మౌనభాష
సుప్రసిద్ధ భూదానోద్యమనేత, బహుభాషావేత్త వినోభాభావే ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో వేచి ఉండగా, పాత్రికేయ బృందం ఆయనను చుట్టుముట్టింది.
సుప్రసిద్ధ భూదానోద్యమనేత, బహుభాషావేత్త వినోభాభావే ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో వేచి ఉండగా, పాత్రికేయ బృందం ఆయనను చుట్టుముట్టింది. విమానం రాక ఆలస్యం అవుతోంది కాబట్టి, తమతో కొంతసేపు ముచ్చటించమని కోరింది. ఆయన అంగీకరించారు. పాత్రికేయుల్లో వివిధ భాషలవారు ఉండటాన్ని ఆయన గమనించారు. ‘నేను ఏ భాషలో మాట్లాడితే మీకు సౌకర్యంగా ఉంటుంది?’ అని వారిని ప్రశ్నించారు. పాత్రికేయుల్లో ఒకాయనకు భావే మాటలు కొంత అతిశయంగా అనిపించాయి. దాంతో ఆయన లేచి ‘మీరు ఏ భాషలో మాట్లాడినా, అర్థం చేసుకోగల సామర్థ్యం అందరికీ ఉంది. మీకు బాగా ఇష్టమైన భాషలో మీరు మాట్లాడవచ్చు’ అన్నాడు దర్పంగా. ఆ పాత్రికేయుడికి కృతజ్ఞతలు చెబుతూ భావే, మందహాసంతో ‘నాకు మౌనం చాలా ఇష్టమైన భాష. మీకు తెలుసుగా’ అంటూ సర్దుకొని కూర్చుని మౌనముద్ర దాల్చారు. చాలాసేపటికి విమానం వచ్చింది. ప్రకటన వినిపించింది. ‘మరి శెలవా!’ అన్నట్టుగా భావే మౌనంగా తలపంకించి చిరునవ్వుతో అక్కడి నుంచి కదిలిపోయారు.
ఇది చదవగానే మనలో చాలామందికి ‘మౌనం కూడా ఒక భాషేనా?’ అనే సందేహం వస్తుంది. నిజానికి ఆ విషయంలో ఎవరూ సందేహించవలసిన పని లేదు. నిజంగానే మౌనమనేది చాలా శక్తిమంతమైన భాష. ప్రశాంత సుందరమైన హిమాలయ పర్వతసానువుల్లోనో... నిర్జనమైన ప్రదేశాల్లోని శిథిల ఆలయాల్లోనో... కార్తిక పౌర్ణమి వేళ మనం డాబాపై ఏకాంతంగా కూర్చొని చల్లని పిల్ల తెమ్మెరలను ఆస్వాదిస్తున్నప్పుడో... శ్రద్ధగా గమనిస్తే- ఆ గాలి ఊసులు చెబుతాయి మౌనం ఎంత గొప్ప భాషో! కోట్లాది శబ్దాలకన్నా మనిషికి నిశ్శబ్దం చాలా ఎక్కువ బోధిస్తుంది. మాట్లాడకుండా కూర్చోవడం కాదు, లోలోపల ఆలోచనల రొద సైతం నిలిచిపోయే ఒకానొక అద్భుతమైన స్థితి పేరు మౌనం! అప్పుడే నిశ్శబ్దం మనసును ఆవరిస్తుంది. మనిషికి ప్రశాంతత అనుభూతమవుతుంది.
మనిషి తనచుట్టూ దట్టంగా పరచుకొన్న కటిక చీకటిని, బ్రహ్మాండమైన వెలుగుల పూర్వరూపంగా ఏనాడో గుర్తించాడు. ఆ చీకటి అసలు రూపం నలుపు కాదని, అది అనంతమైన కాంతి కిరణాలను తన కడుపులో దాచుకొన్న తెల్లని దేదీప్యమానమైన వెలుగుల ముద్ద అనీ పెద్దలు ఎన్నోసార్లు వివరించారు. అదేవిధంగా నిశ్శబ్దం కూడా తన లోపల ప్రళయభీకర శబ్దాలను ఇమడ్చుకొన్నదేనని బోధించారు. ఇది నిజానికి వేద ప్రతిపాదితమైన జ్ఞానం. శబ్దోత్పత్తి ప్రకరణంలో లక్షణ శాస్త్రం దీనికి చక్కని ఉదాహరణ చెప్పింది. ‘నూతిని తవ్వి నేను నీటిని పుట్టిస్తున్నానని అనుకుంటున్నావేమో- అది పొరపాటు... నువ్వు తవ్వకముందే అక్కడ నీరున్నది. అది నీటి అవ్యక్త స్థితి అంటుంది వేదం... నీ ప్రయత్నం ద్వారా అది లోకానికి వెల్లడి అయింది’ అంటూ లక్షణశాస్త్రం వివరణ ఇచ్చింది.
ఈ సత్యాన్ని మనిషి జీర్ణించుకొంటే మౌనం మాట్లాడటమంటే ఏమిటో అర్థం అవుతుంది. గాఢమైన ప్రేమికుల మధ్య... అన్యోన్య దంపతుల మధ్య... నిర్మలమైన భక్తుడికి భగవంతుడికి మధ్య... మౌనం చాలా గొప్ప వాహిక. అనుసంధాన వేదిక. అది అవ్యక్త మధురమైన భాష. మనిషి గుర్తించడు గాని... వాస్తవానికి ప్రతి మనిషికీ ఆ భాషతో పరిచయం ఉండే ఉంటుంది. ఎదలోపలి ప్రతిస్పందనలను గమనించినప్పుడు, మరో హృదయంలోంచి అది నేరుగా తన గుండెల్లోకి ప్రసారం అయినప్పుడు మనిషి దాన్ని గమనించాలి. అది విత్తులోంచి బ్రహ్మాండమైన వట వృక్షాన్ని దర్శించడం వంటిది. ఆ తరహా సాధన ఫలించిననాడు- మౌనంలోంచి,నిశ్శబ్దంలోంచే కాదు... యోగుల సంభాషణల్లోంచి సైతం వారి అంతరంగాల్లో నెలకొన్న ప్రశాంతతను గుర్తించడం సాధ్యమవుతుంది. మాట నేర్చిన మనిషి తన ప్రయాణంలో చివరకు చేరవలసిన గమ్యం అదే!
ఎర్రాప్రగడ రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్