ధర్మపథం
ధార్మిక పథమే భారతీయుల అసలుసిసలు జీవన విధానం. అదే ఈ జాతి జీవనాడి. మన జీవనశైలి మహర్షులు రూపొందించినది. పాపభీతి, దైవభీతి మన జాతి సంస్కారంలో భాగం.
ధార్మిక పథమే భారతీయుల అసలుసిసలు జీవన విధానం. అదే ఈ జాతి జీవనాడి. మన జీవనశైలి మహర్షులు రూపొందించినది. పాపభీతి, దైవభీతి మన జాతి సంస్కారంలో భాగం. వాటినుంచి పక్కకు తొలగినప్పుడల్లా- సమాజం గతి తప్పుతుంది. ధర్మాన్ని ఆచరించు, ధర్మం విషయంలో ఏమరుపాటు తగదు- అన్న వేదంలోని శిక్షావల్లి ఆదేశాన్ని ఈ జాతి శిరోధార్యంగా స్వీకరించింది. మన దేశానికి ప్రపంచఖ్యాతి దక్కడంలో ప్రముఖ పాత్ర వహించింది- ఇక్కడి ప్రజల మనుగడలోంచి తొంగిచూసే ధార్మిక దృక్పథమే!
‘చెట్టుచాటునుంచి నన్ను సంహరించావు. అధర్మానికి పాల్పడ్డావు. రేపు సజ్జన సమాజం నిన్ను నిలదీస్తే ఏం సమాధానం చెబుతావు?’ అని ఒక వానరుడు నేరుగా అవతార పురుషుణ్ని ప్రశ్నించిన ఘట్టం మనకు వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. ‘మాయాజూదం విషయంలో ఉపేక్ష కారణంగా పై లోకాల్లో నీ పేరు ప్రఖ్యాతులు దెబ్బతిన్నాయి. నీవు ధర్మం తప్పావు’ అని తన మహారాజునే ఒక మంత్రి నిందించిన వైనాన్ని వ్యాస భారతం వివరించింది. ధర్మంపట్ల మనిషి ఎంత అప్రమత్తంగా ఉండాలో మనకు మహర్షులు నేర్పారు. ధర్మమే మన బలం. ‘భారతీయ సమాజాలను ఒక్కటిగా కలిపి ఉంచేది- ధర్మమే’ అన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ మాట... అవగాహనతో చెప్పినది. ఆలోచించి పలికినది!
ధర్మం అంటే ఏమిటో మనం వివరించలేక పోవచ్చుగాని, మన అందరికీ ధర్మం అంటే ఏమిటో తెలుసు. ఏది ధర్మమో, ఏది అధర్మమో కూడా బాగా తెలుసు. తెలిసీ, అధర్మంవైపు మొగ్గు చూపించడం- మన బలహీనత. నిజానికి అది దుర్యోధనుడి ప్రవృత్తి. ‘ధర్మం అంటే ఏమిటో నాకు తెలుసు- అది నా స్వభావంలో భాగం కావడంలేదు. అధర్మం అంటే ఏమిటో కూడా నాకు తెలుసు- కానీ, అది నన్ను విడిచి పెట్టడంలేదు’ అన్నాడు భారతంలో సుయోధనుడు. మనలో చాలామంది సమస్య అదే! అందుకే మనలో ఈ అశాంతి, ఈ అంతస్సంఘర్షణ. మనిషి వాటినుంచి బయటపడాలంటే ధర్మమార్గంలో జీవించడం ఒక్కటే దారి.
వాస్తవానికి ధర్మం అనే పదానికి ప్రపంచ భాషలు దేనిలోనూ సమానార్థక పదం లేదు. ఆ మాటకొస్తే సంస్కృత భాషలోనే దానికి మరో పర్యాయపదం లేదు. కాబట్టి అర్థతాత్పర్యాలు, నిర్వచనాల జోలికి పోకుండా- ధర్మాత్ముల జీవన విధానంలోంచి ధర్మాచరణ విధానాలను చూసి అనుకరించడం మేలు. ‘రాముడు మూర్తీభవించిన ధర్మం’ అని మారీచుడు ఎందుకు అన్నాడో- మనకు రాముడి ప్రవర్తనలో అడుగడుగునా నిరూపించారు వాల్మీకి మహర్షి. రాముడి నడతను అనుకరిస్తే మనం ధర్మమార్గంలో ఉన్నట్లే!
అంతకన్నా సులువైన మార్గాన్ని శాంతిపర్వంలో భీష్ముడు ఈ మానవజాతికి ఉపదేశించాడు. ‘ఎదుటివారు ఏం చేస్తే మనకు అయిష్టంగానో, కష్టంగానో తోస్తుందో, దాన్ని మనం ఇతరుల పట్ల చేయకుండా ఉండటమే పరమ ధర్మపథం’ అని సూత్రీకరించాడాయన. ఈ ఒక్క సూత్రాన్ని మనం జీవితమంతా పాటించగలిగితే చాలు- మనం ఆత్మను ఒప్పిస్తూనో, నొప్పిస్తూనో జీవించే దుస్థితి లేకుండా ఉంటుంది. మనశ్శాంతి దక్కుతుంది. సమాజంలో కక్షలు, కార్పణ్యాలు దూరం అవుతాయి. జనమంతా సుఖశాంతులతో జీవించగలుగుతారు. భారతీయ సమాజాలకు ప్రపంచ దేశాల్లో తిరిగి పరువు ప్రతిష్ఠ చేకూరతాయి. ధర్మో రక్షతి రక్షితః అన్న ఆర్యోక్తి మరోసారి నిరూపణ అవుతుంది. అదే ప్రస్తుతం మన తక్షణ కర్తవ్యం!
ఎర్రాప్రగడ రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత