ధార్మికవీర మూర్తి
లోకాన్ని నడిపేది ధర్మం. ధర్మాన్ని రక్షించడం కోసమే అవతార పురుషులు ఉద్భవిస్తారు. ధర్మానికి గ్లాని(నష్టం) ఏర్పడినప్పుడు తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు.
లోకాన్ని నడిపేది ధర్మం. ధర్మాన్ని రక్షించడం కోసమే అవతార పురుషులు ఉద్భవిస్తారు. ధర్మానికి గ్లాని(నష్టం) ఏర్పడినప్పుడు తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ప్రసిద్ధమైన దశావతారాలే కాకుండా ఇంకెన్నో రూపాల్లో అవతరించిన పుణ్యమూర్తులు లోకానికి ఎంతో మేలు చేసి, అంతర్ధానమయ్యారు. కొందరు చిరంజీవులై ఉన్నారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ధర్మరక్షణకోసం అవతరించి, చిరంజీవిగా నిలిచిన ధార్మికవీర మూర్తి హనుమంతుడు. ఆంజనేయుడి ధర్మవీరం జగద్విదితం. మానవోత్తముడు, మర్యాదాపురుషోత్తముడు అయిన శ్రీరామచంద్రుడి మనసును గెలుచుకున్న అపార గుణనిధి హనుమంతుడు.
దేవతలు సత్త్వగుణ సంపన్నులు. మానవులు రజోగుణ సమన్వితులు. రాక్షసులు తమోగుణ ప్రధానులు. సత్త్వగుణం లోకక్షేమ కారకం. రజోగుణం రాగబంధాలకు నిలయం. తమోగుణం వినాశకారకం, ధర్మవిరుద్ధం. తమోగుణ ప్రధానుడైన రావణుడి అకృత్యాలతో ముల్లోకాలూ తల్లడిల్లిపోయాయి. అధర్మం పిశాచ తాండవం చేసింది. అప్పుడు దేవతల ప్రార్థనపై మహావిష్ణువు ధర్మరక్షణ కోసం శ్రీరాముడిగా అవతరించాడు. ధర్మరక్షణ కోసం అవతరించిన పుణ్యమూర్తికి, ధర్మవీరుడైన హనుమంతుడు తోడయ్యాడు. రోమరోమంలో రామనామాన్ని ధరించి, రాముడి ధర్మమార్గంలో పయనించాడు. పుట్టగానే మూడువందల యోజనాల దూరం ఆకాశంలోకి ఎగసి, సూర్యబింబాన్నే మింగబోయిన జగదేకవీరుడికి నూరు యోజనాల కడలిని దాటడం ఏమంత కష్టం? జాంబవంతుడు అందించిన ప్రోత్సాహ శక్తితో ఆకాశానికెగసి, అపార జలనిధిని దాటుకుంటూ, అడ్డువచ్చిన రాక్షసులను దునుమాడుతూ, అప్రతిహతంగా ముందుకు సాగి దుర్భేద్యమైన లంకలో అడుగుపెట్టిన ధీరుడు పవనసుతుడు! వనవిధ్వంసంతో తన బలం ఏమిటో రుచి చూపి, శత్రువు దగ్గరికి వెళ్ళి హెచ్చరించిన పరమ ధర్మవీరాగ్రేసరుడి గాథ త్రిలోకానందకరం!
లంకలో సీతామాతను దర్శించి, రామ సందేశాన్ని అందించి, తన ప్రయాణ లక్ష్యంలో విజయుడైన మారుతి చరిత్ర లోకారాధ్యం! సాక్షాత్తు రావణాసురుడే అంజనాసుతుడి శక్తిసంపదలను చూసి ఆశ్చర్యపడి, ‘ఇతడు కైలాస పర్వతంపై శివుడి సన్నిధిలో ఉండే నందీశ్వరుడా?’ అని ప్రశంసించాడు. రాముడిలాగా మారుతి కూడా మర్యాదాసంపన్నుడు. అతడి మాటల్లో ఎక్కడా పొల్లు వినిపించదు. సంస్కారపూరితమైన అతడి పలుకుల్లో వ్యాకరణ సంపత్తి నిండి ఉంటుంది. అందుకే శ్రీరామచంద్రుడు మెచ్చిన మూర్తిమత్వం ఆయనది!
దుష్టశక్తుల పాలిట సింహస్వప్నం ఆంజనేయ రూపం! ధర్మధ్వంసకులకు ఆయన పేరు వింటేనే ముచ్చెమటలు పోస్తాయి. సాధువర్తనులకు అతడొక పెద్ద అండ! భయం వేసిన మనిషికి ఆంజనేయ స్మరణ వేయి ఏనుగుల బలాన్నిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ పరిరక్షణ అతడిలో అణువణువునా దర్శనమిస్తాయి. అందుకే మహర్షులు అతణ్ని ‘రామాయణ మహామాలా రత్నం’ అని కొనియాడారు. హనుమంతుడి విశ్వరూపానికి ప్రతిబింబమైన సుందరకాండ... లోకానికి నిత్యపారాయణమయ్యింది. సకలార్థ సాధనకు ఇందులోని ప్రతి శ్లోకం సాధనమైంది. సుందరకాండలో సర్వం సుందరమే అనే ప్రశస్తి లోకమంతా వ్యాపించింది. సుందరుడంటే హనుమంతుడే అని కీర్తించింది.
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిలువపై సత్య సందేశం
ఒక బోధకుడు రాత్రిపూట ఒక అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఒక దొంగ ఆ బోధకుడిని అడ్డగించాడు. ‘నీవద్దనున్న సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తాను’ అంటూ కత్తి చూపి భయపెట్టాడు. -
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!