నకిలీ వార్తలతో జాగ్రత్త!
నిజం నిలకడ మీద తెలుస్తుంది. కానీ, అంతలోగా అబద్ధం సమస్త లోకాన్నీ చుట్టేసి వస్తుంది. ప్రజాసమూహాల నడుమ విద్వేషాలకు అంటుకడుతుంది. కొన్ని సందర్భాల్లో అది దారుణ హింసోన్మాదాన్నీ ప్రేరేపిస్తుంది. కొన్నేళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్లోని ముజఫర్నగర్లో చెలరేగిన అల్లర్లకు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఒక నకిలీ వార్తే పుణ్యం కట్టుకుంది.
నిజం నిలకడ మీద తెలుస్తుంది. కానీ, అంతలోగా అబద్ధం సమస్త లోకాన్నీ చుట్టేసి వస్తుంది. ప్రజాసమూహాల నడుమ విద్వేషాలకు అంటుకడుతుంది. కొన్ని సందర్భాల్లో అది దారుణ హింసోన్మాదాన్నీ ప్రేరేపిస్తుంది. కొన్నేళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్లోని ముజఫర్నగర్లో చెలరేగిన అల్లర్లకు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఒక నకిలీ వార్తే పుణ్యం కట్టుకుంది. తాజాగా తమిళనాడులో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ బూటకపు కథనాలు, వీడియోలు విరివిగా వ్యాప్తిలోకి వచ్చాయి. బిహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో అవి తీవ్ర కలకలం సృష్టించాయి. వెనువెంటనే ప్రతిస్పందించిన తమిళనాడు ప్రభుత్వం- క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ ద్వారా అదంతా తప్పుడు ప్రచారమేనని ప్రకటించింది. జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారందరి భద్రతకు పూర్తిస్థాయిలో హామీ ఇస్తూ, అసత్య సమాచారాన్ని ప్రచారంలోకి తెచ్చినవాళ్లను వేగంగా గుర్తించి కేసులు నమోదు చేసింది. వలస కార్మికులపై దాడులంటూ వెలువడిన వీడియో క్లిప్పింగులు నకిలీవని తమిళనాడులో పర్యటించిన బిహార్ అధికారుల బృందమూ కొట్టిపారేయడంతో ఆందోళనలు కొద్దిమేరకు ఉపశమించాయి. ప్రధాని మోదీ ఇటీవల హెచ్చరించినట్లు- జాతీయస్థాయిలో పెనుఉద్రిక్తతలకు కారణభూతమయ్యే విధ్వంసక సామర్థ్యం నకిలీ వార్తల సొంతం. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో చలామణీ అయ్యే సమాచారాన్ని విశ్వసించే ముందు, మరొకరికి ఫార్వర్డ్ చేసే మునుపు ఒకటికి పదిసార్లు తరచి చూసుకోవాలన్నది వాస్తవం. కానీ, సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజాలేనని నమ్మేవారికి కొదవలేని ఇండియాలో వదంతుల వ్యాప్తి పోనుపోను మంచినీళ్ల ప్రాయమవుతోంది!
దాదాపు 75కోట్ల స్మార్ట్ఫోన్లు, 80కోట్ల అంతర్జాల వినియోగదారులు కలిగిన భారతదేశంలో- వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి మాధ్యమాలు ప్రజాభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తులుగా అవతరించాయి. విద్వేష వ్యాఖ్యలు, ఆన్లైన్ వేధింపులకు ప్రధాన సాధనాలుగానూ అవి ఎప్పటినుంచో పరువు మాస్తున్నాయి. వాటికి తోడు ప్రముఖ మీడియా సంస్థల లోగోలు, చిత్రాలను దుర్వినియోగం చేస్తూ అసలైన వార్తల రూపంలోనే నకిలీ కథనాలకు పురుడుపోసి, జనంలోకి వదిలే ముఠాలూ నెట్టింట్లో తిష్ఠవేశాయి. సంకుచిత స్వప్రయోజనాల కోసం అసత్యాలు, అర్ధసత్యాలను కలబోసి ఆయా అజ్ఞాత బృందాలు వండివార్చే వదంతుల తీవ్రత ఇండియాలోనే అత్యధికమని అంతర్జాతీయ అధ్యయనాలు గతంలోనే నిగ్గుతేల్చాయి. వ్యవస్థీకృతంగా పనిచేస్తున్న అరాచక మూకలతో ఎన్నికల సమయంలోనైతే అటువంటి బూటకపు కథనాల వ్యాప్తి విశృంఖలమవుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ‘ఒక్క నిమిషం యూట్యూబ్ చూస్తే ఎన్నో నకిలీ వార్తలు కనిపిస్తాయి... ఎవరైనా అందులో ఒక ఛానెల్ను ప్రారంభించుకునే అవకాశం ఉంది... వెబ్పోర్టళ్లపై ఎవరి నియంత్రణా లేదు’ అని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే గతంలో ఆందోళన వ్యక్తంచేసింది. పుక్కిటి పురాణాల కార్ఖానాలుగా వర్ధిల్లుతున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం అడపాదడపా చర్యలు తీసుకుంటోంది. కానీ, జనవర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా వదంతులు, అసత్య వార్తలను సృష్టిస్తున్న ప్రతీప శక్తులను ఎప్పటికప్పుడు జల్లెడపట్టే సరైన వ్యవస్థలే దేశీయంగా కొరవడ్డాయి. అదే సమయంలో అసమ్మతి స్వరాలను అణచివేయడానికే ఎక్కువగా సామాజిక మాధ్యమాలపై సర్కారీ వర్గాలు నిఘా వేస్తున్నాయనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. మతసామరస్యం వంటివాటిని దెబ్బతీస్తూ మూకదాడులకు కారణభూతమవుతున్న నకిలీవార్తల సృష్టికర్తలపై ఉక్కుపాదం మోపడం అత్యావశ్యకం. ఆ క్రమంలో ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమైన ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడమూ అత్యంత కీలకమే. సున్నితమైన ఆ సమతౌల్యాన్ని సాధించడం ప్రభుత్వాల విధివిహిత కర్తవ్యం. అందులో అవి విజయవంతమైతేనే- దేశీయంగా అంతర్జాలం సురక్షితమవుతుంది!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ