వసంత పంచమి
జ్ఞానశక్తి, ధీయుక్తిని పెంపొందించే మాతృశక్తిరూపిణి- సరస్వతి. అన్ని సంపదలకు విద్యే ప్రాతిపదిక. ఆ విద్యలన్నింటికీ శ్రీవాణి అధిష్ఠాత్రి. సర్వత్రా వ్యాపించిన శక్తి తత్త్వానికి సరస్వతి అని పేరు. సృష్టిలో వ్యక్తమయ్యే జీవకళకు ప్రతిరూపమే శారద అని మహాకవి కాళిదాసు అభివర్ణించాడు.
జ్ఞానశక్తి, ధీయుక్తిని పెంపొందించే మాతృశక్తిరూపిణి- సరస్వతి. అన్ని సంపదలకు విద్యే ప్రాతిపదిక. ఆ విద్యలన్నింటికీ శ్రీవాణి అధిష్ఠాత్రి. సర్వత్రా వ్యాపించిన శక్తి తత్త్వానికి సరస్వతి అని పేరు. సృష్టిలో వ్యక్తమయ్యే జీవకళకు ప్రతిరూపమే శారద అని మహాకవి కాళిదాసు అభివర్ణించాడు.
మాఘమాసాన్ని జ్ఞాననిధిగా ‘కాలచంద్రిక’ పేర్కొంది. అందుకు కారణం మాఘశుద్ధ పంచమినాడు సరస్వతీదేవి అభివ్యక్తమై లోకాలకు జ్ఞానసిరుల్ని అనుగ్రహించడమేనని ‘శారదా తిలకం’ వివరించింది. ప్రకృతిలో ఉత్పాదక శక్తి వసంత పంచమితో ప్రారంభమవుతుందంటారు. సృష్టి, నిర్మాణం, నిర్వహణాపరమైన శక్తులన్నింటిలో సర్వోన్నతమైన మూలకారక శక్తి మహాసరస్వతిగా ఆవిష్కారమైందని జగద్గురువు ఆదిశంకరులు ప్రస్తావించారు.
శుద్ధ సత్వ స్వరూపిణిగా తేజరిల్లే శారదాంబ- జగన్మాత నుంచి తేజరిల్లిన బ్రాహ్మీశక్తి. దేవదానవ సంగ్రామంలో రాక్షసులు, దేవతలపై మూకాస్త్రాన్ని, స్మృతి నాశక అస్త్రాన్ని ప్రయోగించారు. వాటిని నిలువరించడానికి మహాసరస్వతి మహాధారణాస్త్రాన్ని, సారస్వతాస్త్రాన్ని ప్రయోగించి వారిని రూపుమాపింది. ఆమె జ్ఞానాధిష్ఠాన దైవతంగా వెలుగొందిన రోజే- వసంత పంచమి. ఆధ్యాత్మిక ఉషస్సులో సరస్వతి రూపం క్రాంతిర్మయంగా శోభిల్లుతుంది. అవిద్య ఉన్న చోట ఆమె దృక్కులు ప్రసరిస్తే, అది విద్యావాటిక. చీకటి ఆవరించినప్పుడు ఆమె దివ్య తేజస్సు ప్రకటితమైతే, అది వెలుగు వాహిక. నిస్తేజం నిండినచోట ఆమె అనుగ్రహం పల్లవిస్తే, అది చైతన్య దీపిక. అజ్ఞానయుతమైన హృదయానికి ఆమె కరుణ చేకూరితే, అది జ్ఞానపీఠిక.
బ్రహ్మ వైవర్త పురాణంలోని ప్రకృతి ఖండం సరస్వతీ వైభవాన్ని వర్ణించింది. ఫల, పుష్ప, హరిత శోభితమైన వర్ణార్ణవ ప్రకృతి సౌందర్యమే సరస్వతీ రూపంగా పేర్కొన్నారు. త్రిమూర్తులు తమ ఆధీనంలో ఉన్న జ్ఞాన సంబంధితమైన కళలు, శక్తులు, అంశల్ని ‘వసంత పంచమి’నాడు సరస్వతికి ఆపాదింపజేశారంటారు. ఈ పర్వదినాన సరస్వతీ మాతను ఎలా ఆరాధించాలో, అందుకు ఎలాంటి విధివిధానాలు అవలంబించాలో నారదుడికి విష్ణువు తెలియజేశాడని దేవీ భాగవతం వివరించింది. సరస్వతీదేవి మూల మంత్రాన్ని శ్రీమన్నారాయణుడు భృగుమహర్షికి వసంత పంచమినాడే ఉపదేశించాడంటారు. సృష్టి రచనా నైపుణ్య శక్తిని బ్రాహ్మణి రూపంలోని శ్రీవాణి నుంచి బ్రహ్మ వరంగా వసంత పంచమినాడే అందుకున్నాడని ప్రతీతి.
సరస్వతీదేవి స్వరూపమే మూర్తీభవించిన జ్ఞానాకృతి అని పద్మపురాణం వెల్లడించింది. ఆమె హృదయస్థానం చతుర్వేదాలకు, మస్తిష్కం ధర్మశాస్త్రాలకు, నేత్రాలు ఆధ్యాత్మిక, లౌకిక విద్యలకు, కుక్షిస్థానం సంగీతకళకు, లలాటం కావ్యాలకు ప్రతిఫలనంగా సమన్వయం చేశారు. వసంత పంచమినే శ్రీ పంచమి అంటారు. శ్రీ అంటే సంపద. అసలైన సిరి జ్ఞానమే కాబట్టి ఇది జ్ఞాన పంచమి అయ్యింది. విద్యాసారాన్ని అందించే శారదగా, వాక్ శక్తికి అధినాయకురాలైన వాగీశ్వరిగా, పరావిద్యను అందించే శ్రీవిద్యగా, విజ్ఞాన పెన్నిధి అయిన శ్రీనిధిగా, బ్రహ్మ మానస సంచారిణి బ్రాహ్మణిగా, శబ్దశక్తిని, నాదానురక్తిని ప్రస్ఫుటం చేసే దివ్య సునాద కళా వినోదినిగా సరస్వతీదేవి తన విరాట్ మూర్తి మత్వాన్ని ప్రదర్శిస్తోంది. జ్ఞానలబ్ధి, విద్యాసిద్ధి, సర్వతో ముఖాభివృద్ధి అనే త్రివిధ వరాల సిరుల్ని భారతీదేవి అనుగ్రహిస్తోంది.
డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు