కళాజగత్తు
‘జీవితమే ఓ స్వప్నం’ అంటారు రమణ మహర్షి. మనిషి జీవితమే ఒక కల అయినప్పుడు నిద్రావస్థలోని కలలకు ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఏమి ఉందని ప్రశ్నిస్తారాయన.
‘జీవితమే ఓ స్వప్నం’ అంటారు రమణ మహర్షి. మనిషి జీవితమే ఒక కల అయినప్పుడు నిద్రావస్థలోని కలలకు ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఏమి ఉందని ప్రశ్నిస్తారాయన. స్వప్నాలు నిజజీవితాన్ని ప్రతిబింబించే నీడల్లాంటివని భావం. వాస్తవంకన్నా స్వప్నం గొప్పదంటాడొక తత్వవేత్త.
మానవుడి అంతరంగం నుంచి కలలు ఆవిర్భవిస్తాయని, కలలు కళాసృజనకు మూలమని కొందరు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అంతర జగత్, బాహ్య ప్రకృతుల సమ్మేళనమే కళ అని ఒక భావన. దైవానుగ్రహం వల్ల, పూర్వజన్మ వాసనా సంస్కారం వల్ల, అసమాన ప్రతిభ వల్ల మనిషి తాను చూసి ఆనందించిన ప్రకృతి సౌందర్యాన్ని తన సృజనాత్మక శక్తితో చిత్రించడం వల్ల కళలు ఆవిర్భవించాయి.
కళలు మానవ సంస్కృతికి ప్రతిబింబాలు. మానవుడు నిత్యజీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి విభిన్న వస్తువుల్ని అందంగా నిర్మించుకున్నాడు. నాగరికత వికసించాక జీవితానికి అవసరమైన పనిముట్లు తయారుచేసుకున్నాడు. మన ప్రాచీనులు అరవై నాలుగు కళలను పేర్కొన్నారు. కొన్ని కళల్ని ఉపయోగదృష్టితో, కొన్నింటిని సౌందర్య దృష్టితో సృష్టించుకున్నాడు మానవుడు. ప్రతిభానైపుణ్యాలకు ఆలవాలమైన వాటన్నింటికీ కళలనే సామాన్య నామం ఉంది. మానవుడి నిత్యావసరాలకు, శరీర సౌఖ్యానికి తోడ్పడేవి వ్యవహార కళలైతే- హృదయానికి ఆనందం కలిగించే వాటిని లలిత కళలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నృత్యం, కవిత్వం అనే అయిదూ లలిత కళలుగా ప్రసిద్ధం. మనోహరత్వం, విశ్వజనీనత, అనుకరణం లలిత కళల ప్రధాన లక్షణాలు. ఈ కళలు తాత్కాలికమైన కళానందం లేదా రసానందం నుంచి శాశ్వతమైన బ్రహ్మా నందానికి దారి చూపుతాయి. మనిషిలో ఒక చైతన్యం పుట్టి హృదయం ద్రవిస్తుంది. మెదడు ప్రకంపనలు సృష్టిస్తుంది. అప్పుడది కళారూపంగా వెలుపలికి వస్తుంది.
చిత్రలేఖనం దృశ్యకళ. వంద మాటలు చెప్పే అర్థాన్ని ఒక్క చిత్రం చెప్పగలుగు తుంది. కనబడని సత్యాన్ని కనిపెంచేలా చేసేది చిత్రకళ అంటారు ప్రసిద్ధ చిత్రకళా విమర్శకులు ఆనంద కుమారస్వామి. చిత్రం ద్వారా లిపి పుట్టింది. లిపి భాషకు వాహకమైంది. సాహిత్యానికి భాషే మూలం. శిల్పం కూడా దృశ్యకళే. రాతిని బొమ్మగా చెక్కడం శిల్పం. భారతీయ దేవాలయాలు అద్భుతమైన శిల్పకళకు ఆవాసాలు. ధ్వని, లయ ప్రధానమై శ్రవణేంద్రియం ద్వారా మనసుకు ఆనందం కలిగించేది సంగీతం. సంగీతాన్ని విని శిశువులు పాములు కూడా ఆనందిస్తాయని ఆర్యోక్తి. సామవేదం సంగీతానికి మూలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వేదాల్లో తాను సామవేదాన్ని అన్నాడు. నృత్యం దృశ్యకళ, అభినయ ప్రధానం. కవిత్వం పరిధి, వైశిష్ట్యం విస్తృతమైనవి. భాష, భావం రెండూ కవిత్వానికి ప్రధానాలు. కవిత్వానికి అనర్హమైన వస్తువు లోకంలో ఏదీలేదు. కవి దృశ్యాల్ని చదువరుల మనోఫలకాలపై సాక్షాత్కరింపజేయగలడు. కవిత్వం ఆలోచనామృతం. ఆనందాన్ని ఉపదేశాన్ని ఏకకాలంలో అందించగల సాహిత్య ప్రక్రియ. రసాస్వాదనకు కవిత్వం ఉపకరించేలా మరే కళా రూపం దోహదం చేయలేదని విజ్ఞుల అభిప్రాయం. కవిత్వం అక్షర రూపంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కావ్యరసాస్వాదుడైన సహృదయుడు పశుత్వం నుంచి దైవత్వానికి చేరుకోగలడని పండిత వాక్కు. సకల కళలు, సర్వ విద్యలు భగవన్ముఖమై, పరమార్థ సాధనాలై ఉండాలని భారతీయ భావన.
డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన