వినయ విధేయతలు
అహంకార, ఆడంబర రహితమైన మనో నిశ్చలతే నిజమైన వినయం అంటారు పండితులు. అహంకారం వల్ల అపజయాలు ఎదురవుతాయి.
అహంకార, ఆడంబర రహితమైన మనో నిశ్చలతే నిజమైన వినయం అంటారు పండితులు. అహంకారం వల్ల అపజయాలు ఎదురవుతాయి. వినయ విధేయతలే విజయాలను నిర్దేశిస్తాయి. వినయంతో కూడిన ప్రవర్తన మనిషికి ప్రసన్న చిత్తాన్ని ప్రసాదిస్తుంది. మనసు నిర్మలమైనప్పుడు ఎలాంటి ఆందోళనలు, ఒత్తిడులు ఉండవు. ఆలోచనలు ఉన్నతమైన మార్గంలో ప్రయాణిస్తాయి. అందుకే మనశ్శాంతి కలగాలంటే వినయం అత్యవసరం.
పండితులకు వినయమే భూషణం. వినయ గుణానికి ప్రతీక శ్రీశైలపూర్ణులు. వారు శ్రీమద్రామానుజాచార్యుల మేనమామ. శ్రీరామానుజాచార్యులు శ్రీరంగ క్షేత్రంలో వైష్ణవ పీఠాధిపతియై విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేస్తూ ఒకసారితిరుపతి బయలుదేరారు. అప్పటికే శ్రీశైలపూర్ణులు చాలా పెద్దవారు. ఆయన తిరుపతిలో నివసించేవారు. శ్రీరామానుజులు తిరుపతికి వస్తున్నారని తెలిసి శ్రీశైలపూర్ణులు ఒక తట్టలో శ్రీనివాసుడికి కైంకర్యం చేసిన ప్రసాదం పెట్టుకుని, చేతికర్ర సహాయంతో శ్రీరామానుజులుకు అందించారు. మేనమామ పడిన ప్రయాసకు శ్రీరామానుజులు ఎంతగానో నొచ్చుకుని ‘అయ్యా! ఈ ప్రసాదం తేవడానికి చిన్నవారెవరూ లేరా! ఈ వయసులో మీకింత ప్రయాస ఎందుకు?’ అన్నారు. అప్పుడు శ్రీశైలపూర్ణులు ‘నాయనా! ఇక్కడ ఉన్నవారందరిలో నేనే చిన్నవాడిని’ అన్నారు. ఎంతటి వినయగుణ సంపన్నులో శ్రీశైలపూర్ణులు! విద్వాంసులకు వినయగుణమే శోభనిస్తుంది. వినయం వల్లే వారి విద్వత్తు దిగంతాలకు వ్యాపిస్తుంది. వినయగుణం లేనివారు విశాల హృదయులు కాలేరు. సంకుచిత మనస్కులు జీవిత సాఫల్యాన్ని పొందలేరు.
రామాయణంలో హనుమంతుడు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. జ్ఞాన గుణసాగరుడు. అనంత బలశాలి. అయినా తాను రామబంటునని ప్రకటించుకున్నాడు. రాముడికి దాసుడిని అని చాటాడు. వెయ్యిమంది రావణులు ఒక్కసారిగా వచ్చినా వారిని మట్టి కరిపిస్తానంటాడు. రామభక్తి వల్ల కలిగే మనోబలం, దృఢవిశ్వాసం హనుమలో ఉన్నాయి. ఆ వినయ విధేయతలే అతణ్ని కీర్తిమంతుణ్ని చేశాయి.
మహాభారతంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడితో ధర్మరాజు ‘తాతా! శత్రువు బలవంతుడైతే బలహీనుడు ఏ ఉపాయంతో ఆ విపత్తు నుంచి తప్పించుకుంటాడు?’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు భీష్ముడు సముద్రసరిత్సంవాదం గురించి చెప్పాడు. ఒకసారి సముద్రుడు నదులతో సమావేశమై ‘మీరు వరదల్లో వేగంగా ప్రవహించేటప్పుడు పెద్దచెట్లను పడగొట్టేస్తారు. కాని అల్పమైన తుంగమొక్కలు చెక్కుచెదరవు. వాటిని ఎందుకు కదిలించలేకపోతున్నారు?’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గంగానది సముద్రుడితో, ‘మేము వేగంగా ప్రవహించేటప్పుడు పెద్దచెట్లు మాకు అడ్డంగా నిలుస్తాయి. అందుకే వాటిని పడగొట్టేస్తాం. ప్రబ్బలి, తుంగ వంటి మొక్కలు వినయంగా తలవంచుతాయి. మేం వాటి మీదుగా ప్రవహించి నీ దగ్గరకు చేరుకుంటాం. తరవాత అవి తలలు ఎత్తి మునుపటిలా బతుకుతాయి’ అని వివరించింది. ధర్మరాజా! శత్రువులోని బలాన్ని, అహంకారాన్ని గ్రహించి మూర్ఖత్వంతో ఎదురుపడకుండా ప్రవర్తించాలి. అప్పుడు బలహీనుడు చెడకుండా నిలబడతాడు’ అని ఉపదేశిస్తాడు భీష్ముడు. వినయశీలి గెలుపోటములను సమదృష్టితో స్వీకరిస్తాడు. ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. వినయం వల్ల నలుగురితో కలిసి పని చేయగలిగే, చేయించగలిగే నాయకత్వ లక్షణం అలవడుతుంది. అందుకే విజయవంతమైన నాయకులందరూ ఎంతో వినమ్రంగా, ధీరోదాత్తంగా వ్యవహరిస్తుంటారు.
విశ్వనాథ రమ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిలువపై సత్య సందేశం
ఒక బోధకుడు రాత్రిపూట ఒక అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఒక దొంగ ఆ బోధకుడిని అడ్డగించాడు. ‘నీవద్దనున్న సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తాను’ అంటూ కత్తి చూపి భయపెట్టాడు. -
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత