నవనీత కృష్ణ... నారాయణ తీర్థ!
వాగ్గేయకారులెందరో తమలోని భక్తి భావాలను గేయాల రూపంలో రాసుకొని దేవుణ్ని పలు విధాల గానం చేస్తూ తరించారు. నారాయణతీర్థ తరంగాలు ఇదే కోవకు చెందిన భక్తి భావ సమర్పణలు. నారాయణ తీర్థ భాగవత పంచరత్నాల్లో ఒకరు.
వాగ్గేయకారులెందరో తమలోని భక్తి భావాలను గేయాల రూపంలో రాసుకొని దేవుణ్ని పలు విధాల గానం చేస్తూ తరించారు. నారాయణతీర్థ తరంగాలు ఇదే కోవకు చెందిన భక్తి భావ సమర్పణలు. నారాయణ తీర్థ భాగవత పంచరత్నాల్లో ఒకరు. ఆంధ్రప్రదేశ్లోని కాజా గ్రామంలో ఈయన జన్మించారు. నారాయణ తీర్థ నిజనామం తల్లావఝ్ఝుల గోవింద శాస్త్రి. సంగీతంపై మక్కువతో ఆయన తంజావూరు తరలి వెళ్ళారు. అక్కడ భూపతిపురం అనే గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయ సత్రంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఆ దేవాలయానికి తరచూ వచ్చే స్వామి శివానందతీర్థ పరిచయ భాగ్యం ఆయనకు కలిగింది. శివానందుల వారు సంగీత సాహిత్యాల్లో ఉద్దండులు. వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణుడి వేణువు నుంచి శ్రావ్యమైన స్వరాలు ఆయనకు వినిపించేవని అంటారు. శివానందులే గోవింద శాస్త్రిని నారాయణ తీర్థ అని సంబో ధించేవారు. నారాయణ తీర్థకు కృష్ణు డిపై భక్తి ఎక్కువ. ఆయన రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకు వెళ్ళిన మహాభక్తుడు. ఆ భక్తికి విస్పష్ట రూపం ఇచ్చి పన్నెండు కావ్య భాగాలు రాశారు. నారాయణతీర్థ రాసిన కృష్ణ లీలా తరంగిణిలో గోపాలుడి బాల్యం నుంచి రుక్మిణీ కల్యాణం వరకు ద్విపద రీతిలో తరంగాలను మనోహరంగా కూర్చారు. జయదేవుడి గీతగోవిందం, భక్తి వైరాగ్యం, కృష్ణుడిపై అపారమైన ప్రేమ- నారాయణ తీర్థను ప్రభావితం చేశాయి. తరంగాలన్నీ శ్రీకృష్ణ లీలలను కళ్లకు కట్టినట్లు అనుభూతిని కలిగిస్తాయి. భాగవతపురాణంలో శ్రీకృష్ణ లీలలు ఎంతగా భక్తిభావాన్ని సృజిస్తాయో తరంగాలు సైతం అంతే అనురక్తిని పరమాత్ముడిపై కలిగిస్తాయి.
శ్రీకృష్ణలీలా తరంగాలు పన్నెండు అధ్యాయాల్లో ఎన్నో కృతులు శ్లోకాలు చోటుచేసుకున్నాయి. లయబద్ధమైన ఈ భక్తిభావ కవిత్వం వినసొంపుగా సాగుతూ శ్రీకృష్ణుడి లీలలను కళ్లకు కట్టేలా ఉంటుంది. లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతం ఛాయలు ఈ తరంగాల్లో లీలగా ప్రస్ఫుటం అవుతాయి.
తొలి తరంగంలో శ్రీకృష్ణ జన్మ గురించి ప్రారంభమై పన్నెండో తరంగంలో రుక్మిణీ కల్యాణ మహోత్సవంతో ముగిసే తరంగ మాల భక్తి సౌరభాల హేల. ‘శరణం భవ కరుణామయి కురు దీన దయాళో... కరుణారస వరుణాలయ కరిరాజ కృపాలో (శ్రీమన్నారాయణా... నీవే రక్షకుడవు నీవే ఉపకారివి. ప్రేమ జలనిధివి. ఆర్తితో పిలిచిన గజేంద్రుడిని కాపాడినవాడివి) అంటూ రాసిన తరంగం ఎందరినో భక్తిరసంలో ఓలలాడించింది. ఈ వాగ్గేయకారుడి తరంగాలు గానం చేయడానికి నాట్యాభినయానికి తగినవిగా ఉంటాయి. నాటకానికి అనువైన పారిజాతాపహరణం, హరిభక్తి సుధార్ణవం- నారాయణ తీర్థ ఇతర రచనలు. జీవిత చరమాంకంలో శ్రీకృష్ణ రాసలీలల వైభవాన్ని బృందావనంలో నారాయణ తీర్థ కళ్లారా చూశారని చెబుతారు. ఈ వాగ్గేయకారుడు తాను శ్రీకృష్ణ భక్తిరసంలో తేలియాడి తన రచనలతో భక్తులకు భవజలనిధిని దాటించగల సాహిత్యాన్ని అందించారు.
- అప్పరుసు రమాకాంతరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు. -
అనుభవ సారం
జీవితం ప్రతీ క్షణం ఒక అనుభవమే. అటువంటి అనుభవాలే జ్ఞాపకాలుగా కాలక్రమంలో పాఠాలను చెబుతాయి. జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కానీ ఎల్లకాలం ఒకే రకమైన అనుభవాలుంటే మాత్రం విసుగు పుట్టిస్తాయి. అప్పుడు జీవితం నిస్తేజంగా తయారవుతుంది. అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకునే ఉద్దేశంతో, గాలి మార్పు పేరుతో వేరువేరు ప్రదేశాలను పర్యటించమని పెద్దలు చెబుతారు. -
సిలువపై సత్య సందేశం
ఒక బోధకుడు రాత్రిపూట ఒక అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఒక దొంగ ఆ బోధకుడిని అడ్డగించాడు. ‘నీవద్దనున్న సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తాను’ అంటూ కత్తి చూపి భయపెట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్డ్రా
-
మోదీ విమర్శలు.. రాహుల్ గాంధీ యూటర్న్
-
సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘ఇండియా’ కూటమి గెలిస్తే CAA, NRC రద్దు చేస్తాం: మమత
-
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్