రంగుల సంబరం
ప్రకృతి రసాకృతి దాల్చి, హరితార్ణవంగా శోభిల్లే తరుణంలో, ఆ ప్రకృతికి సౌందర్యభరితంగా స్వాగతం పలికే రంగుల సంబరం- హోలీ! వసంత పంచమికి ప్రకృతిలో వసంతరుతువు లక్షణాలు అంకురిస్తే, ఫాల్గుణ పూర్ణిమ నాటికి వసంతశోభ పరిపూర్ణమవుతుంది.
ప్రకృతి రసాకృతి దాల్చి, హరితార్ణవంగా శోభిల్లే తరుణంలో, ఆ ప్రకృతికి సౌందర్యభరితంగా స్వాగతం పలికే రంగుల సంబరం- హోలీ! వసంత పంచమికి ప్రకృతిలో వసంతరుతువు లక్షణాలు అంకురిస్తే, ఫాల్గుణ పూర్ణిమ నాటికి వసంతశోభ పరిపూర్ణమవుతుంది. ఆసేతు హిమాచలం రంగుల కేళి హోలీని ఆహ్లాదభరితమైన వేడుకగా జరుపుకొంటారు. అందుకే విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్ హోలీని ‘జనపర్వం’గా అభివర్ణించారు.
ధర్మరాజుకు నారదుడు హోలీ విధి విధానాల్ని వివరించిన వైనాన్ని భవిష్య పురాణం ప్రస్తావించింది. శివపార్వతుల్ని ఏకీకృతం చేసే ప్రయత్నంలో మన్మథుడు శివాగ్రహానికి గురై భస్మమవుతాడు. మదనుడి భార్య రతిదేవి ప్రార్థన మేరకు ఆమెకు మాత్రమే సశరీరంతో గోచరమై మిగిలినవారికి అనంగుడిగా అంటే అదృశ్యరూపంలో ఉంటాడని ఈశ్వరుడు వరమిచ్చాడంటారు. ఆ సందర్భమే అనంగ పౌర్ణమి. అగ్ని సైతం దహించలేని మహాశక్తిమంతురాలైన హోలిక, హిరణ్యకశిపుడి సోదరి. తన పుత్రుడు ప్రహ్లాదుణ్ని ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు. శ్రీహరి భక్తుడైన ప్రహ్లాదుడి స్పర్శవల్ల హోలిక శక్తి సన్నగిల్లి, ఆమె అగ్నికి ఆహుతైంది. ప్రహ్లాదుడు క్షేమంగా అగ్ని నుంచి బయటకు వస్తాడు. అలా ప్రహ్లాద విజయం చేకూరిన ఆ రోజే హోలికాపూర్ణిమ! నిండు పున్నమి సిరివెన్నెల వెలుగులో గోపికలు, గోపాలుడిపై వసంతాన్ని చిలకరించే వారని, యము నాతీరాన బృందావనంలో ఊయల లూగుతూ రాసలీల వేడుకలో మధు రోత్సవం వెల్లివిరిసేదని ఫాల్గుణ పౌర్ణమి శోభను భాగవతం వివరిం చింది. అందుకే ఈ పున్నమిని డోలా జాత్రగా, డోలా పూర్ణిమగా ఉత్తర భారతంలో వ్యవహ రిస్తారు.
మదుర మీనాక్షీదేవి శివదీక్షను చేపట్టి సుందరేశ్వర స్వామిని మెప్పించి, ఫాల్గుణ పౌర్ణమినాడే వివాహం చేసుకుందని ‘మీనాక్షి తంత్రసారం’ ప్రకటించింది. అందుకే ఈ పౌర్ణమిని కల్యాణ పౌర్ణమిగా పేర్కొంటారు. హోలీని ‘నవాహ్నేష్టి’గానూ ప్రస్తా విస్తారు. ఫాల్గుణ పూర్ణిమ నాటికి పొలాల్లో ఉన్న ధాన్యం, దినుసుల్ని సేకరించి మోదుగ పుల్లల మంటపై ఆవుపాలతో పాయసాన్ని తయారుచేస్తారు. ఈ పాయసాన్నే ‘హోలి’ అంటారు. ఫాల్గుణ, చైత్రమాసాల సంధికాలంలో ‘హోలి’ని నియమబద్ధంగా పక్షం రోజులపాటు స్వీకరించడంవల్ల ఆరోగ్యసౌభాగ్యం చేకూరుతుందని యోగ చింతామణి సూచించింది.
ఫాల్గుణ శుద్ధ అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఎనిమిది రోజుల్ని హోలాష్టకం అంటారు. ఈ ఎనిమిది రోజుల్లో అష్టమి నాడు దుర్గాదేవి ఆరాధన ప్రారంభించి, ఫాల్గుణ పౌర్ణమినాడు లలితా త్రిపురసుందరి సహా అష్టవిధ శక్తిమాతల్ని వివిధ పుష్పాలతో పూజించే సంప్రదాయమూ ఉంది. అందుకే ఈ పౌర్ణమిని శక్తిపౌర్ణమిగా చెబుతారు. మామిడి పూత, వేప చిగురు, తేనె, కరక్కాయపొడి కలిపిన పదార్థాన్ని హోలీనాడు స్వీకరించడం వల్ల రాబోయే వేసవి వేడిని తట్టుకోగల శక్తి సమకూరుతుందని ఆయుర్వేదం చెబుతోంది. దీన్నే ‘హోలీ మధుప్రాశనం’గా ప్రస్తావిస్తారు. చందన జలం, వసంతం, సుగంధపొడి, తులసి, బిల్వ, జాజి, వేప, రావి పత్రాల రసం కలిపిన ద్రవాన్ని హోలీనాడు చిలకరించుకుంటే శరీరం కాంతిమంతంగా తేజరిల్లుతుందని వైద్యరత్నాకరం వివరిస్తోంది. ఆధ్యాత్మిక సాధన, ఆరోగ్య సౌభాగ్య భావనలతో జీవితాల్ని వర్ణమయం చేసుకోవాలని హోలీ పండుగ సందేశమిస్తోంది!
డాక్టర్ కావూరి రాజేశ్పటేల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. -
ధర్మ రక్షణ
సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి