ఏకాగ్రత
నిగ్రహం లేనివాడు నిలకడ లేనివాడు ఒకటేనని సామెత. నిగ్రహం వల్లనే నిలకడ సాధ్యమవుతుంది కనుక ఆ సామెత పుట్టింది. నిగ్రహం అంటే మనసును, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడమే.
నిగ్రహం లేనివాడు నిలకడ లేనివాడు ఒకటేనని సామెత. నిగ్రహం వల్లనే నిలకడ సాధ్యమవుతుంది కనుక ఆ సామెత పుట్టింది. నిగ్రహం అంటే మనసును, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడమే. మనసును అదుపులో పెట్టుకుంటే శమమని, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే దమమని పిలుస్తారు. ఈ శమదమాలు యోగాన్ని అభ్యసించే వారికే కాదు, విద్యాభ్యాసం చేసేవారికీ అవసరమే. తరగతి గదిలో పాఠం విన్నప్పుడుగాని, ఆ పాఠం ఇంట్లో చదువుతున్నప్పుడు గాని, పరీక్షలు రాస్తున్నప్పుడు గాని విద్యార్థికి నిగ్రహం తప్పనిసరి. విద్యార్థికే కాదు, ఏ వ్యక్తి ఏ పని చేసినా దానిమీద శ్రద్ధ ఉంచాలి కదా! ఆ శ్రద్ధకే నిగ్రహం అని పేరు. ఆవకాయ పచ్చడి మొదలుకొని, అణు బాంబులు తయారు చేసేవరకు... నిగ్రహం ఉండాల్సిందే.
నిగ్రహం అంటే ఏకాగ్రత. ఏ పని చేస్తున్నామో దానిమీద మనసు నిలపడం. వస్తు ప్రదర్శన శాలకు వెళ్ళినా, విహార యాత్రకు వెళ్ళినా మనకున్న ఏకాగ్రతను బట్టి ఆనందం కలుగుతుంది. ఇంతెందుకు- బ్యాంకులావాదేవీలు జరిపేటప్పుడు ఏకాగ్రచిత్తులం కావలసిందే. లేకపోతే చిత్తైపోతాం. ఏకాగ్రతకే జాగరూకత అని మరొక అర్థం. ఏకాగ్రత వల్ల వస్తురూపం మనసులో నిలబడుతుంది. దాని స్వరూపం బోధపడుతుంది. దాన్ని ఉపయోగించుకునే విధానం అవగతమవుతుంది.
సాధారణంగా మనంచేసే పనులకే ఏకాగ్రత అవసరమైనప్పుడు, యోగమార్గంలో నడిచేవారికి దాని అవసరం మరింత ఉంటుంది. ఉదాహరణకు, భగవంతుణ్ని ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు ఆయన నామాన్ని గుర్తుచేసుకోవాలి. నామస్మరణతో పాటు అర్థభావన చేయాలి. ఏకాగ్రతలేని మనిషికి ఏదీ సాధ్యం కానప్పుడు యోగవిద్య సాధ్యమవుతుందని ఎలా చెప్పగలం?
యోగమంటే ఏకాగ్రత. చిత్తవృత్తులను నిరోధించుకొని కేవలం భగవంతుణ్ని మాత్రమే అనుభవంలోకి తెచ్చుకోవడమే యోగం. అయితే భగవంతుడు సాకారుడా, నిరాకారుడా తెలుసుకోవలసి ఉంది. సాకార రూపంలో భగవంతుణ్ని అర్చించాలన్నా ఏకాగ్రత అవసరమే. మరి నిరాకారుడైన భగవంతుణ్ని మనసులో ధ్యానించాలని అనుకున్నప్పుడు మరింత ఏకాగ్రత అవసరమవుతుంది. మనం తోటలోకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒకచోట ఆగిపోయి, తదేక దృష్టితో ఒక పూలమొక్క దగ్గర నిలిచిపోతాం. అదే ఏకాగ్రత అంటే. మన కళ్లముందు ఎన్ని వస్తువులున్నా, ప్రత్యేకంగా ఒక వస్తువు మీదనే దృష్టి పెట్టడమే ఏకాగ్రత.
ఏకాగ్రతను ఎలా సాధించాలని చాలామంది అడుగుతుంటారు. చంచలమైన మనసును మనకు కావలసిన వస్తువుమీదకానీ, విషయం మీదకాని కదలకుండా నిలపడమే ఏకాగ్రత. మనకు శ్రద్ధతోపాటు లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది. ‘నా మనసు చలిస్తోంది... దీన్ని కట్టడి చేయడం ఎట్లా?’ అని అర్జునుడు యుద్ధ రంగంలో అడిగినప్పుడు, కృష్ణుడు అతణ్ని ‘యోగివి కమ్ము’ అంటాడు. మనసుతోపాటు ఇంద్రియాలను అదుపులో పెట్టుకొమ్మని కృష్ణుడిచ్చిన సందేశం యుద్ధం చేసి విజయాన్ని సంపాదించడానికి అర్జునుడికెంతో ఉపయోగపడింది.
మనం కూడా ఏ పని చేసినా మనసును, ఇంద్రియాలను నిగ్రహించుకున్నట్లెతే, అనుకున్నది సాధించగలుగుతాం. జీవితంలో విజేతలమై నిలుస్తాం!
ఆచార్య మసన చెన్నప్ప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు. -
అనుభవ సారం
జీవితం ప్రతీ క్షణం ఒక అనుభవమే. అటువంటి అనుభవాలే జ్ఞాపకాలుగా కాలక్రమంలో పాఠాలను చెబుతాయి. జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కానీ ఎల్లకాలం ఒకే రకమైన అనుభవాలుంటే మాత్రం విసుగు పుట్టిస్తాయి. అప్పుడు జీవితం నిస్తేజంగా తయారవుతుంది. అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకునే ఉద్దేశంతో, గాలి మార్పు పేరుతో వేరువేరు ప్రదేశాలను పర్యటించమని పెద్దలు చెబుతారు.
తాజా వార్తలు (Latest News)
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..