ఆలయ మహిమ
ఆలయాలు తల్లివంటివి. ఎన్నో సంస్కారాలు నేర్పుతాయి. పాపభీతి, దైవభక్తి, గురుభక్తి, సమష్టితత్వం, నిస్వార్థసేవ, ధార్మికచింతన, సామాజిక స్పృహ... ఇలా ఎన్నో సద్గుణాలను ప్రోది చేస్తాయి. భారతీయ సంస్కృతికి ఇవి పట్టుగొమ్మలు. మన సనాతన ధర్మాన్ని పెంచి పోషించి, నేటికీ సజీవంగా ఉంచిన మాతృసమానులు.
ఆలయాలు తల్లివంటివి. ఎన్నో సంస్కారాలు నేర్పుతాయి. పాపభీతి, దైవభక్తి, గురుభక్తి, సమష్టితత్వం, నిస్వార్థసేవ, ధార్మికచింతన, సామాజిక స్పృహ... ఇలా ఎన్నో సద్గుణాలను ప్రోది చేస్తాయి. భారతీయ సంస్కృతికి ఇవి పట్టుగొమ్మలు. మన సనాతన ధర్మాన్ని పెంచి పోషించి, నేటికీ సజీవంగా ఉంచిన మాతృసమానులు. ప్రపంచంలో అనేక ప్రాంతాల ప్రజలు అనాగరికులుగా ఉండే అతి ప్రాచీనకాలంలోనే, మనదేశంలో ఆలయాలు వెలశాయి.
దేవాలయాల విశిష్టత ఏమిటి, వాటిని నిర్మించమని శాస్త్రాలు పదేపదే ఎందుకు చెబుతున్నాయి అనేది ప్రశ్న. ప్రపంచంలో ఏ దేశానికీ లభించని గొప్ప వరం మనకు లభించింది. అదే ఆలయ విజ్ఞానం. అలయాలు కేవలం ప్రార్థనామందిరాలే కావు, దైవశక్తి కేంద్రీకృతమైన చైతన్య స్థానాలు. సూర్యకాంతి నుంచి విద్యుచ్ఛక్తిని పొందేందుకు, ఆ శాస్త్రజ్ఞానంతో రూపొందిన సాంకేతిక పరికరం ఉండాలి. అలాగే బ్రహ్మాండమంతా వ్యాపించిన మహాశక్తి ఒక దివ్యరూపంలో దర్శనమివ్వాలంటే, ఆగమశాస్త్ర జ్ఞానంతో ప్రతిష్ఠించిన విగ్రహమనే ఉపకరణం ఉండాలి. మనిషికి మాతృగర్భంలా, భువిలో దేవ తలకు ఆలయగర్భం జన్మస్థానం. ప్రాణమనే పురుషుడు పంచ భూతా త్మకమైన ప్రకృతి ఏకత్వాన్ని పొందడమే సృష్టి. ఉదాహరణకు ప్రాణం(రేతస్సు) స్త్రీ గర్భాన్ని చేరి, దేహం రూపొం దేందుకు కావలసిన మట్టి, నీరు, వేడి, గాలి, ఆకాశాలను తల్లినుంచి పొందు తుంది. ఈ సృష్టి సూత్రమే ఆలయ విజ్ఞానానికి ఆధారం. పంచభూత తత్వాలను ప్రాణాన్ని సశాస్త్రీయంగా విగ్రహంలో ప్రతిష్ఠిస్తే, ఆ మహా ప్రాణశక్తే విగ్రహాకృతిని పొందుతుంది. గుడిలో దైవంగా దర్శనమిస్తుంది. ఇది శాస్త్రవచనం. అందుకే ప్రతిష్ఠలో ముందుగా పంచభూత తత్వాలను విగ్రహంలో నిక్షిప్తం చేస్తారు. దీనికై జల క్షీర పుష్ప ధాన్య శయ్యాధివాసాలు నిర్వహిస్తారు. అధివాసాలంటే నిర్దేశించిన ద్రవాలలో విగ్రహాన్ని ముంచి ఉంచడం. శయ్యాధివాసంలో మాత్రం మూర్తిని పట్టుపానుపుపై శయనింపజేసి, నిద్రాకలశాన్ని ఉంచుతారు. ఇది విగ్రహంలో సర్వాంగాలను చైతన్యం చేస్తుందని విశ్వాసం. తరవాత విగ్రహాన్ని గర్భగుడిలో స్థాపించి, ప్రాణప్రతిష్ఠ చేస్తారు.
ప్రతిష్ఠలో ఆగమశాస్త్ర నియమాలు తప్పక పాటించాలి. విగ్రహానికి ఏ చిన్న దోషం ఉండకూడదు. చీమలువంటి సూక్ష్మపాణులు దీనికింద మరణించినా దోషమే. దోషనివారణకు విగ్రహాన్ని పవిత్ర నదీజలాలతోను, పంచపల్లవ కషాయాలతోను... ఇలా విశేషమైన అనేక ద్రవ్యాలతో శుద్ధిచేసి, ప్రతిష్ఠావిధిని ప్రారంభించాలి. విశేషంగా హోమాలు చేసి సంపాదాజ్యాన్ని (ఆహుతులనిచ్చేటప్పుడు గరిటలో మిగిలిన నేతి బిందువులు) విగ్రహానికి లేపనం చేయాలి. ఇది మహిమను ప్రసాదిస్తుంది. స్వామిని నిలిపేచోటులో నవరత్నాలు, ఓషధులు, బంగారం, పాదరసం... వంటివి నిక్షిప్తం చేయాలి. శక్తిమంతమైన యంత్రాన్నీ ఉంచాలి. ఇది స్థలమహత్యాన్నిస్తుంది. స్వామి నేత్రాలను బంగారు శలాక(సూది)తో చెక్కాలి. ఆ నేత్రాలు ద్వారంలోని శుభస్థానాన్ని వీక్షించేలా విగ్రహాన్ని స్థాపించాలి.
ఆలయాలను నిర్మించడానికి అంగబలం, అర్థబలం, మనోబలం, శాస్త్రబలం, అనుష్ఠానబలం కావాలి. జనసమీకరణ వస్తుసేకరణపై శ్రద్ధ వహించాలి. అందరూ కలిసి సమైక్యంగా సామరస్య భావంతో నిర్వహించే బృహత్ కార్యమిది. పదిమందికీ మంచి చేయాలనే భావన, ఐకమత్యంతో మెలగాలనే దృక్పథం... వీటిని ఆలయాలు మనకు చెప్పకనే చెబుతాయి. వ్యక్తిని సంఘటిత శక్తిగా తీర్చిదిద్దుతాయి.
పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు. -
అనుభవ సారం
జీవితం ప్రతీ క్షణం ఒక అనుభవమే. అటువంటి అనుభవాలే జ్ఞాపకాలుగా కాలక్రమంలో పాఠాలను చెబుతాయి. జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కానీ ఎల్లకాలం ఒకే రకమైన అనుభవాలుంటే మాత్రం విసుగు పుట్టిస్తాయి. అప్పుడు జీవితం నిస్తేజంగా తయారవుతుంది. అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకునే ఉద్దేశంతో, గాలి మార్పు పేరుతో వేరువేరు ప్రదేశాలను పర్యటించమని పెద్దలు చెబుతారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ