రంగుల సంబరం
ప్రకృతి రసాకృతి దాల్చి, హరితార్ణవంగా శోభిల్లే తరుణంలో, ఆ ప్రకృతికి సౌందర్యభరితంగా స్వాగతం పలికే రంగుల సంబరం- హోలీ! వసంత పంచమికి ప్రకృతిలో వసంతరుతువు లక్షణాలు అంకురిస్తే, ఫాల్గుణ పూర్ణిమ నాటికి వసంతశోభ పరిపూర్ణమవుతుంది.
ప్రకృతి రసాకృతి దాల్చి, హరితార్ణవంగా శోభిల్లే తరుణంలో, ఆ ప్రకృతికి సౌందర్యభరితంగా స్వాగతం పలికే రంగుల సంబరం- హోలీ! వసంత పంచమికి ప్రకృతిలో వసంతరుతువు లక్షణాలు అంకురిస్తే, ఫాల్గుణ పూర్ణిమ నాటికి వసంతశోభ పరిపూర్ణమవుతుంది. ఆసేతు హిమాచలం రంగుల కేళి హోలీని ఆహ్లాదభరితమైన వేడుకగా జరుపుకొంటారు. అందుకే విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్ హోలీని ‘జనపర్వం’గా అభివర్ణించారు.
ధర్మరాజుకు నారదుడు హోలీ విధి విధానాల్ని వివరించిన వైనాన్ని భవిష్య పురాణం ప్రస్తావించింది. శివపార్వతుల్ని ఏకీకృతం చేసే ప్రయత్నంలో మన్మథుడు శివాగ్రహానికి గురై భస్మమవుతాడు. మదనుడి భార్య రతిదేవి ప్రార్థన మేరకు ఆమెకు మాత్రమే సశరీరంతో గోచరమై మిగిలినవారికి అనంగుడిగా అంటే అదృశ్యరూపంలో ఉంటాడని ఈశ్వరుడు వరమిచ్చాడంటారు. ఆ సందర్భమే అనంగ పౌర్ణమి. అగ్ని సైతం దహించలేని మహాశక్తిమంతురాలైన హోలిక, హిరణ్యకశిపుడి సోదరి. తన పుత్రుడు ప్రహ్లాదుణ్ని ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు. శ్రీహరి భక్తుడైన ప్రహ్లాదుడి స్పర్శవల్ల హోలిక శక్తి సన్నగిల్లి, ఆమె అగ్నికి ఆహుతైంది. ప్రహ్లాదుడు క్షేమంగా అగ్ని నుంచి బయటకు వస్తాడు. అలా ప్రహ్లాద విజయం చేకూరిన ఆ రోజే హోలికాపూర్ణిమ! నిండు పున్నమి సిరివెన్నెల వెలుగులో గోపికలు, గోపాలుడిపై వసంతాన్ని చిలకరించే వారని, యము నాతీరాన బృందావనంలో ఊయల లూగుతూ రాసలీల వేడుకలో మధు రోత్సవం వెల్లివిరిసేదని ఫాల్గుణ పౌర్ణమి శోభను భాగవతం వివరిం చింది. అందుకే ఈ పున్నమిని డోలా జాత్రగా, డోలా పూర్ణిమగా ఉత్తర భారతంలో వ్యవహ రిస్తారు.
మదుర మీనాక్షీదేవి శివదీక్షను చేపట్టి సుందరేశ్వర స్వామిని మెప్పించి, ఫాల్గుణ పౌర్ణమినాడే వివాహం చేసుకుందని ‘మీనాక్షి తంత్రసారం’ ప్రకటించింది. అందుకే ఈ పౌర్ణమిని కల్యాణ పౌర్ణమిగా పేర్కొంటారు. హోలీని ‘నవాహ్నేష్టి’గానూ ప్రస్తా విస్తారు. ఫాల్గుణ పూర్ణిమ నాటికి పొలాల్లో ఉన్న ధాన్యం, దినుసుల్ని సేకరించి మోదుగ పుల్లల మంటపై ఆవుపాలతో పాయసాన్ని తయారుచేస్తారు. ఈ పాయసాన్నే ‘హోలి’ అంటారు. ఫాల్గుణ, చైత్రమాసాల సంధికాలంలో ‘హోలి’ని నియమబద్ధంగా పక్షం రోజులపాటు స్వీకరించడంవల్ల ఆరోగ్యసౌభాగ్యం చేకూరుతుందని యోగ చింతామణి సూచించింది.
ఫాల్గుణ శుద్ధ అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఎనిమిది రోజుల్ని హోలాష్టకం అంటారు. ఈ ఎనిమిది రోజుల్లో అష్టమి నాడు దుర్గాదేవి ఆరాధన ప్రారంభించి, ఫాల్గుణ పౌర్ణమినాడు లలితా త్రిపురసుందరి సహా అష్టవిధ శక్తిమాతల్ని వివిధ పుష్పాలతో పూజించే సంప్రదాయమూ ఉంది. అందుకే ఈ పౌర్ణమిని శక్తిపౌర్ణమిగా చెబుతారు. మామిడి పూత, వేప చిగురు, తేనె, కరక్కాయపొడి కలిపిన పదార్థాన్ని హోలీనాడు స్వీకరించడం వల్ల రాబోయే వేసవి వేడిని తట్టుకోగల శక్తి సమకూరుతుందని ఆయుర్వేదం చెబుతోంది. దీన్నే ‘హోలీ మధుప్రాశనం’గా ప్రస్తావిస్తారు. చందన జలం, వసంతం, సుగంధపొడి, తులసి, బిల్వ, జాజి, వేప, రావి పత్రాల రసం కలిపిన ద్రవాన్ని హోలీనాడు చిలకరించుకుంటే శరీరం కాంతిమంతంగా తేజరిల్లుతుందని వైద్యరత్నాకరం వివరిస్తోంది. ఆధ్యాత్మిక సాధన, ఆరోగ్య సౌభాగ్య భావనలతో జీవితాల్ని వర్ణమయం చేసుకోవాలని హోలీ పండుగ సందేశమిస్తోంది!
డాక్టర్ కావూరి రాజేశ్పటేల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు