ఆధ్యాత్మిక శక్తి
లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా మనుషులకు కలిగే భ్రమను వేదాంతం ‘లోకమాయ’ అంటుంది. అది తొలగిపోనంత కాలం, భౌతిక లోకంలో మనిషి అక్కడ సమస్యలనుకునే ఏ ఒక్కదానికీ పరిష్కారాలు ఉండవంటుంది. ఆ ప్రపంచంలో అతడు జీవితం అనుకుంటున్నది అశాశ్వతమని, శాశ్వతత్వం లేని దేనికోసమైనా శ్రమించడం నిష్ప్రయోజకమని తెలుసుకొమ్మంటుంది.
లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా మనుషులకు కలిగే భ్రమను వేదాంతం ‘లోకమాయ’ అంటుంది. అది తొలగిపోనంత కాలం, భౌతిక లోకంలో మనిషి అక్కడ సమస్యలనుకునే ఏ ఒక్కదానికీ పరిష్కారాలు ఉండవంటుంది. ఆ ప్రపంచంలో అతడు జీవితం అనుకుంటున్నది అశాశ్వతమని, శాశ్వతత్వం లేని దేనికోసమైనా శ్రమించడం నిష్ప్రయోజకమని తెలుసుకొమ్మంటుంది. అది తెలియాలంటే ముందుగా తన పుట్టుక, మరణం, ఆ తరవాత జరిగేదేమిటన్న విషయాలమీద ఆసక్తిని అతడు పెంచుకోక తప్పదంటుంది. అప్పుడే తానెవరన్నది తెలుసుకోగలడంటుంది.
మనిషి ఆలోచనలన్నీ తానుండే ప్రపంచం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. కాలపరిమితులు లేని అనంత దివ్యత్వమైన బ్రహ్మమే భగవంతుడని, అదొక్కటే సత్యమనే వేదాంతుల మాటలు అతడికి బోధపడవు. తాను చూస్తున్న ప్రకృతి పరిసరాలనే ‘సత్యం’గా భావిస్తాడు. లౌకికమైన అటువంటి ఆలోచనలతో, సత్యశోధనకు వేదాంతులు కావాలనే బుద్ధీ మనసులపై ఆధిపత్యం అతడికి రాదు. వేదాంతం చెప్పే ఏ విషయం ప్రయోజనకరమైనదిగా అనిపించదు.
వేదాంతులనేవన్నీ అర్థం కావాలంటే మనిషి ఆధ్యాత్మికుడు కాక తప్పదు. అతడిలో ఆధ్యాత్మికత చిగురించడం ఆరంభమైతే- మానసిక స్థిరత, సమభావన, శారీరక బుద్ధిబలాలతోపాటు ఆత్మబలమూ సమకూరుతుంటుంది. అప్పటిదాకా జ్ఞానమని తాను అనుకుంటున్న దాన్ని మించిన జ్ఞానం ఉందని అతడు గ్రహిస్తాడు. అదీ తనకు అవసరమని తెలుసుకుంటాడు. ఆధ్యాత్మికత అతడి చేత తన అస్తిత్వపు లోతులు వెతికిస్తుంది. అహంకారానికి దూరమయ్యే ప్రయత్నాలు చేయిస్తుంది. దానికి దూరమవుతున్నకొద్దీ భగవంతుడికి దగ్గర అవుతుంటాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అన్నమాట అర్థం కావడం మొదలవుతుంది. పాండురంగ భక్తుడైన నామదేవుడు ‘విఠలా! ఇన్నాళ్లూ నేనే నేను అనుకుంటున్నాను. గురువుల నుంచి పొందిన జ్ఞానంతో ఆ నేను నువ్వేనని తెలుసుకున్నాను’ అని తానే రచించి పాడిన ఒక పాటలో అంటాడు.
ప్రహ్లాదుడు జన్మతః ఆధ్యాత్మికుడు. అది నచ్చని తండ్రి చేతిలోనే హింసలెన్నో భరించాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడి అణువణువులో తొణికిసలాడిన ఆధ్యాత్మికతే అతణ్ని రక్షించింది. దృఢమైన ఆధ్యాత్మిక సాధనలు చేసేవారికి భగవంతుడెప్పుడూ తోడుగానే ఉంటాడు. ఐహిక ప్రపంచం కలిగించే దృక్పథాలను మార్చుకునేందుకే ఆధ్యాత్మిక సాధనలు అవసరమవుతాయి. మహా వేదాంతి శంకరుడు చెప్పిన ‘తత్వమసి’ ఆ సాధనలన్నింటికీ పరాకాష్ఠ. అంతిమ సత్యమైన బ్రహ్మాన్ని చేరుకునేందుకు మనిషి చేయాలనుకునే ప్రయాణం ఆధ్యాత్మిక వాతావరణముంటేనే కాని ఆరంభమే కాదు. అది సృష్టించుకోవడం అతడి చేతిలోనే ఉన్న పని.
స్ఫూర్తిదాయకమైన విలువల్ని పాటించే వ్యక్తులు ఆధ్యాత్మికులయ్యేందుకు కష్టపడనక్కరలేదు. సమయపాలన, వేళకు నిద్రాహారాలు, సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం, భగవద్ధ్యానాలు వారు ఆచరించే కర్మానుష్ఠానాల స్థాయిని పెంచుతాయి. ఆధ్యాత్మికశక్తి లభించే వనరులు ఎక్కడున్నా అన్వేషించి తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అర్హులకే లభించగల జ్ఞానం అనుకోవడం అపోహ. ఉన్న సమయంలో అది ఏ కొద్దిపాటిదైనా, మనుషులంతా ఆధ్యాత్మికులై ఉండగలిగితే- మానవ పతనానికి కారణమవుతున్నవాటిని అడ్డుకునేందుకు మరోశక్తి అవసరం ఉండకపోవచ్చు.
జొన్నలగడ్డ నారాయణమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!