మన సంస్కృతి
ఆధునిక యంత్రాలు, బహుళ అంతస్తుల భవనాలు నాగరికతకు చిహ్నాలు. పారంపర్యంగా వస్తున్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, ఆరాధన విధానాలు, జీవన పద్ధతులు, కుటుంబ సంబంధాలు... ఇవి సంస్కృతికి సంబంధించిన విశేషాలు.
ఆధునిక యంత్రాలు, బహుళ అంతస్తుల భవనాలు నాగరికతకు చిహ్నాలు. పారంపర్యంగా వస్తున్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, ఆరాధన విధానాలు, జీవన పద్ధతులు, కుటుంబ సంబంధాలు... ఇవి సంస్కృతికి సంబంధించిన విశేషాలు. ఒక దేశం ప్రత్యేకత ఆ నాగరికతపై గాక, సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. మానవతా విలువలు సంస్కృతిలో నిక్షిప్తమై ఉంటాయి.
భారతీయ వివాహ వ్యవస్థ వంటిది ప్రపంచంలో మరొకటి లేదు. మన వివాహ సంప్రదాయం ఒక ఒడంబడిక (కాంట్రాక్ట్) కాదు. ఇది ఆత్మోన్నతికి ఏర్పడిన ఉత్తమ సంస్కారం. అది వేదకాలం నాటిది! భారతీయులు ధర్మ, అర్థ, కామాల స్థితిని అధిగమించిన మోక్షాన్ని కోరు కుంటారు. పాశ్చాత్య సంస్కృతి భౌతికతతో పెనవేసుకొని ఉన్నది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మన సంస్కృతి భారతీయ జీవిత విధానాన్ని గుబాళింపజేస్తూనే ఉన్నది. ఈ సంస్కృతిలో పుట్టిన శంకరాచార్యులు, తుకారాం, మీరా బాయి, రామానుజుడు, చైత న్యుడు... ఇప్పటికీ జన సామా న్యంతో కలిసిమెలిసే ఉన్నారు. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి వెలుగు ప్రసాదించాడు. అశోకుడు, చాణక్యుడు, చంద్రగుప్తుడు, శివాజీ... రాజ్య పాలనలో మానవతా పరిమళాలను వెదజల్లారు. భారతీయ సంస్కృతి మానవ జీవితంతో సంబంధం లేని తాత్విక విధానం కాదు. అది జీవశక్తితో నిండిన గంగాప్రవాహం.
మన కళలు ఆత్మకు, అనంతానికి, దైవానికి సంబంధించినవి. భారతీయ శిల్పం దైవ శక్తులను వెల్లడిస్తుంది. నటరాజ విగ్రహం దైవ చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది.
పాశ్చాత్యులు భారతీయ కళ వాస్తవికం కాదు అంటారు. మన సంస్కృతిలో కళలన్నీ దైవం, మానవుడు, ప్రకృతి... ఈ మూడింటిని మేళవించుకొనే ఉంటాయి. సరళమైన వ్యవస్థతో ఉన్న జీవనం వల్లే మానవజాతికి అభ్యుదయం చేకూరుతుందని చరిత్ర చెబుతుంది. పల్లవ, చాళుక్య, పాండ్య, కాకతీయ, విజయనగర రాజ్యాలు మానవజాతికి మహనీయ సాంస్కృతిక వైభవాన్ని అందించాయి. భారతదేశంలో సాంస్కృతిక పునర్జీవనం 150 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాధ్ ఠాగూర్ మొదలైన మహాత్ములు మన ఆధ్యాత్మికతకు స్వేచ్ఛామార్గాలు చూపారు. కొత్త కాంతులు ప్రసరింప జేశారు.
అంతర్గత శక్తిపై నిలబడి అజేయ ప్రేమశక్తితో అనుకున్న దాన్ని పట్టుపట్టి సాధించింది సావిత్రి. స్త్రీ శక్తిని ప్రదర్శించి చూపింది సతీసావిత్రి. ఆధ్యాత్మిక మార్గం, యోగం, సాధన... వీటి సమాహారమే భారతీయ సంస్కృతిలోని విశిష్టత. అది అజేయమని సావిత్రి నిరూపించింది. మన సంస్కృతి ఉన్నత స్థాయిలో ఉండి నిన్ను స్థాయివైపు చూస్తుందే కాని, నిమ్న స్థాయిలో పడి ఉన్నత స్థాయికోసం దేబిరించదు. శ్రీరామ, శ్రీకృష్ణులు అత్యున్నత స్థితిలో ఉండి కూడా, అతి సామాన్యుల సాహచర్యంలోనే జీవితం గడిపారు. ఆత్మ ప్రకాశం మీదే ఆధారపడ్డారు మన రుషులు. వారే ప్రపంచ మానవాళికి మార్గదర్శకులు కాగలిగారు.
యుగయుగాల నాటి భారతదేశ సంస్కృతి నేటికీ పరిఢవిల్లుతూనే ఉంది, భారతమాత జాతిని నడిపిస్తూనే ఉంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆమె ప్రాచీన సాంస్కృతిక శక్తితో తలను ఉన్నతంగా ఎత్తి చూడగలుగుతూనే ఉంది.
డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే...
తాజా వార్తలు (Latest News)
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో