ఆధ్యాత్మిక ఆవశ్యకత
సంపదలు ఎన్ని ఉన్నా, పదవులు ఎన్ని వరించినా అవి మనిషి మానసిక అశాంతిని తొలగించలేవు. మనోవ్యాధిని పోగొట్టలేవు. ఆత్మజ్ఞానం ఒక్కటే దీనికి పరమావధి అని గీతాచార్యుడు సెలవిచ్చాడు.
సంపదలు ఎన్ని ఉన్నా, పదవులు ఎన్ని వరించినా అవి మనిషి మానసిక అశాంతిని తొలగించలేవు. మనోవ్యాధిని పోగొట్టలేవు. ఆత్మజ్ఞానం ఒక్కటే దీనికి పరమావధి అని గీతాచార్యుడు సెలవిచ్చాడు. ప్రతివారూ ప్రాపంచిక సౌఖ్యాలు, పదవులు, భోగాలు సంపాదించడం కోసం అతిగా తాపత్రయ పడకూడదు. వాటి కోసం వెంపర్లాడటం అవివేకం. బుద్బుద ప్రాయమైన ఈ జీవితాన్ని అకృత్యాలకు అంకితం చేయడం తగదు. ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. అందుకోసం దైవాన్ని ఆశ్రయించాలి. భక్తిభావం పెంపొందించుకోవాలి. అయితే, ఆ భక్తి మొక్కుబడి కాకూడదు. జీవితంతో అనుసంధానమై ఉండాలి. దైవచింతన మహత్తరమైనది. అంతర్యామిని స్మరించడం, పూజించడం, ఉత్సవాలు చేయడం... అన్నీ ఆధ్యాత్మిక సంబంధిత అద్భుతాలే. అలాగని మన ఆధ్యాత్మిక చింతన అక్కడి వరకే పరిమితం కాకూడదు. త్రికరణశుద్ధిగా భగవంతుడి అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలి. అంతేకాక, ఉన్నతమైన జీవితాన్ని గడపడం పూజా పునస్కారాల ఉద్దేశం. ధార్మిక చింతన లేకుండా పూజలు చేయడం వ్యర్థం. దీనికి హృదయ సంస్కారం ఉండాలి. కేవలం దేవాలయాలకు వెళ్ళడం, పూజలు చేయడంతో సరి పోదు. భక్తి చింతనను ఇహలోక వ్యవహారాల్లోనూ కనబరచాలి. కరుణరస భావన తొణికిసలాడాలి. ఎదుటివారికి బాధ కలిగించరాదనే ఎరుక కలిగి ఉండాలి. స్వామి వివేకానంద ‘నువ్వు దేవుణ్ని దర్శించాలంటే మానవ సేవ చెయ్యి. దేవుణ్ని చేరుకోవాలంటే కోట్లమంది దరిద్ర నారాయణులకు సేవ చెయ్యి’ అన్నారు.
ఆధ్యాత్మికం అంటే స్వభావం. అంటే, తన భావం అని అర్థం. మరోలా చెప్పాలంటే, ప్రత్యగాత్మ రూపమే ఆధ్యాత్మికం. సాధారణంగా ప్రజలు అజ్ఞానం వల్ల తాము దేహమని, మనసు అని భావిస్తుంటారు. అది వారి స్వరూపమని, స్వభావమని అనుకుంటారు. అది పొరపాటు. జీవుని వాస్తవ స్వభావం ఆధ్యాత్మికం. అంటే ప్రత్యగాత్మ భావనే కానీ దేహాదులు కాదు. తానే దేహమని, మనస్సని, ప్రాపంచిక వస్తువని అనుకోవడం వల్ల ఎవరికీ శాంతి సుఖాలుండవు. ఎందుకంటే, అవి నశించేవి.
నశించే పదార్థాన్ని ఆధిభూతం అంటారు. విరాట్పురుషుడు లేదా హిరణ్య గర్భుడిని ఆధిదైవికం అంటారు. మనిషి తన జీవన యాత్రలో మూడు విధాలైన ధర్మాలు నిర్వర్తించాలి. అవి- ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక ధర్మాలు. ఆధిభౌతికం లౌకికమైనది. ఆధిదైవికం దేహాన్ని అనుక్షణం పాలించే అధిదేవతలను తృప్తిపరచేది. ఇక ఆధ్యాత్మికం బాహ్య జీవితం కన్నా భిన్నమైన ఆత్మను ఉన్నత స్థితికి చేర్చగలిగే జ్ఞానాన్ని కల్పించడం.
ఆధ్యాత్మికత శరీరానికి ఒక మాధ్యమం లేదా సాధనం. ఇది మానవుడి అంతరంగ శుచిత్వానికి, పవిత్రతకు ప్రాముఖ్యాన్నిస్తుంది. ఆచార వ్యవహారాల నిర్వహణలో బాహ్య ఆంతరంగిక శుచిత్వం, శ్రద్ధాసక్తులు, నైతిక సత్ప్రవర్తన, నియమాలు, నిర్మలత్వానికి ఆధ్యాత్మికత ప్రాధాన్యమిస్తుంది.
ప్రపంచంలో ఎన్ని విద్యలున్నా, ఆధ్యాత్మిక విద్యే తానని గీతాచార్యుడు చెప్పాడు. ఏ విద్య వల్ల మనిషికి జన్మరాహిత్యం, ఆనంద ప్రాప్తి కలుగుతాయో, పరమ శాంతి చేకూరుతుందో అదే అన్నింటికన్నా గొప్పది. అటువంటి విద్యే బ్రహ్మవిద్య. ఆధ్యాత్మిక విద్యను చేపట్టి జనన మరణ భయాదులతో నిండిన సంసార బంధం నుంచి విముక్తి కావాలి. సదా భగవంతుణ్ని స్మరిస్తూ, సేవిస్తూ ఉండాలి. దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక చింతన విడదీయరాని భావం కావాలి. సూర్య నమస్కారాలు, యోగాసనాలు లాంటివి ఆధ్యాత్మికతకు ఉపకరించేవే. వ్యాయామం, ఆహారవిహారాదులన్నీ మన శరీర రక్షణ, పోషణలకు ఉపయోగపడేవే. వాటితో పాటు ఆధ్యాత్మిక ప్రగతికీ అవి తోడ్పడతాయి.
వి.ఎస్.ఆర్.మౌళి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలవాహిని
కాలం ఈశ్వర స్వరూపమని వేదం ఉపదేశించింది. కాలం మహా బలమైంది. ఎంతో విలువైంది కూడా. అలాంటి కాలం తమకు కలిసి రావాలని, అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. -
దేవుడికి ధన్యవాదాలు!
ఎవరి ఆజ్ఞను శిరసా వహించి సూర్యుడు తన కక్ష్యలో తిరుగుతూ కాంతినిస్తున్నాడు? ఎవరి సంకల్పాన్ని అనుసరించి చంద్రుడు వెలుగునిస్తున్నాడు? ఎవరి శాసనాన్ని తలదాల్చి భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తూ జీవకోటిని భరిస్తున్నది? ఇటువంటి ప్రశ్నలెన్నో మనకు కలుగుతుంటాయి. -
మంచిగంధపు పరిమళం
మనకు గానీ ఇతరులకు గానీ ఏది హాని చేయదో అది మంచి. ఎటువంటి ప్రవర్తన వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుందో అది మంచితనం. ఇతరులు ఏమి చేస్తే మనకు బాధ కలుగుతుందో అది ఇతరులకు మనం చేయకుండా ఉండటమే సత్ప్రవర్తన అని శాంతిపర్వంలో తిక్కన చక్కగా చెప్పారు. -
అంతా మన మంచికే!
ప్రకృతిలో ఎన్నో అందమైన దృశ్యాలు... ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తే ఎంతో మనోహరంగా ఉంటుంది. దాని వెనక ఒక గొంగళిపురుగు దశ ఉందని అసలు స్ఫురించదు. పరిణామక్రమంలో అన్నీ అలా జరిగిపోతుంటాయి. ప్రకృతి మన కోసం ఎన్నో అందమైన, అద్భుతమైన ప్రయోజనకరమైన ఏర్పాట్లు చేసింది. అంతా మన మంచికే! -
భాగవత నవనీతం
భారత రామాయణాలకన్నా భాగవతాన్ని అర్థం చేసుకోవడం ఒకింత కష్టం అంటారు. ‘భాగవతము తెలిసి, పలుకుట చిత్రంబు’ అని పోతనామాత్యుడే స్వయంగా పేర్కొన్నాడు. -
పారమార్థిక జ్ఞానం
అదేం విచిత్రమో కాని- మనసులో కోరికలు ఒకదాని వెంట మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. నివసించేందుకు ఇల్లు కావాలి. ఎలాగో ఓలాగా ఇల్లు కట్టుకొంటాం. ఇంట్లోకి సౌకర్యాలు కావాలి. ఆ కోరికా తీరిపోయిందనుకొంటే- కారు... నగలు... ఇలా ఎన్నో. -
గురు నానక్ జయంతి
మనిషి ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్యమని ఎందరో ప్రవక్తలు బోధించారు. వారిలో గురునానక్ ఒకరు. సిక్కుల గురుపరంపరలో నానక్ మొదటివారు. ఆయన 1469లో ఇప్పటి పాకిస్థాన్లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తిక పూర్ణిమ నాడు జన్మించారు. -
నమస్కారం
భారతీయుల ఉన్నత సంస్కారానికి నిదర్శనం నమస్కారం. రెండు చేతులను హృదయానికి దగ్గరగా తీసుకొచ్చి ఒక్కటిగా చేర్చడం నమస్కార ముద్ర. ఎదుటి వ్యక్తి ఔన్నత్యాన్ని అంగీకరించడం ఆ చర్యకు అర్థం. ఆత్మ స్వరూపుడైన తోటి మనిషిలోని పరమాత్మను గౌరవించడం పరమార్థం. -
మోహముద్గరం
మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది. -
అందమైన బాల్యం
విత్తనం మొలకెత్తి పాదుగా పాకుతున్న క్రమంలో పందిరి వేసి తాడుతో దానికి సరైన దారి ఏర్పాటు చేస్తాం. ఒకనాటికి అది పందిరంతా అందంగా అల్లుకొని పూవులు పూస్తుంది. అవసరానికి అందుకొనేలా కాయలు కాస్తుంది. పందిరి వేయకపోతే తీగమొక్క ఒక పద్ధతి లేకుండా అడ్డదిడ్డంగా పెరుగుతుంది. -
ప్రకృతి పరవశం
నేలపై పడుకుంటే అమ్మ ఒడిలో పసిపాప పడుకొని ఉన్నంత ఆనందం. సెలయేటి నీటి తుంపరల్లో తడుస్తూ స్నానం చేస్తున్నప్పుడు ఆకాశగంగలో మునిగినంత సంతోషం. -
లయాత్మక జీవనం
చిన్నారి బుడత నెలల వయసులో తప్పటడుగులతో నడక ప్రారంభిస్తాడు. ఆగిఆగి లయగా బిడ్డ అడుగులు భూమిపై పడుతుంటే కన్నతల్లి మురిసిపోతుంది. తనపై పడే ఆ చిట్టి అడుగుల కమనీయ స్పర్శకు నేలతల్లి సైతం పులకించిపోతుంది. సూర్యభగవానుడు తూర్పు కొండలనుంచి ఉన్నపళంగా ఆకాశంలో కానరాడు. -
నిరంతర స్రవంతి
మానవ సంబంధాల పట్టాల మీదనే మనిషి జీవితం ముందుకు సాగుతుంది. సాటి మనిషితో సఖ్యంగా ఉండాలి. బంధాలను ఏర్పరచుకోవాలి. మనిషితో మనిషి ఏర్పరచుకునే ఆత్మీయతానుబంధాలే- బలం, బలగం. ఏ వ్యక్తీ చెడ్డగానో, మంచిగానో పుట్టడు. పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యాలు మనిషి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. ప్రతి వ్యక్తిలోనూ బొమ్మబొరుసులుగా మంచిచెడులు ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన పరిస్థితులకు తగ్గట్లు మారవచ్చు... -
దేవుడు మెచ్చిన పూలు
మనం భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఎన్నోరకాల పుష్పాలు తెచ్చి పూజిస్తాం. మల్లెలు, మొల్లలు, మందారాలు, సంపెంగలు, గులాబీలు, పారిజాతాలు- ఇలా ఎన్నెన్నో పూలతో పూజిస్తూ భగవదర్చనలో భాగంగా భావించి, తృప్తిచెందుతాం. ఉపాసన రెండువిధాలుగా ఉంటుంది- సగుణోపాసన, నిర్గుణోపాసన అని. -
ఎప్పుడు కోప్పడాలి?
కోపం అనేది నిన్ను నిన్నుగా నిలవనీయని ఒక అనిశ్చిత ఉద్విగ్న స్థితి. కోపానికి కారణాలు అనేకం. నష్టాలు కూడా ఎన్నో. కోపం సింహాసనం ఎక్కితే కారణం నిష్క్రమిస్తుంది. ఇంగితం నశిస్తుంది. హృదయం జ్వలిస్తుంది. చెవి మంచిమాటలు వినదు. మాట అదుపు తప్పుతుంది. -
అజ్ఞాన లోభాలు
లోకంలో లోభులకు లోటులేదు. లోభి సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తాడు. సంపాదించిన సంపద తరిగిపోతుందేమోనని నిత్యం చింతిస్తుంటాడు. ఎవరినీ నమ్మడు. లోభికి కీర్తి నశిస్తుందని, ధనమే పావనమని భావించేవారు ధర్మభ్రష్టులవుతారని, లోభికి స్నేహితులుండరని పంచతంత్రం చెబుతోంది. -
దాచినా దాగని ప్రతిభ
మనిషిలో ప్రతిభ, సమర్థత ఎంత దాచాలని ప్రయత్నించినా దాగేవి కావు. రెక్కలు వచ్చిన పక్షిపిల్ల తన బలాన్ని విశ్వసించి విశాలమైన ఆకాశంలోకి ఎగురుతుంది. భూగర్భంలో అణిగిమణిగి ఉన్న జలరాశి తవ్వగానే ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. -
నాద చికిత్స
ప్రపంచ సంగీత రీతుల్లో అత్యంత విశిష్టమైంది భారతీయ మనోధర్మ సంగీతం. మనోధర్మం అంటే సంగీతంలో శాఖలైన రాగం, తానం పల్లవి, నెరవు, ఆలాపన, స్వరకల్పనల సమ్మేళనం. -
బతుకులో వైరాగ్యం
ఆధ్యాత్మిక విషయాల్లో తరచుగా వినపడే మాట వైరాగ్యం. వైరాగ్యం లేకపోతే ఆధ్యాత్మికతకు దారి దొరకదు. విరాగి అయితేనే సత్యం వైపు తిరుగుతాడు. కోరికలు లేనివాడు మాత్రమే వేదాంతానికి అర్హత పొందుతాడు. గోడకున్న పాత రంగును గీకితేనే తప్ప, కొత్త రంగు అంటుకోదు. ఆశ, వ్యామోహం, కోరికలు అనే రంగులను గోకితే...


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Assembly Election Results: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. సీఎంలు ఏమన్నారంటే?
-
IND vs AUS: శ్రేయస్ హాఫ్ సెంచరీ.. ఆస్ట్రేలియా ఎదుట 161 పరుగుల లక్ష్యం
-
Revanth reddy: సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం?
-
భార్యాభర్తలు, మామా అల్లుళ్ల గెలుపు.. ఆ పార్టీ ఎంపీలంతా ఓటమి!
-
Telangana DGP: తెలంగాణ డీజీపీగా రవిగుప్తా నియామకం