చేయి చేయి కలుపుదాం...
ఒక రాజుగారు వేటకు వెళ్లారు. మృగయా వినోదంలో దారి తప్పారు. పైన ఎండ, లోపల క్షుద్బాధతో నీరసించిపోయాడు. తలెత్తి చూస్తే దూరంగా ఒక కుటీరం కనిపించింది. నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఒక మహిళ కొంతమందికి అన్నప్రసాద వితరణ చేస్తోంది. రాజును చూసి రమ్మని కూర్చోబెట్టి పళ్ళెరంలో ఆహారం వడ్డించింది.
ఒక రాజుగారు వేటకు వెళ్లారు. మృగయా వినోదంలో దారి తప్పారు. పైన ఎండ, లోపల క్షుద్బాధతో నీరసించిపోయాడు. తలెత్తి చూస్తే దూరంగా ఒక కుటీరం కనిపించింది. నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఒక మహిళ కొంతమందికి అన్నప్రసాద వితరణ చేస్తోంది. రాజును చూసి రమ్మని కూర్చోబెట్టి పళ్ళెరంలో ఆహారం వడ్డించింది. కడుపునిండిన రాజు ఆమెకు కాసులమూట ఇవ్వబోయాడు. ఆమె తిరస్కరించి ‘ఇది నా ధర్మం, బాధ్యత’ అన్నది. ‘ఈ రాజ్యంలో ఆకలితో ఎవ్వరూ అలమటించరాదని మా రాజు ఇలాంటి ఏర్పాట్లు పలుచోట్ల చేశా’డని చెప్పింది. తానూ రాజైనా తనకెందుకీ ఆలోచన రాలేదా అని రాజు విచారించాడు. కృతజ్ఞతతో వెనుదిరిగి తన రాజ్యంలో కూడా అలాంటి ఏర్పాట్లు చేశాడు. ఇది కథే అయినా ఇందులో మనిషి ప్రాణం నిలబెట్టే ఆహారం గురించిన ప్రస్తావన ముఖ్యమైనది. కుద్బాధ భయంకరమైనది. సమయానికి ఆహారం అంది కడుపునిండితే చైతన్యశక్తి నిలుస్తుంది. లేకపోతే ప్రాణాలు కొడిగట్టిపోతాయి. ఆకలికి సమయాసమయాలు, రుచీ శుభ్రతలు, గొప్పా బీదా అన్న తేడాలు ఉండవు.
శరీరం, శక్తి ఉన్నప్పుడు ధర్మమార్గంలో ద్రవ్యాన్ని ఆర్జించి కడుపు నింపుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తాను, తనతోపాటు ఇతరులు కూడా సామూహికంగా ఆహారాన్ని పంచుకోవాలి. పూర్వం రోజుల్లో అతిథికి సంతర్పణ చేసిగాని ఎవరూ ఆహారాన్ని స్వీకరించేవారు కాదు. భోజన వేళ అయ్యేసరికి అతిథులను వెతికి తెచ్చేవారు. చేతులకు నిజమైన ఆభరణాలు కంకణాలు, అంగుళీయాలు కాదు... పిడికెడు మెతుకులు పంచి సాటిమనిషి కడుపునింపే అందమైన వేళ్లు! ఏ కార్యకలాపాలు సాగాలన్నా కడుపు చల్లబడాలి. భగవద్రూపమైన ఆహారాన్ని పవిత్రంగా ఆరాధించాలి. భద్రపరచుకోవాలి, ఇతరులకు పంచాలి. ప్రాణం నిలిపే ఆహారం విలువ తెలియక నిర్లక్ష్యంతో నేల పాల్జేస్తున్నాం. అవసరమైనవేళ ఆర్తులకు నాలుగు మెతుకులు విదిలించని మనం ఆడంబరాల పేరిట ఉత్సవాల్లో, సంబరాల్లో మిగిలిన పదార్థాలను మట్టిలో పడేస్తున్నాం. లోకంలో కోట్లాది ప్రాణులు సరైన తిండి దొరకక అలమటిస్తున్నారు. ఉపయోగించే ఆహారం కంటే వృథా చేసేదే అధికమని గణాంకాలు చెబుతున్నాయి. రాశులకొద్దీ ఆహారం సద్వినియోగం కావడం లేదు. ఇలాంటి స్థితిలో ఆకలి బాధలు, ఆహారం విలువ తెలిసిన కొందరు ముందుకు దూకి శుభకార్యాలలో, పండుగలలో ఉపయోగించని ఆహారాన్ని దాతల ద్వారా సేకరిస్తున్నారు. అన్నమో రామచంద్రా అని అలమటించే అభాగ్యులకు వడ్డన చేస్తున్నారు. ఆహారంపట్ల తమ ప్రేమను చాటుతున్నారు. ఒక మహాయజ్ఞంలా కొనసాగిస్తున్నారు. అవకాశాలను సృష్టించుకొని పలువురు దాతలు వారికి సహకరిస్తున్నారు. మానవ మనుగడకు కనీస సదుపాయాలైన ఆహారం, నివాసం, వస్త్రం లభించని దీనులెందరో. చాలా ఇళ్లలో ఉపయోగించని వస్త్రాలు దర్శనమిస్తాయి. అవి అభాగ్యులకు చేరితే చిరుగుల బతుకులకో చిన్న ఆశ. శీతవేళల్లో చలికి వణికే నిరుపేదలకు వస్త్రాలనందిస్తే... అదే మాధవసేవ.
సర్వ ప్రాణులను సమంగా ఆదరించేవారు, ఇతరుల దుఃఖాన్ని తమదిగా స్వీకరించేవారు ఉత్తములని గీతలో పరమాత్మ చెప్పిన మాటలు దీనులను పరికించినప్పుడు జ్ఞప్తికి రావాలి. దేవుణ్ని స్మరిస్తూ చేసే అన్నదానం భగవంతుడిని చేరుతుంది. ఈ యజ్ఞంలో తామూ పాల్గొనాలనే తలపు బలంగా నాటుకోవాలి. మూసుకున్న మానవ హృదయ మందిర ద్వారాలు తెరచుకోవాలి. కారుణ్యపు జేగంటలు మది మదిలో మోగాలి. గింజ రక్షణకు కర్షకుడు పడే కష్టం కళ్లముందు కదలాడాలి. అమృత సమానమైన అన్నకణాలు అన్నార్తులకు చేరాలి. కడుపునిండినవారి ముఖాల్లో ఆనందం తాండవించాలి.
మాడుగుల రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ