Ap news: ఇంటి నిర్మాణంపై ధరల దరువు
సొంతింటి కల రోజురోజుకీ ఖరీదయిపోతోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ధరలతో బడ్జెట్ తల్లకిందులవుతోంది. ఇసుక నుంచి ఉక్కు దాకా.. సిమెంటు నుంచి ఎలక్ట్రికల్ సామగ్రి వరకు ధరలన్నీ నెల రోజుల్లోనే 15 నుంచి 30 శాతం పెరగడం ఇళ్లు కట్టేవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
భారీగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు
రూ.70 వేలు దాటిన టన్ను ఉక్కు
సిమెంటు రేటుకు రెక్కలు
ఎలక్ట్రిక్, ప్లంబింగ్ సామగ్రి ఖర్చూ పైపైకి..
సొంతింటి కల రోజురోజుకీ ఖరీదయిపోతోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ధరలతో బడ్జెట్ తల్లకిందులవుతోంది. ఇసుక నుంచి ఉక్కు దాకా.. సిమెంటు నుంచి ఎలక్ట్రికల్ సామగ్రి వరకు ధరలన్నీ నెల రోజుల్లోనే 15 నుంచి 30 శాతం పెరగడం ఇళ్లు కట్టేవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
ఈనాడు - అమరావతి
ఉక్కు ధర నెల రోజుల వ్యవధిలోనే టన్నుకి రూ.10 వేల వరకు పెరిగింది. రెండు, మూడు నెలల వ్యవధిలో సిమెంట్ ధర బస్తాకి రూ.50-60 పెరిగింది. ఎలక్ట్రిక్, ప్లంబింగ్ సామగ్రి, రంగులు తదితరాల ధరలూ 20-30% వరకు పెరిగాయి. ఇసుక సైతం భారంగా మారింది. రాష్ట్రంలో భారీ నిర్మాణ, వాణిజ్య ప్రాజెక్టులు చేస్తున్న బిల్డర్లతోపాటు సొంతానికో చిన్న గూడు కట్టుకోవాలనే సామాన్యులకూ ఇది శరాఘాతంగా మారింది. ప్రస్తుతం నిర్మాణ వ్యయం చ.అడుగుకి రూ.200 నుంచి రూ.300 వరకు పెరిగినట్లు నిర్మాణరంగ ప్రతినిధులు చెబుతున్నారు. ఉక్కు ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. టన్నుకు రూ.70 వేలు దాటేసింది. విశాఖ ఉక్కు ఉత్పత్తి చేసే 8ఎం.ఎం. ఉక్కు చువ్వల ధర నిరుటి నవంబరులో విజయవాడ మార్కెట్లో రూ.49,800 ఉంది. ఈఏడాది సెప్టెంబరులో రూ.62 వేల వరకు పలికింది. ప్రస్తుతం రూ.72 వేలకు చేరింది. సింహాద్రి టీఎంటీ సంస్థ ఉత్పత్తి చేసే 8ఎం.ఎం. చువ్వల ధర విజయవాడలో గత ఏడాది నవంబరులో రూ.45,800 ఉంటే, ప్రస్తుతం రూ.69 వేలకు చేరింది.
సిమెంటు మరింత ప్రియం
రెండు, మూడు నెలల్లో సిమెంటు మోయలేనంత భారమైంది. 50 కిలోల బస్తా ధర బ్రాండ్, నాణ్యతల్నిబట్టి రూ.40-60 వరకు పెరిగింది. నిరుడు ప్రీమియం బ్రాండ్ల బస్తాకు రూ.300, మీడియం బ్రాండ్ల బస్తాకు రూ.230 వరకుఉండేది. ఇప్పుడు ప్రీమియం బ్రాండ్ల ధర రూ.400, మీడియం బ్రాండ్ల బస్తా ధర రూ.320 వరకు ఉంది.
ఇసుక సంగతి సరేసరి
రాష్ట్రంలో చాలాచోట్ల స్టాక్ పాయింట్లలోనే ఇసుక దొరుకుతోంది. వర్షాలతో రీచ్లకు వెళ్లే సౌలభ్యం లేదు. రీచ్లలో టన్ను ఇసుక ధర రూ.475 కాగా... స్టాక్పాయింట్లలో అదనంగా (రీచ్ల నుంచి తేవడానికయ్యే రవాణా ఛార్జీలను కలిపి) వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి కూడా ధర మారుతోంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో టన్ను రూ.650, కీసరలో రూ.670, నూజివీడులో రూ.710కి విక్రయిస్తున్నారు. విజయవాడకు తెచ్చేసరికి టన్ను ధర రూ.1,000-1,100కు చేరుతోంది. విశాఖకు శ్రీకాకుళం, రాజమహేంద్రవరం నుంచి ఇసుక తెచ్చుకోవాల్సి రావడంతో టన్నుకి రూ.1550కి పైనే అవుతోంది.
తోడైన బొగ్గు, పెట్రో మంట
ముడిసరకుల ధరలు పెరగడంతోనే నిర్మాణ సామగ్రి ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయని వాటి ఉత్పత్తిదారులు చెబుతున్నారు. బొగ్గు ధరల కారణంగా ఉక్కు ఉత్పత్తి వ్యయం పెరిగిందని, డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావంతో... రవాణా ఛార్జీల రూపంలో అదనపు భారం పడుతోందన్నారు. ‘‘బొగ్గు(కోకింగ్ కోల్) ధర మరీ అనూహ్యంగా పెరిగింది. ఒకప్పుడు టన్ను రూ.4 వేలు ఉండేది. ఇప్పుడు రూ.16 వేలు దాటిపోయింది. ఇనుప ఖనిజం మండుతోంది. ఎన్ఎండీసీ వద్ద టన్ను ఇనుప ఖనిజం బేసిక్ ధర రూ.8 వేల వరకు ఉంది. ఉక్కు ఉత్పత్తిలో ఉపయోగించే ఫెర్రో అల్లాయ్స్ ధరలూ పెరిగాయి’’ అని స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ (సింహాద్రి టీఎంటీ) డైరెక్టర్ వి.వి.కృష్ణారావు తెలిపారు.
అది ఒక సాకు మాత్రమే
ముడి సరకుల ధరల కారణంగానే నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయన్నది ఉత్పత్తిదారులు చెబుతున్న వంక మాత్రమే. పరిస్థితుల్ని అనువుగా మార్చుకుని, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ధరల్ని అదుపు చేయాలి. ధరలు పెరగడం ప్రైవేటు నిర్మాణ రంగానికే కాదు, ప్రభుత్వాలకూ భారమే. ప్రభుత్వాలు చేపట్టే నిర్మాణ ప్రాజెక్టులు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టుల వ్యయమూ గణనీయంగా పెరుగుతోంది.
-రాజా శ్రీనివాస్, క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని