఉపాధి. ఏనాటికైనా మానవుడు దివ్యమానవుడు కాగల అవకాశం ఉన్నదని మహాభారతం చాటుతున్నది. భారతం చదివి మానవుడై, భాగవతం చదివి భగవంతుడై, రామాయణం చదివి ఆదర్శ మానవుడిగా ఈ భూమిపైన జీవనయాత్ర సాగించాలి.
- ఉప్పు రాఘవేంద్రరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో