ధ్యానం అంటే?
ఒక విషయం తెలిసి ఉండటం జ్ఞానం, తెలియకపోవడం అజ్ఞానం. ఈ రెండింటికీ భిన్నమైంది, విలక్షణమైంది ధ్యానం. మనిషి చేసిన మొత్తం జీవన పయనంలో అత్యంత సున్నితం, సుకుమారం, సులభం, సరళం, సౌందర్యభరితం, సన్నిహితం, అత్యున్నతమైంది ఏదైనా ఉందంటే- అది ధ్యానం ఒక్కటే.
ఒక విషయం తెలిసి ఉండటం జ్ఞానం, తెలియకపోవడం అజ్ఞానం. ఈ రెండింటికీ భిన్నమైంది, విలక్షణమైంది ధ్యానం. మనిషి చేసిన మొత్తం జీవన పయనంలో అత్యంత సున్నితం, సుకుమారం, సులభం, సరళం, సౌందర్యభరితం, సన్నిహితం, అత్యున్నతమైంది ఏదైనా ఉందంటే- అది ధ్యానం ఒక్కటే. అందువల్లే అది కఠినమై కూర్చుంది. నిరంతర సాధకులకూ అది దొరికినట్టే దొరికి జారిపోతూ ఉంది.
నడిజాము వేళ తలుపులు బార్లా తెరచి ఆ వెంటనే సూర్యడి కిరణాలు ఇంటిలోకి రమ్మంటే వస్తాయా? మొక్కలు నాటగానే పువ్వులు పూస్తాయా? కాగితం, కలాలు చేతుల్లోకి తీసుకోగానే కవిత్వం పుడుతుందా? ఇల్లు అలకగానే పండుగ అవుతుందా? దేనికైనా సమయం, సందర్భాలు రావాలి. అది ప్రాకృతిక ప్రామాణిక నియమావళి.
ధ్యాన సాధన మొదలుపెట్టిన రోజే విశ్వామిత్రుణ్ని అయిపోవాలి, గౌతమ బుద్ధుడిగా మారిపోవాలి, కీర్తిప్రతిష్ఠలు గొప్పగా పొందాలనే ఆరాటం ఆతృతలతో ఏ లాభమూ ఉండదు. పైగా ఆ ప్రక్రియలు ధ్యానమార్గాన్ని ఆటంకపరుస్తాయి. అలాగని, అజ్ఞానంతో కాలయాపనా చెయ్యరాదు.
చిట్టిరెక్కలతో ఆకాశంలో ఎగరడం నేర్చుకుని పెరిగి పెద్దదైన తరవాత ఒక పక్షి ఆకాశం అంటే పైన అగుపడుతున్న నీలితెర అనుకుంది. దాన్ని అందుకుందామని రెక్కలార్చుకుంటూ ప్రయాణం మొదలుపెట్టింది. ఆకాశం ఎంతకీ అందలేదు. ఆ పక్షి వెనక్కి తిరిగి చూసుకుంది. అప్పటివరకూ పైన మాత్రమే అగుపడే నీలితెర కిందా కనిపించింది. అసలు తాను ఎటువైపు పయనిస్తున్నానన్న ఆలోచనలో పడింది.
సముద్రంలో పుట్టి పెరిగిన ఒక చేప ఒకనాడు సాగరం అంటే ఎవరని తెలుసుకోవడానికి సముద్రమంతా కలియతిరిగింది. ముసలిదైపోయింది గానీ సముద్రాన్ని కలవలేకపోయింది. ఒకరోజు వేటగాడు వచ్చి వలవేసి ఆ చేపను బయటకు తీశాడు. అప్పుడు తెలిసింది చేపకు అసలు సముద్రం(నీటి యానకం) అంటే ఏమిటీ అని.
ఆకాశం అన్ని దిక్కులా(అంతటా) ఉంది. అది ప్రతి జీవిలోనూ ఉంది. నీరు అనేది సముద్రం అంతటా ఉంటుంది. సముద్రంలో పుట్టి పెరిగిన ప్రతి జీవిలోనూ ఉంటుంది.
వెలుగులో ఉన్నంతసేపూ వెలుగు అంటే ఏమిటో తెలియదు. అందుకే చీకటి వచ్చి వెలుగును పరిచయం చేస్తుంది. ఆరోగ్యంగా ఉన్నంతకాలం దాని విలువ తెలియదు. అనారోగ్యం బారిన పడగానే ఆరోగ్యం స్పృహలోకి వస్తుంది. ‘అద్వైతం’ (అంటే రెండుగా విభజించలేనిది) అవగాహనలోకి రావాలంటే ముందుగా ‘ద్వైతం’ అంటే ఏమిటో అర్థం కావాలి.
అనవసరమైన (వృథా) భాగం తొలగిస్తేనే అవసరమైన (విగ్రహం) భాగం బయటపడుతుంది. ‘ధ్యానం’ తెలియాలంటే ‘ధ్యానం కానిది’ ఏమిటో ఎవరికి వారే కనిపెట్టాలి.
ముక్కుమీద కళ్లజోడు పెట్టుకుని దాని కోసం ఇల్లంతా వెతక్కూడదు. చంకలో పిల్లవాణ్ని ఎత్తుకుని వాడి జాడ కోసం ఊరంతా తిరగకూడదు. అదే రీతిన మనిషి లోపల ధ్యానం పెట్టుకుని దాన్ని పట్టుకోవడానికి బయట అన్వేషించ కూడదు. అంటే, ఆలోచించకూడదని అర్థం. ‘ఆలోచించడం’ అంటేనే మనసు సంచరించడం. మనసు తిరిగేది ఎప్పటికైనా బయటే. ఈ భూమ్మీద మనిషి పుట్టకముందే ‘ధ్యానం’ ఉంది. మనిషి వచ్చాకా తనలో ఉంది. అతడు వెళ్ళిన తరవాతా ఉంటుంది. అందుచేత తనలోనే దాగి ఉన్న దానిపట్ల ఎరుక వహించకుండా దాని గురించి ఆలోచించడం అంటే ‘ధ్యానం’ వద్దని దాన్ని అవతలకు నెట్టి వేయడమే అవుతుంది.
అనేకానేక ఆలోచనలచేత ధ్యానం కప్పి ఉంది. అందుచేత, ఆలోచనే ఆలోచనల్ని అర్థం చేసుకున్నప్పుడు ఆలోచనల సమాహారమంతా ఆగిపోతుంది. అప్పుడు ‘ధ్యానం’ బయటపడి అనుభవంలోకి వస్తుంది.
మునిమడుగుల రాజారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యక్తిత్వ సౌరభం
కొందరు వ్యక్తులను చూడగానే మంచి అభిప్రాయం కలుగుతుంది. వారి ప్రసన్న వదనం, మాటకారితనం, చేతలు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తాయి. వారికి ఎదుటివారు ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తారు. -
సంకల్ప సిద్ధి
కార్యారంభంలో చాలామందికి ఉదయించే ప్రశ్న- చేపట్టే పని సఫలమవుతుందా లేక కార్యభంగం జరిగి, సమస్యలు ఎదురై అపకీర్తి పాలవుతామా అని. అర్థరహితమైన సందేహాలు క్షణక్షణం ఎదురై మనోబలాన్ని బలహీనపరుస్తాయి. -
త్యాగం
విభిన్నగుణ సమ్మిళత రూపమే వ్యక్తి. అందులో సకల సద్గుణాలను మసకబార్చేది స్వార్థం. అన్ని దుర్గుణాలను పరిహరించేది త్యాగం. స్వార్థం మనుషులను దూరం చేస్తే ప్రేమ, త్యాగాలు దగ్గర చేస్తాయి. -
కాలవాహిని
కాలం ఈశ్వర స్వరూపమని వేదం ఉపదేశించింది. కాలం మహా బలమైంది. ఎంతో విలువైంది కూడా. అలాంటి కాలం తమకు కలిసి రావాలని, అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. -
దేవుడికి ధన్యవాదాలు!
ఎవరి ఆజ్ఞను శిరసా వహించి సూర్యుడు తన కక్ష్యలో తిరుగుతూ కాంతినిస్తున్నాడు? ఎవరి సంకల్పాన్ని అనుసరించి చంద్రుడు వెలుగునిస్తున్నాడు? ఎవరి శాసనాన్ని తలదాల్చి భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తూ జీవకోటిని భరిస్తున్నది? ఇటువంటి ప్రశ్నలెన్నో మనకు కలుగుతుంటాయి. -
మంచిగంధపు పరిమళం
మనకు గానీ ఇతరులకు గానీ ఏది హాని చేయదో అది మంచి. ఎటువంటి ప్రవర్తన వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుందో అది మంచితనం. ఇతరులు ఏమి చేస్తే మనకు బాధ కలుగుతుందో అది ఇతరులకు మనం చేయకుండా ఉండటమే సత్ప్రవర్తన అని శాంతిపర్వంలో తిక్కన చక్కగా చెప్పారు. -
అంతా మన మంచికే!
ప్రకృతిలో ఎన్నో అందమైన దృశ్యాలు... ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తే ఎంతో మనోహరంగా ఉంటుంది. దాని వెనక ఒక గొంగళిపురుగు దశ ఉందని అసలు స్ఫురించదు. పరిణామక్రమంలో అన్నీ అలా జరిగిపోతుంటాయి. ప్రకృతి మన కోసం ఎన్నో అందమైన, అద్భుతమైన ప్రయోజనకరమైన ఏర్పాట్లు చేసింది. అంతా మన మంచికే! -
భాగవత నవనీతం
భారత రామాయణాలకన్నా భాగవతాన్ని అర్థం చేసుకోవడం ఒకింత కష్టం అంటారు. ‘భాగవతము తెలిసి, పలుకుట చిత్రంబు’ అని పోతనామాత్యుడే స్వయంగా పేర్కొన్నాడు. -
పారమార్థిక జ్ఞానం
అదేం విచిత్రమో కాని- మనసులో కోరికలు ఒకదాని వెంట మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. నివసించేందుకు ఇల్లు కావాలి. ఎలాగో ఓలాగా ఇల్లు కట్టుకొంటాం. ఇంట్లోకి సౌకర్యాలు కావాలి. ఆ కోరికా తీరిపోయిందనుకొంటే- కారు... నగలు... ఇలా ఎన్నో. -
గురు నానక్ జయంతి
మనిషి ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్యమని ఎందరో ప్రవక్తలు బోధించారు. వారిలో గురునానక్ ఒకరు. సిక్కుల గురుపరంపరలో నానక్ మొదటివారు. ఆయన 1469లో ఇప్పటి పాకిస్థాన్లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తిక పూర్ణిమ నాడు జన్మించారు. -
నమస్కారం
భారతీయుల ఉన్నత సంస్కారానికి నిదర్శనం నమస్కారం. రెండు చేతులను హృదయానికి దగ్గరగా తీసుకొచ్చి ఒక్కటిగా చేర్చడం నమస్కార ముద్ర. ఎదుటి వ్యక్తి ఔన్నత్యాన్ని అంగీకరించడం ఆ చర్యకు అర్థం. ఆత్మ స్వరూపుడైన తోటి మనిషిలోని పరమాత్మను గౌరవించడం పరమార్థం. -
మోహముద్గరం
మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది. -
అందమైన బాల్యం
విత్తనం మొలకెత్తి పాదుగా పాకుతున్న క్రమంలో పందిరి వేసి తాడుతో దానికి సరైన దారి ఏర్పాటు చేస్తాం. ఒకనాటికి అది పందిరంతా అందంగా అల్లుకొని పూవులు పూస్తుంది. అవసరానికి అందుకొనేలా కాయలు కాస్తుంది. పందిరి వేయకపోతే తీగమొక్క ఒక పద్ధతి లేకుండా అడ్డదిడ్డంగా పెరుగుతుంది. -
ప్రకృతి పరవశం
నేలపై పడుకుంటే అమ్మ ఒడిలో పసిపాప పడుకొని ఉన్నంత ఆనందం. సెలయేటి నీటి తుంపరల్లో తడుస్తూ స్నానం చేస్తున్నప్పుడు ఆకాశగంగలో మునిగినంత సంతోషం. -
లయాత్మక జీవనం
చిన్నారి బుడత నెలల వయసులో తప్పటడుగులతో నడక ప్రారంభిస్తాడు. ఆగిఆగి లయగా బిడ్డ అడుగులు భూమిపై పడుతుంటే కన్నతల్లి మురిసిపోతుంది. తనపై పడే ఆ చిట్టి అడుగుల కమనీయ స్పర్శకు నేలతల్లి సైతం పులకించిపోతుంది. సూర్యభగవానుడు తూర్పు కొండలనుంచి ఉన్నపళంగా ఆకాశంలో కానరాడు. -
నిరంతర స్రవంతి
మానవ సంబంధాల పట్టాల మీదనే మనిషి జీవితం ముందుకు సాగుతుంది. సాటి మనిషితో సఖ్యంగా ఉండాలి. బంధాలను ఏర్పరచుకోవాలి. మనిషితో మనిషి ఏర్పరచుకునే ఆత్మీయతానుబంధాలే- బలం, బలగం. ఏ వ్యక్తీ చెడ్డగానో, మంచిగానో పుట్టడు. పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యాలు మనిషి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. ప్రతి వ్యక్తిలోనూ బొమ్మబొరుసులుగా మంచిచెడులు ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన పరిస్థితులకు తగ్గట్లు మారవచ్చు... -
దేవుడు మెచ్చిన పూలు
మనం భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఎన్నోరకాల పుష్పాలు తెచ్చి పూజిస్తాం. మల్లెలు, మొల్లలు, మందారాలు, సంపెంగలు, గులాబీలు, పారిజాతాలు- ఇలా ఎన్నెన్నో పూలతో పూజిస్తూ భగవదర్చనలో భాగంగా భావించి, తృప్తిచెందుతాం. ఉపాసన రెండువిధాలుగా ఉంటుంది- సగుణోపాసన, నిర్గుణోపాసన అని. -
ఆధ్యాత్మిక ఆవశ్యకత
సంపదలు ఎన్ని ఉన్నా, పదవులు ఎన్ని వరించినా అవి మనిషి మానసిక అశాంతిని తొలగించలేవు. మనోవ్యాధిని పోగొట్టలేవు. ఆత్మజ్ఞానం ఒక్కటే దీనికి పరమావధి అని గీతాచార్యుడు సెలవిచ్చాడు. -
ఎప్పుడు కోప్పడాలి?
కోపం అనేది నిన్ను నిన్నుగా నిలవనీయని ఒక అనిశ్చిత ఉద్విగ్న స్థితి. కోపానికి కారణాలు అనేకం. నష్టాలు కూడా ఎన్నో. కోపం సింహాసనం ఎక్కితే కారణం నిష్క్రమిస్తుంది. ఇంగితం నశిస్తుంది. హృదయం జ్వలిస్తుంది. చెవి మంచిమాటలు వినదు. మాట అదుపు తప్పుతుంది. -
అజ్ఞాన లోభాలు
లోకంలో లోభులకు లోటులేదు. లోభి సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తాడు. సంపాదించిన సంపద తరిగిపోతుందేమోనని నిత్యం చింతిస్తుంటాడు. ఎవరినీ నమ్మడు. లోభికి కీర్తి నశిస్తుందని, ధనమే పావనమని భావించేవారు ధర్మభ్రష్టులవుతారని, లోభికి స్నేహితులుండరని పంచతంత్రం చెబుతోంది.


తాజా వార్తలు (Latest News)
-
Karnataka: నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. 10ఏళ్ల వరకు జైలు, రూ.10కోట్ల జరిమానా!
-
QR code scams: క్యూఆర్ కోడ్ స్కామ్లతో జాగ్రత్త!
-
Shah Rukh Khan: ఆ క్షణం ప్రపంచానికి రాజునయ్యాననిపించింది: షారుక్
-
SA vs IND: దక్షిణాఫ్రికాలో ఆడటం సవాలే.. అలా చేస్తేనే బ్యాటర్లు సక్సెస్ అవుతారు: ద్రవిడ్
-
INDw vs ENGw: ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్.. తొలి మ్యాచ్లో ఓడిన భారత్
-
Revanth Reddy: హైదరాబాద్ చేరుకున్న రేవంత్రెడ్డి.. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు