దేవుడు మెచ్చిన పూలు
మనం భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఎన్నోరకాల పుష్పాలు తెచ్చి పూజిస్తాం. మల్లెలు, మొల్లలు, మందారాలు, సంపెంగలు, గులాబీలు, పారిజాతాలు- ఇలా ఎన్నెన్నో పూలతో పూజిస్తూ భగవదర్చనలో భాగంగా భావించి, తృప్తిచెందుతాం. ఉపాసన రెండువిధాలుగా ఉంటుంది- సగుణోపాసన, నిర్గుణోపాసన అని.
మనం భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఎన్నోరకాల పుష్పాలు తెచ్చి పూజిస్తాం. మల్లెలు, మొల్లలు, మందారాలు, సంపెంగలు, గులాబీలు, పారిజాతాలు- ఇలా ఎన్నెన్నో పూలతో పూజిస్తూ భగవదర్చనలో భాగంగా భావించి, తృప్తిచెందుతాం. ఉపాసన రెండువిధాలుగా ఉంటుంది- సగుణోపాసన, నిర్గుణోపాసన అని. దైవాన్ని ఓ విగ్రహంలోనో, పటంలోనో, శిలలోనో చూసుకుంటూ, అదే నమ్మకంతో పూలు, ధూపదీప నైవేద్య, తాంబూలాదులతో అర్చించడం సగుణోపాసన. పేరు, రూపం మొదలైనవి ఏవీ లేవని, స్వామి నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడని ఆత్మజ్ఞానంతో, ధ్యానంతో ఉపాసించడమనేది నిర్గుణోపాసన.
కొద్దికాలమే ఉండి, తరవాత వాడి, వాసన కోల్పోయి, నిర్మాల్యంగా మిగిలిపోయే ఈ పూలకంటే నిజంగా దైవం మెచ్చిన పూలు వేరే ఉన్నాయి. అవి అంతర్యామికి అర్పించుకోవడమే అసలైన పూజ అని విజ్ఞులు చెబుతున్నారు.
పరమాత్మకు అందించవలసిన ప్రథమపుష్పం అహింస. మనం అహింసా ధర్మం పాటిస్తే ఆ పుష్పంతో పరంధాముణ్ని పూజించినట్లే. లోకంలో దీన్ని మించిన ధర్మం లేదు కనుక దీన్ని పరమధర్మం అన్నారు. శారీరకంగా సాటివారిని హింసించడం శారీరక హింస. మానసికంగా హింసించడం మానసిక హింస. ఈ రెండూ మనిషికి కూడనివి.
రెండో కుసుమం- ఇంద్రియ సంయమనం. మనిషి ఇంద్రియ నిగ్రహం అలవరచుకుంటే పాపాలు చేయడు. నేడు ముఖ్యంగా సంయమనలోపం వల్లనే సమాజంలో ఎన్నో దుష్కృతాలు జరుగుతున్నాయి. దోపిళ్లు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, పగలు, ప్రతీకారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మనోనియంత్రణ ఉంటే ఇటువంటి అల్లకల్లోలాలు చాలావరకు తగ్గుతాయి.
మూడోది దయాపుష్పం. సృష్టిలోని ప్రతి ప్రాణికీ జీవించే హక్కుంది. ‘బతుకు, బతకనివ్వు’ అన్నారు అందుకే! సమాజం ఎంతోమంది అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పీడితులు, క్షుద్బాధతో అలమటిస్తున్నవారున్నారు. వారిపట్ల దయ చూపించడమే కాక, ఆదుకుని చేయి అందించడం మన ధర్మం. ఈ దయా ప్రసూనాన్నే దేవుడు స్వీకరిస్తాడు.
మరో పుష్పం - క్షమా పుష్పం. క్షమ అంటే ఓర్పు, సహనం. క్షమ అనేది మనిషికి పెట్టని ఆభరణం. క్షమ వల్ల ఖ్యాతి లభిస్తుంది. గౌరవం, అధికారం, అభిమానం సహనం వల్లనే లభిస్తాయి.
ఆశ్రితవత్సలుడు మెచ్చే మరో అపురూప ప్రసూనం- శాంతి. ఎన్ని కష్టాలు పడ్డా తుకారాం, మీరాబాయి శాంతిని విడనాడలేదు.
తపఃపుష్పం దేవుడు మెచ్చే మరో పుష్పం. అడవుల్లో చేసేదే తపస్సు కాదు. నిరంతరం త్రికరణ శుద్ధిగా దైవాన్ని స్మరిస్తూ తన కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావడమూ తపస్సే. అరిషడ్వర్గాలను దూరంగా ఉంచి, తమ విధులనే నిధులుగా భావించేవారిని భగవంతుడు ఇష్టపడతాడు.
మరో పుష్పం ధ్యాన పుష్పం. శ్వాసపైన ధ్యాస ఉంచి, అహం బ్రహ్మాస్మి అనుకోగల పరిణతి పొందడమే ధ్యాన పుష్పం.
చివరి పుష్పం సత్యం. విశ్వమంతా సత్యం మీదనే ఆధారపడి ఉంది. సత్యం నిత్యమైనది. శాశ్వతమైనది. సత్యమే దైవమన్నారు.
ఈ అష్టగుణ సుమాలతో చేసే ఆరాధనే తనకిష్టమన్నాడు ఆపద్బాంధవుడు.
చిమ్మపూడి శ్రీరామమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్యాగం
విభిన్నగుణ సమ్మిళత రూపమే వ్యక్తి. అందులో సకల సద్గుణాలను మసకబార్చేది స్వార్థం. అన్ని దుర్గుణాలను పరిహరించేది త్యాగం. స్వార్థం మనుషులను దూరం చేస్తే ప్రేమ, త్యాగాలు దగ్గర చేస్తాయి. -
కాలవాహిని
కాలం ఈశ్వర స్వరూపమని వేదం ఉపదేశించింది. కాలం మహా బలమైంది. ఎంతో విలువైంది కూడా. అలాంటి కాలం తమకు కలిసి రావాలని, అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. -
దేవుడికి ధన్యవాదాలు!
ఎవరి ఆజ్ఞను శిరసా వహించి సూర్యుడు తన కక్ష్యలో తిరుగుతూ కాంతినిస్తున్నాడు? ఎవరి సంకల్పాన్ని అనుసరించి చంద్రుడు వెలుగునిస్తున్నాడు? ఎవరి శాసనాన్ని తలదాల్చి భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తూ జీవకోటిని భరిస్తున్నది? ఇటువంటి ప్రశ్నలెన్నో మనకు కలుగుతుంటాయి. -
మంచిగంధపు పరిమళం
మనకు గానీ ఇతరులకు గానీ ఏది హాని చేయదో అది మంచి. ఎటువంటి ప్రవర్తన వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుందో అది మంచితనం. ఇతరులు ఏమి చేస్తే మనకు బాధ కలుగుతుందో అది ఇతరులకు మనం చేయకుండా ఉండటమే సత్ప్రవర్తన అని శాంతిపర్వంలో తిక్కన చక్కగా చెప్పారు. -
అంతా మన మంచికే!
ప్రకృతిలో ఎన్నో అందమైన దృశ్యాలు... ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తే ఎంతో మనోహరంగా ఉంటుంది. దాని వెనక ఒక గొంగళిపురుగు దశ ఉందని అసలు స్ఫురించదు. పరిణామక్రమంలో అన్నీ అలా జరిగిపోతుంటాయి. ప్రకృతి మన కోసం ఎన్నో అందమైన, అద్భుతమైన ప్రయోజనకరమైన ఏర్పాట్లు చేసింది. అంతా మన మంచికే! -
భాగవత నవనీతం
భారత రామాయణాలకన్నా భాగవతాన్ని అర్థం చేసుకోవడం ఒకింత కష్టం అంటారు. ‘భాగవతము తెలిసి, పలుకుట చిత్రంబు’ అని పోతనామాత్యుడే స్వయంగా పేర్కొన్నాడు. -
పారమార్థిక జ్ఞానం
అదేం విచిత్రమో కాని- మనసులో కోరికలు ఒకదాని వెంట మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. నివసించేందుకు ఇల్లు కావాలి. ఎలాగో ఓలాగా ఇల్లు కట్టుకొంటాం. ఇంట్లోకి సౌకర్యాలు కావాలి. ఆ కోరికా తీరిపోయిందనుకొంటే- కారు... నగలు... ఇలా ఎన్నో. -
గురు నానక్ జయంతి
మనిషి ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్యమని ఎందరో ప్రవక్తలు బోధించారు. వారిలో గురునానక్ ఒకరు. సిక్కుల గురుపరంపరలో నానక్ మొదటివారు. ఆయన 1469లో ఇప్పటి పాకిస్థాన్లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తిక పూర్ణిమ నాడు జన్మించారు. -
నమస్కారం
భారతీయుల ఉన్నత సంస్కారానికి నిదర్శనం నమస్కారం. రెండు చేతులను హృదయానికి దగ్గరగా తీసుకొచ్చి ఒక్కటిగా చేర్చడం నమస్కార ముద్ర. ఎదుటి వ్యక్తి ఔన్నత్యాన్ని అంగీకరించడం ఆ చర్యకు అర్థం. ఆత్మ స్వరూపుడైన తోటి మనిషిలోని పరమాత్మను గౌరవించడం పరమార్థం. -
మోహముద్గరం
మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది. -
అందమైన బాల్యం
విత్తనం మొలకెత్తి పాదుగా పాకుతున్న క్రమంలో పందిరి వేసి తాడుతో దానికి సరైన దారి ఏర్పాటు చేస్తాం. ఒకనాటికి అది పందిరంతా అందంగా అల్లుకొని పూవులు పూస్తుంది. అవసరానికి అందుకొనేలా కాయలు కాస్తుంది. పందిరి వేయకపోతే తీగమొక్క ఒక పద్ధతి లేకుండా అడ్డదిడ్డంగా పెరుగుతుంది. -
ప్రకృతి పరవశం
నేలపై పడుకుంటే అమ్మ ఒడిలో పసిపాప పడుకొని ఉన్నంత ఆనందం. సెలయేటి నీటి తుంపరల్లో తడుస్తూ స్నానం చేస్తున్నప్పుడు ఆకాశగంగలో మునిగినంత సంతోషం. -
లయాత్మక జీవనం
చిన్నారి బుడత నెలల వయసులో తప్పటడుగులతో నడక ప్రారంభిస్తాడు. ఆగిఆగి లయగా బిడ్డ అడుగులు భూమిపై పడుతుంటే కన్నతల్లి మురిసిపోతుంది. తనపై పడే ఆ చిట్టి అడుగుల కమనీయ స్పర్శకు నేలతల్లి సైతం పులకించిపోతుంది. సూర్యభగవానుడు తూర్పు కొండలనుంచి ఉన్నపళంగా ఆకాశంలో కానరాడు. -
నిరంతర స్రవంతి
మానవ సంబంధాల పట్టాల మీదనే మనిషి జీవితం ముందుకు సాగుతుంది. సాటి మనిషితో సఖ్యంగా ఉండాలి. బంధాలను ఏర్పరచుకోవాలి. మనిషితో మనిషి ఏర్పరచుకునే ఆత్మీయతానుబంధాలే- బలం, బలగం. ఏ వ్యక్తీ చెడ్డగానో, మంచిగానో పుట్టడు. పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యాలు మనిషి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. ప్రతి వ్యక్తిలోనూ బొమ్మబొరుసులుగా మంచిచెడులు ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన పరిస్థితులకు తగ్గట్లు మారవచ్చు... -
ఆధ్యాత్మిక ఆవశ్యకత
సంపదలు ఎన్ని ఉన్నా, పదవులు ఎన్ని వరించినా అవి మనిషి మానసిక అశాంతిని తొలగించలేవు. మనోవ్యాధిని పోగొట్టలేవు. ఆత్మజ్ఞానం ఒక్కటే దీనికి పరమావధి అని గీతాచార్యుడు సెలవిచ్చాడు. -
ఎప్పుడు కోప్పడాలి?
కోపం అనేది నిన్ను నిన్నుగా నిలవనీయని ఒక అనిశ్చిత ఉద్విగ్న స్థితి. కోపానికి కారణాలు అనేకం. నష్టాలు కూడా ఎన్నో. కోపం సింహాసనం ఎక్కితే కారణం నిష్క్రమిస్తుంది. ఇంగితం నశిస్తుంది. హృదయం జ్వలిస్తుంది. చెవి మంచిమాటలు వినదు. మాట అదుపు తప్పుతుంది. -
అజ్ఞాన లోభాలు
లోకంలో లోభులకు లోటులేదు. లోభి సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తాడు. సంపాదించిన సంపద తరిగిపోతుందేమోనని నిత్యం చింతిస్తుంటాడు. ఎవరినీ నమ్మడు. లోభికి కీర్తి నశిస్తుందని, ధనమే పావనమని భావించేవారు ధర్మభ్రష్టులవుతారని, లోభికి స్నేహితులుండరని పంచతంత్రం చెబుతోంది. -
దాచినా దాగని ప్రతిభ
మనిషిలో ప్రతిభ, సమర్థత ఎంత దాచాలని ప్రయత్నించినా దాగేవి కావు. రెక్కలు వచ్చిన పక్షిపిల్ల తన బలాన్ని విశ్వసించి విశాలమైన ఆకాశంలోకి ఎగురుతుంది. భూగర్భంలో అణిగిమణిగి ఉన్న జలరాశి తవ్వగానే ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. -
నాద చికిత్స
ప్రపంచ సంగీత రీతుల్లో అత్యంత విశిష్టమైంది భారతీయ మనోధర్మ సంగీతం. మనోధర్మం అంటే సంగీతంలో శాఖలైన రాగం, తానం పల్లవి, నెరవు, ఆలాపన, స్వరకల్పనల సమ్మేళనం.