బాల్యం వికసిస్తేనే...
శైశవం, బాల్యం, కౌమారం, యౌవనం, గార్హస్థ్యం(గృహస్థాశ్రమం), వానప్రస్థం- ఇవి మానవ జీవన దశలు. వీటిలో బాల్యం ఎంతో కీలకమైంది. బంగారు భవిష్యత్తుకు పునాది పడేది బాల్యావస్థలోనే. బాల్యదశను చక్కగా మలచే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. పిల్లవాడు మంచిగా ప్రవర్తిస్తే...
శైశవం, బాల్యం, కౌమారం, యౌవనం, గార్హస్థ్యం(గృహస్థాశ్రమం), వానప్రస్థం- ఇవి మానవ జీవన దశలు. వీటిలో బాల్యం ఎంతో కీలకమైంది. బంగారు భవిష్యత్తుకు పునాది పడేది బాల్యావస్థలోనే. బాల్యదశను చక్కగా మలచే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. పిల్లవాడు మంచిగా ప్రవర్తిస్తే చూసినవారు అతడి తల్లిదండ్రుల్ని ప్రశంసిస్తారు. అభినందిస్తారు. పిల్లవాడి ప్రవర్తన సరిగ్గా లేకపోతే తల్లిదండ్రుల్ని నిందిస్తారు. బాలుడికి మొదట మాట నేర్పేది తల్లి. నడత నేర్పేవాడు తండ్రి. సంస్కారం, చదువుతో తీర్చిదిద్దేవాడు గురువు. ఈ ముగ్గురి మాట వింటూ సర్వదా వారిని గౌరవించే పిల్లవాడు ఇటు కుటుంబంలోను, అటు సమాజంలోను పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతాడు. బాలుడే కాదు, బాలికైనా అంతే!
రామాయణ, భారత, భాగవతాలలోను, అష్టాదశ పురాణాలలోను ఇందుకు ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వసిష్ఠ, విశ్వామిత్రుల వద్ద సకల విద్యలూ అభ్యసించారు. అనేక సందర్భాల్లో శిష్యులుగా వారి వినయ విధేయతలు ఎంతో ముచ్చట కలిగిస్తాయి. లవకుశులు తల్లి సీతమ్మను ఎంతగా ప్రేమించారో, వాల్మీకి మహర్షిని అంత గొప్పగానూ గౌరవించి విద్య నేర్చుకున్నారు. భారతంలో పాండవులు భీష్మ, ద్రోణాచార్యుల వద్ద ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. వారి వినమ్రతకు గురువులు పొంగిపోయేవారు. అభిమన్యుడు తల్లి ఉత్తర గర్భంలో ఉండగానే పద్మవ్యూహ ప్రవేశ విధానం తెలుసుకున్నాడు. అందులోంచి తిరిగి వచ్చే మెలకువలు తెలియకపోయినా- తన ధీరత్వం, శౌర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడంటే, అతడి తల్లిదండ్రులు ధన్యులని శ్లాఘించకుండా ఉండగలమా? ప్రహ్లాదుడు తల్లి లీలావతి గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి నుంచి శ్రీహరి నామ మాహాత్మ్యం తెలుసుకుని పరమభక్తుడైనాడు. ధ్రువుడు తల్లి పొందిన అవమానం చూసి, కుంగిపోయి అడవులకు వెళ్ళాడు. నారద మహర్షి ఉపదేశించిన ద్వాదశాక్షరీ మంత్రంతో తీవ్ర తపస్సు చేసి, రాజ్యపాలన సాగించి- చివరకు ధ్రువమండలానికి వెళ్ళి భాసిల్లాడు.
శ్రీకృష్ణుడు బాల్యంలోనే అసమానమైన, అనంతమైన లీలలు చూపి, ఆర్తులను ఆదుకున్నాడు. పరమ శివ భక్తుడైన మార్కండేయుడు తల్లిదండ్రుల శివభక్తి ప్రపూరితమైన బోధలకు ప్రభావితుడై పరమేశ్వరుడి సాక్షాత్కారం పొంది చిరంజీవి అయినాడు. ఆదిశంకరులు పిన్నవయసులోనే సన్యాసం స్వీకరించి లోకానికి అద్భుతమైన ఆధ్యాత్మిక సంపదనందించి జగద్గురువుగా లోకవంద్యులైనారు.
ఛత్రపతి శివాజీకి తల్లి జిజియా బాయి రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలలోని ఆదర్శవంతమైన గాథలు వినిపించి యోధుణ్ని చేసింది. బ్రహ్మనాయుడు... తనయుడైన బాలచంద్రుడికి బాల్యంనుంచే పోరాట పటిమ బోధించాడు. గణపతి దేవుడు కూతురు రుద్రమదేవికి బాల్యంలోనే పురుష వేషం ధరింపజేసి యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు.
నేడు ఎందరో బాలమేధావులు తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహం, శిక్షణలతో వెలుగులోకి వస్తున్నారు. సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం, నటన, ఇంద్రజాలం, మూకాభినయం, వక్తృత్వం, కవిత్వం లాంటి అనేక కళలలో అతిపిన్న వయసులోనే నిష్ణాతులవుతున్నారు. పిల్లలను తీర్చిదిద్దడంలో పెద్దలదే గురుతర బాధ్యత. బాల్య కుసుమం వికసిస్తే ఆదర్శ వ్యక్తిత్వ పరిమళం విశ్వమంతటా పరివ్యాప్తమవుతుంది.
చిమ్మపూడి శ్రీరామమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు