కోరుకోదగినవి
పెళ్ళి కాబోయే కన్య అబ్బాయి రూప లావణ్యాలను, ఆమె తల్లి ధనాన్ని, తండ్రి విద్యాబుద్ధులు, గుణగణాలను, బంధుజనం మంచి విందు భోజనాన్ని కోరుకుంటారని ఓ చమత్కార శ్లోకం ఉంది. సాధారణంగా జరిగే పెళ్ళి విషయంలోనే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కోరిక. అలాంటిది అనంతమైన మనుషులు, మనస్తత్వాలు కలిగిన ఈ ప్రపంచంలో కోరికలకు అంతం ఉండదు.
పెళ్ళి కాబోయే కన్య అబ్బాయి రూప లావణ్యాలను, ఆమె తల్లి ధనాన్ని, తండ్రి విద్యాబుద్ధులు, గుణగణాలను, బంధుజనం మంచి విందు భోజనాన్ని కోరుకుంటారని ఓ చమత్కార శ్లోకం ఉంది. సాధారణంగా జరిగే పెళ్ళి విషయంలోనే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కోరిక. అలాంటిది అనంతమైన మనుషులు, మనస్తత్వాలు కలిగిన ఈ ప్రపంచంలో కోరికలకు అంతం ఉండదు. మనసు నిరంతరం ఏదొకటి కోరుతూనే ఉంటుంది. ఒకటి నెరవేరితే మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది.
వయసు, స్థాయి, కాలమాన పరిస్థితులకు తగ్గట్లు కోరికలు ఉండాలి. పేదవాడు పేదరికం తొలగి సుఖమయ జీవనం గడపాలని కోరుకోవాలి. విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, ఉద్యోగార్థి తగిన ఉద్యోగం రావాలని, మధ్యతరగతి వ్యక్తి జీవనానికి లోటు లేకుండా జీవితం గడవాలని... కోరుకోవడం సహేతుకం. పగ్గాలు వేసి పట్టుకోకపోతే గుర్రం అదుపు తప్పినట్టే, అలవికాని కోరికలు కోరినవారి జీవితాలు గతి తప్పుతాయి. శంకరాచార్యులు బ్రహ్మచర్యాశ్రమంలో మధుకరం(భిక్ష) కోసం ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లాలు కడు పేదరాలు. భిక్ష వేయడానికి ఏమీ లేకపోవడంతో తటపటాయిస్తున్న సమయంలో ఆమె ధనవంతురాలు కావాలని కోరుకుని లక్ష్మీదేవిని ప్రార్థించి కనకధారా స్తోత్రం ఆశువుగా చెప్పారు. ఆయన తన సొంతానికి ఏమీ కోరుకోలేదు. కోరిక అంటే ఎలా ఉండాలో తెలుపుతుంది ఈ కథ.
పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, కావ్యాలు తదితరాలు అన్నింటిలోనూ అనేకమైన కోరికలున్నవారి ప్రస్తావన ఉంది. వాటిని నెరవేర్చుకోవడానికి తపస్సు, ధ్యానం, ప్రార్థనలను ఆశ్రయించారు. తపస్సు చేసి దేవుణ్ని మెప్పించి అలవికాని కోరికలు కోరినవారు వరాలు పొందినా వాటి ఫలితాలను పొందలేకపోయారు. దీనికి హిరణ్యకశిపుడు, రావణా సురుడు ఉదాహరణలు. వీరిద్దరూ మరణం లేకుండా వరం కోరుకున్నారు. అవి కోరదగిన కోరికలు కాదు. కానీ చేసిన తపస్సుకు వరాలు ఇవ్వకపోతే మార్గాంతరం లేదు. వాటిని ఇచ్చినట్టే ఇచ్చి వారు కోరిన తీరులోని లోపాలతో వధించారు. శిశుపాలుడి తల్లి శ్రీకృష్ణుణ్ని వరమడిగింది. ఆమె అడిగినట్లు నూరు తప్పులు మన్నించిన తరవాతే శిశుపాలుణ్ని సంహరించాడు. ‘నీ పాదపద్మాల సేవ, ఆ సేవ చేసే వారితో స్నేహం అంతులేని భూతదయ నాకు ప్రసాదించు’ అని సుదాముడు శ్రీకృష్ణుణ్ని కోరుకున్నాడు.
దైవదర్శనానికి వెళ్ళేవారు తమకు కావాల్సిన వాటి జాబితా ఏకరువు పెడతారు. అవన్నీ తనకు, తన కుటుంబానికి సంబంధించినవే అయి ఉండవచ్చు. కానీ ఇతరుల గురించి ఎవరూ సాధారణంగా ఏమీ కోరరు. అలా కాకుండా అందరూ సుఖంగా ఉండాలి అని మనసారా కోరుకుంటే అందరిలో మనమూ ఒకరమై సుఖంగా ఉంటాం.
కోరికలను తీర్చుకోవడానికి రెండు పద్ధతులు అవలంబిస్తారు. వాటిలో మొదటిది ప్రయత్నం. రెండోది మొరపెట్టుకోవడం. రెండోదానికంటే మొదటిదే సరైనది. సరైన కోరిక కోరుకుని, తగిన ప్రయత్నం చేసి దాన్ని నెరవేర్చుకోవడం సరైన పద్ధతి. ప్రయత్నం చేస్తున్నాడంటే అది తగినది, నెరవేర్చుకోదగిన కోరికే అయి ఉంటుంది. అలా కాకుండా దేవుడికి మొరపెట్టుకున్నాడంటే అది అలవికాని కోరిక కిందే లెక్క.
అయ్యగారి శ్రీనివాసరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్