చిగురంత ఆశ
ఏ పాపం తెలియని ఓ పేద యువకుణ్ని రక్షకభటులు తీవ్రవాదిగా పొరబడ్డారు. ఖైదు చేశారు. ఆ హఠాత్ పరిణామానికి యువకుడు ఎంతో కలవరపడ్డాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు.
ఏ పాపం తెలియని ఓ పేద యువకుణ్ని రక్షకభటులు తీవ్రవాదిగా పొరబడ్డారు. ఖైదు చేశారు. ఆ హఠాత్ పరిణామానికి యువకుడు ఎంతో కలవరపడ్డాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తననే నమ్ముకుని జీవిస్తున్న ముసలి తల్లిదండ్రులు అనాథలవుతారని కుమిలిపోయాడు. దానికి తోడు ఉన్న కొద్దిపాటి పొలాన్ని దున్నేవాడు లేక అది బీడు పడిపోతోందంటూ తండ్రి నుంచి అందిన లేఖ మరింత కుంగదీసింది. మరణమే శరణ్యమనిపించింది.
అంతలో అతడికి రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన ‘జీవన్ భద్రాణి పశ్యతి...’ బతికియున్నను సుఖములు బడయవచ్చుననే మాట గుర్తుకొచ్చింది. చచ్చి సాధించేదేమీ లేదని తనను తానే ఓదార్చుకున్నాడు. చటుక్కున ఒక ఆలోచన తోచింది. ఆశ చివురించింది. ఏం చెయ్యాలో వివరిస్తూ తండ్రికి ఉత్తరం రాశాడు. వారం తిరిగేసరికి తండ్రి నుంచి బదులు వచ్చింది. తమ పొలాన్ని రక్షకభటులే దగ్గరుండి దున్నించారని, వారు అలా ఎందుకు చేశారో అర్థం కాలేదని తండ్రి రాశాడు.
తన ఉపాయం ఫలించినందుకు సంతోషిస్తూ, ఆ యువకుడు ‘నా మొదటి ఉత్తరాన్ని రక్షక భటులు తెరిచి చూస్తారని నాకు ముందే తెలుసు. అందుకే ఆ భూమిలో కొన్ని ఆయుధాలను దాచి పెట్టానని నీకు రాశాను. ఇప్పుడిక నీవు అదను చూసి ఓపిక చేసుకుని విత్తనాలు జల్లు’ అని రాశాడు. ఆశ మనిషిని బతికిస్తుంది. ఆలోచన ముందుకు నడిపిస్తుంది. అదే ఈ కథలోని సందేశం.
‘మాన్స్సెర్చ్ ఫర్ మీనింగ్’ రచయిత విక్టర్ ఫ్రాంకిల్ గొప్ప మానసిక వైద్య నిపుణుడిగా పేరు గడించాడు. ఆయనకోరోజు అర్ధరాత్రిపూట ఓ మహిళ ఫోన్ చేసింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పింది. జీవితంలో తాను సర్వస్వాన్నీ కోల్పోయానని, ఇక బతకాలని లేదని చెప్పింది.
ఆమెను అనునయిస్తూ విక్టర్ దారుణమైన ఆ నిర్ణయానికి గల కారణాలను రాబట్టాడు. జీవితం ఎంత విలువైనదో వివరిస్తూ ఆమె తన సమస్యలను ఎలా అధిగమించవచ్చో చెప్పాడు. బతకడానికి ఎన్ని రకాల దారులున్నాయో చెబుతూ ఆమెతో చాలాసేపు చర్చించాడు.
చాలా రోజుల తరవాత ఆమె విక్టర్ను కలిసింది. తాను చెప్పిన ఏ అంశం ఆమెను ఓదార్చిందో, ఏ అంశం బాగా నచ్చి తన ఆలోచనను మార్చుకొనేలా చేసిందో- తెలుసుకోవచ్చా... అని విక్టర్ ప్రశ్నించాడు.
‘తీవ్రమైన నిరాశలో మునిగిపోయి, చావుబతుకుల మధ్య సతమతమవుతున్న నాతో మీరంతసేపు ఓపికగా మాట్లాడటమే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బతుకుమీద ఆశను పుట్టించింది’ అని బదులిచ్చిందామె.
సాటి మనిషికి సాయం చేయలేకపోయినా, కనీసం వారి కష్టాన్ని ఓపికతో విని, నాలుగు మంచి మాటలతో, ఓ చక్కని ఓదార్పుతో, ఓ చల్లని స్పర్శతో మనం భరోసా ఇవ్వగలిగితే ఒక జీవితాన్ని నిలబెట్టగలుగుతాం. ఇది బాహ్య ప్రేరణకు ఉదాహరణ. బతకడమే కాదు, నలుగురినీ బతికించాలన్న ఆలోచనతో జీవించడమే మనిషి బతుక్కి పరమార్థం...
ఎర్రాప్రగడ రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమో నారదా
దేవదత్తమైన వీణను ధరించి మీటుతూ నిత్యం శ్రీహరినామ సంకీర్తనం చేసే దేవర్షి పుంగవుడు నారదుడు. నారద అనే శబ్దానికి నరసంబంధమైన పాపాలను ఖండించేవాడని అర్థం ఉంది. -
ఏది సుపరిపాలన?
ప్రజాపాలన ఒక అసిధారావ్రతం. అంటే కత్తి మీద సాము చేయడం వంటిది. అధికారంలో ఉన్నప్పుడు ‘ఆహా! ఓహో’ అని పొగిడేవారు, అధికారం పోయినప్పుడు ఛీ కొడతారు. ప్రజల మన్ననలు ఎల్లకాలం ఎవరి మీదా స్థిరంగా ఉండవు. కాలానుగుణంగా మారుతుంటాయి. -
వ్యక్తిత్వ సౌరభం
కొందరు వ్యక్తులను చూడగానే మంచి అభిప్రాయం కలుగుతుంది. వారి ప్రసన్న వదనం, మాటకారితనం, చేతలు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తాయి. వారికి ఎదుటివారు ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తారు. -
సంకల్ప సిద్ధి
కార్యారంభంలో చాలామందికి ఉదయించే ప్రశ్న- చేపట్టే పని సఫలమవుతుందా లేక కార్యభంగం జరిగి, సమస్యలు ఎదురై అపకీర్తి పాలవుతామా అని. అర్థరహితమైన సందేహాలు క్షణక్షణం ఎదురై మనోబలాన్ని బలహీనపరుస్తాయి. -
త్యాగం
విభిన్నగుణ సమ్మిళత రూపమే వ్యక్తి. అందులో సకల సద్గుణాలను మసకబార్చేది స్వార్థం. అన్ని దుర్గుణాలను పరిహరించేది త్యాగం. స్వార్థం మనుషులను దూరం చేస్తే ప్రేమ, త్యాగాలు దగ్గర చేస్తాయి. -
కాలవాహిని
కాలం ఈశ్వర స్వరూపమని వేదం ఉపదేశించింది. కాలం మహా బలమైంది. ఎంతో విలువైంది కూడా. అలాంటి కాలం తమకు కలిసి రావాలని, అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. -
దేవుడికి ధన్యవాదాలు!
ఎవరి ఆజ్ఞను శిరసా వహించి సూర్యుడు తన కక్ష్యలో తిరుగుతూ కాంతినిస్తున్నాడు? ఎవరి సంకల్పాన్ని అనుసరించి చంద్రుడు వెలుగునిస్తున్నాడు? ఎవరి శాసనాన్ని తలదాల్చి భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తూ జీవకోటిని భరిస్తున్నది? ఇటువంటి ప్రశ్నలెన్నో మనకు కలుగుతుంటాయి. -
మంచిగంధపు పరిమళం
మనకు గానీ ఇతరులకు గానీ ఏది హాని చేయదో అది మంచి. ఎటువంటి ప్రవర్తన వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుందో అది మంచితనం. ఇతరులు ఏమి చేస్తే మనకు బాధ కలుగుతుందో అది ఇతరులకు మనం చేయకుండా ఉండటమే సత్ప్రవర్తన అని శాంతిపర్వంలో తిక్కన చక్కగా చెప్పారు. -
అంతా మన మంచికే!
ప్రకృతిలో ఎన్నో అందమైన దృశ్యాలు... ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తే ఎంతో మనోహరంగా ఉంటుంది. దాని వెనక ఒక గొంగళిపురుగు దశ ఉందని అసలు స్ఫురించదు. పరిణామక్రమంలో అన్నీ అలా జరిగిపోతుంటాయి. ప్రకృతి మన కోసం ఎన్నో అందమైన, అద్భుతమైన ప్రయోజనకరమైన ఏర్పాట్లు చేసింది. అంతా మన మంచికే! -
భాగవత నవనీతం
భారత రామాయణాలకన్నా భాగవతాన్ని అర్థం చేసుకోవడం ఒకింత కష్టం అంటారు. ‘భాగవతము తెలిసి, పలుకుట చిత్రంబు’ అని పోతనామాత్యుడే స్వయంగా పేర్కొన్నాడు. -
పారమార్థిక జ్ఞానం
అదేం విచిత్రమో కాని- మనసులో కోరికలు ఒకదాని వెంట మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. నివసించేందుకు ఇల్లు కావాలి. ఎలాగో ఓలాగా ఇల్లు కట్టుకొంటాం. ఇంట్లోకి సౌకర్యాలు కావాలి. ఆ కోరికా తీరిపోయిందనుకొంటే- కారు... నగలు... ఇలా ఎన్నో. -
గురు నానక్ జయంతి
మనిషి ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్యమని ఎందరో ప్రవక్తలు బోధించారు. వారిలో గురునానక్ ఒకరు. సిక్కుల గురుపరంపరలో నానక్ మొదటివారు. ఆయన 1469లో ఇప్పటి పాకిస్థాన్లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తిక పూర్ణిమ నాడు జన్మించారు. -
నమస్కారం
భారతీయుల ఉన్నత సంస్కారానికి నిదర్శనం నమస్కారం. రెండు చేతులను హృదయానికి దగ్గరగా తీసుకొచ్చి ఒక్కటిగా చేర్చడం నమస్కార ముద్ర. ఎదుటి వ్యక్తి ఔన్నత్యాన్ని అంగీకరించడం ఆ చర్యకు అర్థం. ఆత్మ స్వరూపుడైన తోటి మనిషిలోని పరమాత్మను గౌరవించడం పరమార్థం. -
మోహముద్గరం
మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది. -
అందమైన బాల్యం
విత్తనం మొలకెత్తి పాదుగా పాకుతున్న క్రమంలో పందిరి వేసి తాడుతో దానికి సరైన దారి ఏర్పాటు చేస్తాం. ఒకనాటికి అది పందిరంతా అందంగా అల్లుకొని పూవులు పూస్తుంది. అవసరానికి అందుకొనేలా కాయలు కాస్తుంది. పందిరి వేయకపోతే తీగమొక్క ఒక పద్ధతి లేకుండా అడ్డదిడ్డంగా పెరుగుతుంది. -
ప్రకృతి పరవశం
నేలపై పడుకుంటే అమ్మ ఒడిలో పసిపాప పడుకొని ఉన్నంత ఆనందం. సెలయేటి నీటి తుంపరల్లో తడుస్తూ స్నానం చేస్తున్నప్పుడు ఆకాశగంగలో మునిగినంత సంతోషం. -
లయాత్మక జీవనం
చిన్నారి బుడత నెలల వయసులో తప్పటడుగులతో నడక ప్రారంభిస్తాడు. ఆగిఆగి లయగా బిడ్డ అడుగులు భూమిపై పడుతుంటే కన్నతల్లి మురిసిపోతుంది. తనపై పడే ఆ చిట్టి అడుగుల కమనీయ స్పర్శకు నేలతల్లి సైతం పులకించిపోతుంది. సూర్యభగవానుడు తూర్పు కొండలనుంచి ఉన్నపళంగా ఆకాశంలో కానరాడు. -
నిరంతర స్రవంతి
మానవ సంబంధాల పట్టాల మీదనే మనిషి జీవితం ముందుకు సాగుతుంది. సాటి మనిషితో సఖ్యంగా ఉండాలి. బంధాలను ఏర్పరచుకోవాలి. మనిషితో మనిషి ఏర్పరచుకునే ఆత్మీయతానుబంధాలే- బలం, బలగం. ఏ వ్యక్తీ చెడ్డగానో, మంచిగానో పుట్టడు. పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యాలు మనిషి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. ప్రతి వ్యక్తిలోనూ బొమ్మబొరుసులుగా మంచిచెడులు ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన పరిస్థితులకు తగ్గట్లు మారవచ్చు... -
దేవుడు మెచ్చిన పూలు
మనం భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఎన్నోరకాల పుష్పాలు తెచ్చి పూజిస్తాం. మల్లెలు, మొల్లలు, మందారాలు, సంపెంగలు, గులాబీలు, పారిజాతాలు- ఇలా ఎన్నెన్నో పూలతో పూజిస్తూ భగవదర్చనలో భాగంగా భావించి, తృప్తిచెందుతాం. ఉపాసన రెండువిధాలుగా ఉంటుంది- సగుణోపాసన, నిర్గుణోపాసన అని. -
ఆధ్యాత్మిక ఆవశ్యకత
సంపదలు ఎన్ని ఉన్నా, పదవులు ఎన్ని వరించినా అవి మనిషి మానసిక అశాంతిని తొలగించలేవు. మనోవ్యాధిని పోగొట్టలేవు. ఆత్మజ్ఞానం ఒక్కటే దీనికి పరమావధి అని గీతాచార్యుడు సెలవిచ్చాడు.


తాజా వార్తలు (Latest News)
-
విద్యుత్పైనే తొలి గురి!.. ఆ శాఖ కార్యదర్శిపై సీఎం ఆగ్రహం
-
‘నీ భార్యను అమ్మేసైనా డబ్బు కట్టాల్సిందే!’
-
Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్- సురేందర్ రెడ్డి కాంబో.. నేపథ్యమిదే!
-
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య
-
IPL 2024: గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?