ఉద్వేగ విముక్తి
మోదంలోనూ ఖేదంలోనూ మనిషి నీడలా వెన్నంటి ఉండేదే ఉద్వేగం ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలు, రాగద్వేషాలు ఉంటాయి. సందర్భోచితంగా కలిగే ఆలోచనల స్వరూపాలే ఉద్వేగాలు.
మోదంలోనూ ఖేదంలోనూ మనిషి నీడలా వెన్నంటి ఉండేదే ఉద్వేగం ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలు, రాగద్వేషాలు ఉంటాయి. సందర్భోచితంగా కలిగే ఆలోచనల స్వరూపాలే ఉద్వేగాలు. ఇవి వయసుతోపాటు బలపడి భావో ద్వేగాలుగా, రాగద్వేషాలుగా మారతాయి. మానవ సంబంధాలు బలపడటానికి, బలహీనపడటానికి కారణం ఉద్వేగాలే. ఆలోచనలు సానుకూల లేదా ప్రతికూల ఉద్వేగాలను కలిగిస్తాయి. సానుకూల ఉద్వేగాలు మనుషులను దగ్గర చేస్తాయి. ప్రతికూల ఉద్వేగాలు మనసులను దూరం చేస్తాయి. ప్రాణాలు పోసేవి, తీసేవి ఉద్వేగాలే.
పక్షికి బాణం తగిలి గాయపడి పడిపోతే గౌతముడు తనకు గాయమైనట్టు బాధపడ్డాడు. పక్షి బాధను చూసి చలించిపోయాడు. బుద్ధుడిగా మారి ప్రపంచాన్ని తన హృదయంతో కదిలించాడు. ఉద్వేగాలకు ఆలోచన వివేచన తోడు చేయడం అవసరం. అలా చేయలేనివారు ఉచితానుచితాల గురించి ఆలోచించరు. వివేకం కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు. భృగు మహర్షి వైకుంఠం వెళ్ళినప్పుడు శ్రీహరి తనను గమనించలేదని కోపోద్రిక్తుడయ్యాడు. తన స్థాయిని మరిచి శ్రీహరి వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. ఫలితం తెలిసిందే.
మనసులో మార్దవం లేనిదే కళ్ళు చెమ్మగిల్లవు. సుఖంలో, దుఃఖంలో హృదయం లోని తడిని తెలియజేసేవి అశ్రువులే. కన్నీటి పరిమళం పన్నీటి పరిమళం కంటే గొప్పది. పన్నీరు రసాయనభరితం. అది బాహ్య దుర్గం ధాన్నే తొలగిస్తుంది. కానీ కన్నీరు ప్రాణా ధారితం. లోపలి దుఃఖాన్ని పారదోలి మనసును తేలిక బరుస్తుంది. కొన్ని ఉద్వేగాలు ఆనందం, ప్రేమ, జాలి, కరుణను కలిగిస్తాయి. మరికొన్ని ఉద్వేగాలు దుఃఖాన్ని కదిలిస్తాయి. కన్నీటి తడికి చలించే హృదయానికే లిపి లేని కన్నీటి భాష అర్థమవుతుంది.
కుష్ఠు వ్యాధి పీడితుల కన్నీళ్లు చూసి చలించిన థెరెసా తన మానవత్వాన్ని సేవా రూపంలో చూపించింది. పేదల పాలిట అమ్మగా మారి మదర్ థెరెసాగా ప్రపంచ ఖ్యాతి గడించింది.
కష్ట సమయంలో దైవాన్ని కన్నీటితో శరణు కోరాలి. కరుణాంతరంగుడైన పరమాత్మను కచ్చితంగా అవి కదిలిస్తాయి. మూగ జీవి అయిన గజరాజు మొసలి నోట చిక్కింది. ఆ కష్ట సమయంలో నీవే దిక్కంటూ కార్చిన కన్నీరు వైకుంఠవాసుణ్ని భువికి రప్పించింది.
ఎంచుకున్న భక్తి మార్గంలో భగవంతుణ్ని శరణు కోరి ఆరాధించినప్పుడు తెలియని తాదాత్మ్యత కలుగుతుంది. అది మనకు తెలియకుండానే అశ్రు రూపంలో మనల్ని ఆనంద స్థితికి తీసుకెళ్తుంది. భవబంధాల నుంచి మానసిక ఉద్వేగాల నుంచి శాశ్వత విముక్తులు కావడమే ఆనందస్థితి. భగవంతుణ్ని ఆర్తితో ఆరాధించాలి. అది తెలియని తన్మయత్వాన్ని కలిగిస్తుంది. అప్పుడు వర్షించే ఆనంద బాష్పాలు మనిషిని తాను ఎవరో తెలుసుకునే ఆధ్యాత్మిక బాటలో నడిపిస్తుంది. అత్యంత విధ్వంసకరమైన ఉద్వేగం విద్వేషం. మనిషిలోని స్వార్థమే దీనికి మూలం. విద్వేషం మానవత్వాన్ని రాక్షసత్వంగా మారుస్తుంది. ఇది ఉన్నవాళ్లు ఎదుటివారి భావోద్వేగాలను భరించలేరు, గుర్తించలేరు.
జపాన్ దేశంలో సామాజికవేత్తలు యువతలో ఉద్వేగాలు అదుపు తప్పకుండా వారికి మనసు కదిలించే చలనచిత్రాలు చూపుతుంటారు. విలువలతో కూడిన పుస్తకాలను చదివిస్తున్నారు. మనసును మైమరపించే సంగీతాన్ని వినిపిస్తున్నారు. అశ్రువులు మనిషిలోని కాఠిన్యాన్ని కడిగేస్తాయి. కారుణ్యాన్ని మేల్కొలుపుతాయి. ఉద్వేగాలను తగ్గించే కన్నీళ్లు మానసిక, శారీరక స్వస్థతను చేకూరుస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు ఉద్వేగాలను వదిలించుకోవాలి.
ఎం.వెంకటేశ్వర రావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా