కేనోపనిషత్తు
ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. లోకోద్ధరణ కోసం దైవం స్వయంగా అవతరిస్తాడని చెప్పిన ప్రప్రథమ శాస్త్రమిదే. దైవం నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని తపించే వారికోసం ఒక మహర్షి, వారి పేరును ప్రస్తావించకుండానే దీన్ని బోధించారు.
ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. లోకోద్ధరణ కోసం దైవం స్వయంగా అవతరిస్తాడని చెప్పిన ప్రప్రథమ శాస్త్రమిదే. దైవం నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని తపించే వారికోసం ఒక మహర్షి, వారి పేరును ప్రస్తావించకుండానే దీన్ని బోధించారు. వారి సాధనా అనుభవ రహస్యాలను ఈ ఉపనిషత్తు ద్వారా తరవాతి తరాలవారికి అందించారు. మనిషిలో ఉండే అంతరాత్మను వివరించడమే దీనిలోని ప్రధానాంశం. దీన్ని ఒక పాఠంగా కాకుండా, శిష్యుడి ప్రశ్నకు సమాధానంగా వివరిస్తే స్పష్టంగా ఉంటుందని, గురుశిష్యుల సంవాదంలా దీన్ని పొందుపరచారు. ‘కేన’ అనే పదంతో ప్రారంభమైనందువల్ల దీన్ని కేనోపనిషత్తు అన్నారు. ఇందులో చిన్న అధ్యాయాలు నాలుగే ఉంటాయి. పరిమాణంలో చిన్న ఉపనిషత్తే అయినా- ఇది విశేషమైనదని దీన్ని వ్యాఖ్యానించిన పెద్దలు చెబుతారు. దీనిలోని మంత్రాలు వచన రూపంలోను, శ్లోకాలుగాను ఉంటాయి. దీన్ని సొంతంగా అర్థం చేసుకోవడం కష్టం. ఇందులో ఒకే పదానికి అనేకార్థాలుంటాయి. ఏ సందర్భంలో ఏ అర్థాన్ని తీసుకోవాలో గురువే చెప్పాలి లేదా శంకరాచార్యుల వారి భాష్యాన్ని ఆధారం చేసుకోవాలి.
ఎవరి ప్రేరణతో మనసు, ప్రాణం, ఇంద్రియాలు పనిచేస్తున్నాయనే శిష్యుడి ప్రశ్నతో ఇది ప్రారంభమవుతుంది. తెలియని విషయాలను చెప్పేందుకు మనకు బాగా తెలిసిన విషయాలనే ఆధారంగా చేసుకుంటాయి ఉపనిషత్తులు. ఇదే వాటి ప్రత్యేకత. జీవించా లంటే మనిషికి చూపు, మాట, వినికిడి, స్పర్శ, వాసన, శ్వాస, మనసు ఉండాలి. వీటిని అనుభవిస్తున్నా అవి లోపల దివ్యంగా ఎలా పనిచేస్తున్నాయో మనకు తెలియదు. దైవం ఎక్కడో ఉంటే మన ఇంద్రియాలకు శక్తినివ్వడ మన్నది ఆయనకు సాధ్యం కాదు. మనలోనే ఉంటూ మనకు గోచరించకుండానే మనల్ని నడిపించే శక్తే దైవం. అదే అంతర్యామి. మన కంటికి కనిపించకుండానే కంటికి చూసే శక్తినిస్తుంది. చెవులకు వినిపించకుండానే వినికిడి శక్తినిస్తుంది. మనసుకు తెలియకుండానే దానిలో స్పందనలను కలిగిస్తుంది. పరమాత్మ నిజస్వరూపమూ ఇదే. మనం పూజించే విగ్రహాలు పరమాత్మ కాదని, అంతరాత్మ పరమాత్మ అని ఈ ఉపనిషత్తు అంటుంది.
మన వైదిక వాంగ్మయంలో దేన్నయినా ఒక శాస్త్రంగా పరిగణించాలంటే దానిలో విషయం, ప్రయోజనం, సాధించే మార్గం, కావలసిన అర్హతలు అనే నాలుగు లక్షణాలుండాలి. అప్పుడే అది శాసించగలుగుతుంది. శాస్త్రం అంటే శాసించేదని అర్థం. కేనోపనిషత్తు వేదాంత శాస్త్రం. దైవం అంతర్యామిగా మనిషిలోనే ఉన్నాడని చెప్పి, దాన్ని దర్శించే మార్గాన్ని బోధిస్తుంది. నీలో వెలుగుతున్న అంతర్యామిని తెలుసుకునేందుకు నీకన్నా భిన్నంగా ఒక పరమాత్మ ఉన్నాడని మనసులో భావించి, ఆ పరమాత్మకు నామరూపాలు కల్పించి అర్చన చేయాలి. ఈ ఉపనిషత్తు దీనికోసమే ఒక యక్షుడి కథను ఇందులో పొందుపరచింది. పరమాత్మ యక్షుడి రూపంలో అవతరించి, ఇంద్రాది దేవతల గర్వాన్ని అణిచాడని, తరవాత ఉమాదేవి ప్రత్యక్షమై ఇంద్రుడికి గురువై పరమాత్మ(యక్షుడి) వైభవాన్ని బోధించిందని ఈ కథ వెల్లడిస్తుంది. మన వాంగ్మయంలో దైవం అవతారాలు ఎత్తుతాడని చెప్పడం ఈ కథతోనే మొదలయింది. దీని ఆధారంగానే, మన పురాణాల్లో ఎన్నో అవతారాలు చోటుచేసుకున్నాయి.
దైవాన్ని ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కోవిధంగా దర్శించమంటుంది. జ్యోతి రూపంగా భావించమంటుంది శ్వేతాశ్వతరోపనిషత్తు. వెలుగుకు ఆవల ఉన్న సత్ పదార్థాన్ని చేరమంటుంది ఈశా ఉపనిషత్తు. కన్ను తెరిస్తే కనపడే వెలుగు, రెప్పపడితే ఉండే చీకటి రెండూ దైవంగానే భావించమంటుంది కేనోపనిషత్తు.
పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్