Junk Food: జంక్ పిడుగు
చిన్నారుల జీవితాల్ని చిరుతిళ్లు శాసిస్తున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే తినుబండారాల కంటే వారు మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుండడం పరిపాటి అయ్యింది. బడుల వద్ద కూడా
పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
మార్కెట్లోని చిరుతిళ్లతో ప్రమాదం
‘ఈట్ రైట్’ నినాదంతో ఆదర్శంగా నిలుస్తున్న కేరళ
ప్రత్యేక పౌష్టికాహార మెనూ.. జంక్ ఫుడ్ కట్టడి
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
చిన్నారుల జీవితాల్ని చిరుతిళ్లు శాసిస్తున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే తినుబండారాల కంటే వారు మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుండడం పరిపాటి అయ్యింది. బడుల వద్ద కూడా జంక్ ఫుడ్ కోసం పరుగులు పెడుతున్నారు. అది వారికి బలమివ్వకపోగా, ప్రమాదంలోకి నెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనల్ని కఠినంగా పాటిస్తున్న కేరళ రాష్ట్రం ‘ఈట్ రైట్’ నినాదంతో ఆదర్శంగా నిలుస్తోంది. జంక్ ఫుడ్ను దూరం పెట్టడంతో పాటు పౌష్టికాహారాన్ని చిన్నారుల పళ్లెంలోకి చేర్చే ప్రయత్నం చేస్తోంది.
పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో చిరుతిళ్ల దుకాణాలుండొద్దనే నిబంధనలు తెలుగు రాష్ట్రాల్లో సరిగా అమలు కావట్లేదు. కేరళ మాత్రం కఠినంగా అమలు చేస్తోంది. బడుల్లో వాతావరణం (20%), చిరుతిళ్ల వ్యాపారాలు (30%), ఆహార పరీక్షలు, పర్యవేక్షణ (20%), శిక్షణ, వనరులు (10%), వినియోగంపై అవగాహన (20%) అంశాల ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ మూడేళ్లుగా రాష్ట్రాల ర్యాంకులను నిర్ణయిస్తోంది. ‘ఈట్ రైట్ కేరళ’ నినాదంతో విధానాల్ని మెరుగుపరుచుకున్న కేరళ రాష్ట్రం రెండో స్థానానికి చేరుకోగా.. 49 పాయింట్లతో తెలంగాణ 10వ స్థానంలో, 36 పాయింట్లతో ఏపీ 19వ స్థానంలో నిలిచాయి.
కేరళలో ఏం చేస్తున్నారంటే...
బడుల్లో ఇవీ నిబంధనలు..
* శుభ్రమైన తాగునీరు అందించాలి.
* తృణధాన్యాలు, పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారంతో కూడిన మెనూ ఉండాలి.
* తాజా, స్థానిక ఉత్పత్తులతోనే వంట చేయాలి. ప్యాక్ చేసిన ఉత్పత్తులేవీ వాడొద్దు.
* వంటనూనె ఒకేసారి వాడాలి. అదీ రోజూ 25 గ్రాములకు మించరాదు.
* పాఠశాలలు, విద్యార్థుల హాస్టళ్లకు 50 మీటర్ల దరిదాపుల్లో చిరుతిళ్ల దుకాణాలుండకూడదు. క్యాంటీన్లలో మిఠాయిలు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, చిప్స్, పిజ్జా, సమోసాలు, నూడుల్స్, గులాబ్ జామూన్, శీతల పానీయాలు నిషేధం.
బడి బువ్వలో ఉండేవి ఇవీ...
* గోధుమ, బియ్యం, రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలతో వంటకాలు
* తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు, పన్నీరు, చికెన్, చేపలు, కోడిగుడ్లు
* 300 గ్రాముల కూరగాయలు.. వీటిలో ఆకు కూరలు 50 గ్రా, ఇతరాలు 200 గ్రా, దుంపలు 50 గ్రా. ఉండాలి.
* బాదం, ఆల్మండ్, పిస్తా, ఉప్పు లేకుండా వేయించిన గింజలు
* ఉడికించిన చిరుతిళ్లు, ఉప్మా, పోహా, డోఖ్లా
పిల్లలకు ఇచ్చే స్నాక్ బాక్సుల్లో..
ఫ్రూట్ సలాడ్లు, పల్లీలు, బెల్లంతో చిక్కీలు, లడ్డూలు, బాదం, పిస్తాతో చేసిన పదార్ధాలు, మినప, ఉలవ పిండితో లడ్డూలు, రాగులు, జొన్నలు, సజ్జలతో చేసే స్నాక్స్.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారమిద్దాం
- సుజాత, పోషకాహార నిపుణురాలు
గత పదేళ్లలో పిల్లల ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. సరైన సమయానికి, సరైన తిండి తినట్లేదు. రోగ నిరోధక శక్తి పెరగాలంటే వారికి మంచి ఆహారం అందించాలి. జంక్ ఫుడ్ను నివారించి, పీచు, బలవర్ధక పదార్ధాలు ఇవ్వాలి. పాఠశాలల పరిసరాల్లో జంక్ ఫుడ్, ఇతర చిరుతిళ్లను ఉంచనివ్వొద్దు. పాలు, గుడ్లు, మన సంప్రదాయ ఆహారాన్ని తినేందుకు ప్రోత్సహించాలి.
ఆసక్తి.. అవగాహన పెంచాలి
- సయ్యదా సనా, పోషకాహార నిపుణురాలు
పిల్లలకు ఇంట్లో ఏం పెట్టాలో తల్లిదండ్రులు చూసుకుంటున్నట్లే బడుల్లో గురువులు బాధ్యత తీసుకోవాలి. ఏ ఆహారం తింటే ఏమవుతుందో చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పాలి. లంచ్ బాక్సుల్లో రోజుకో రకం వినూత్న వంటకాలు పెట్టాలి. పండ్లు, ఇతర పదార్థాలతో భిన్న ఆహారాలతో వారికి ఆసక్తి కలిగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
సంక్షిప్త వార్తలు
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
చెరలోనే అనుమానితులు!
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
సెలవుపై వెళ్లిన గృహనిర్మాణ సంస్థ ఎండీ
గృహనిర్మాణ సంస్థ ఎండీ వెంకటరమణారెడ్డి నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆరోగ్యపరమైన కారణాలతో సెలవు కోసం ఆయన దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం అనుమతించింది.