నాదయోగి
భారతీయ సంగీతంలో దక్షిణాది బాణీ విలక్షణమైంది. దానికి ప్రపంచ సంగీత చరిత్రలో అఖండ పరివ్యాప్తి చేకూర్చిన అవతారమూర్తులైన వాగ్గేయకారులు ముగ్గురు. వారు త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్లు. ఈ ముగ్గురినీ సంగీతరత్నత్రయం అని పిలుస్తారు.
భారతీయ సంగీతంలో దక్షిణాది బాణీ విలక్షణమైంది. దానికి ప్రపంచ సంగీత చరిత్రలో అఖండ పరివ్యాప్తి చేకూర్చిన అవతారమూర్తులైన వాగ్గేయకారులు ముగ్గురు. వారు త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్లు. ఈ ముగ్గురినీ సంగీతరత్నత్రయం అని పిలుస్తారు.
శాహభూపాలుని ఆస్థాన వాగ్గేయకారుడైన గిరిరాజ కవి మనవడు త్యాగరాజు. వీరి కుటుంబం ఆంధ్రప్రాంతం నుంచి తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువారూరు వెళ్ళి స్థిరపడిందని చరిత్రకారుల కథనం.
త్యాగయ్యకు బాల్యంలోనే రామకృష్ణ ఆనందస్వామి అనే సన్యాసి నారదోపాస్తి మంత్రం ఉపదేశించారట. ఆ మంత్రాన్ని తిరువయ్యూరులోని పంచనదీశ్వరుడి ఆలయం వద్ద పునశ్చరణ చేస్తూండగా నారద మహాముని స్వయంగా యతివేషంలో వచ్చి స్వరార్ణవం, నారదీయం అనే సంగీత గ్రంథాలను త్యాగయ్యకు ఇచ్చి అంతర్ధానమయ్యాడని పౌరాణికులు చెబుతూంటారు. ఆ ఆనందంతో అప్పటికప్పుడు ఆయనపైన భైరవి, కానడ, విజయశ్రీ రాగాలతో కీర్తనలు కూర్చాడట త్యాగయ్య.
చెక్కుచెదరని మనో నిశ్చయంతో ఊంఛ వృత్తితో నిత్యం రామనామ సంకీర్తనా గానంతో జీవితం సాగించాడు. అలా నలభై ఏళ్లు గడిపేసరికి ఆయనకు రామ తారక సిద్ధి కలిగి వైణికుడిగా, గాయకుడిగా, పరమ భక్తా గ్రేసరుడైన వాగ్గేయకారుడిగా ఆయన కీర్తి దేశమంతా వ్యాప్తి చెందింది.
ఆయన తన జీవితకాలంలో ఇరవైనాలుగు వేల కీర్తనలు రచిం చాడు. ఇప్పుడు దాదాపు కేవలం ఎనిమిది వందల కీర్తనలు మాత్రమే లభ్యం అవుతున్నాయి.
త్యాగయ్య రచించిన పంచరత్న కీర్తనలు గాయకుల్లో ఉత్సాహ, భావోద్రేకాలు వెల్లివిరిసే విధంగా అర్థగాంభీర్యంతో ఉంటాయి. నాట రాగంలోని ‘జగదానందకారక’ అన్న మొదటి పంచరత్న కీర్తన సంస్కృత రచన. రెండోది గౌళ రాగంలోని ‘దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా’ అనేది. మూడో రచన ఆరభి రాగంలో ‘సాధించేనే ఓ మనసా’ అని. నాలుగో రచన వరాళి రాగంలో ‘కనకన రుచిరా కనక వసన నిన్ను’ అనే కీర్తన. అయిదో కీర్తన శ్రీరాగంలోని ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’ అనేది. ఘనరాగ పంచరత్న కీర్తనలతోపాటు త్యాగయ్య నారద పంచరత్నాలు, శ్రీరంగపంచరత్నాలూ రచించాడు.
తిల్లస్థానం నరసింహ భాగవతులు, సంజు భాగవతులు, గోవిందస్వామి పిళ్ళై అనే ముగ్గురు 1907లో ఈయన ఆరాధన ఉత్సవాన్ని పెద్దయెత్తున నిర్వహించడం ప్రారంభించారు. ఆ తరవాత గాయనీమణి అయిన బెంగళూరు నాగరత్నమ్మ తాము సంపాదించిన ధనమంతా వెచ్చించి 1925లో త్యాగరాజ సమాధి మీద ఆలయం కట్టించారు. 1940లో త్యాగబ్రహ్మ ఆరాధన మహోత్సవ సభ ఏర్పాటైంది. దీని కృషి ఫలితంగా భారతదేశంలో జాతీయోత్సవాల్లో ఒకటిగా త్యాగరాజోత్సవాలు ఎంపికైనాయి.
మాట్లాడే భాషలు, రాష్ట్రాలు వేరైనా- ఆంధ్రులు, తమిళులు, కేరళవాసులు, కన్నడిగులు... అందరిదీ ఒకే సంస్కృతి అని, ఒకే సంగీతమని, ఒకే వేదాంతమని సర్వమానవాళి సమానత్వాన్ని చాటిన నాదబ్రహ్మానందుడు త్యాగరాజస్వామి.
గంటి ఉషాబాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.