Mamata Banerjee: భవానీపుర్ మమతదే
ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సత్తా చాటుకున్నారు. ఆదివారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో భవానీపుర్ నియోజకవర్గం నుంచి ఆమె తన
భవానీపుర్లో పశ్చిమ బెంగాల్ సీఎం సరికొత్త రికార్డు
మొత్తం మూడుచోట్లా తృణమూల్ విజయభేరి
కోల్కతా: ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సత్తా చాటుకున్నారు. ఆదివారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో భవానీపుర్ నియోజకవర్గం నుంచి ఆమె తన సమీప ప్రత్యర్థి ప్రియాంక టిబ్రెవాల్ (భాజపా)పై రికార్డు స్థాయిలో 58,835 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. బెంగాల్లోని సంసేర్గంజ్ (ఆధిక్యం: 26,379 ఓట్లు), జంగీపుర్ (ఆధిక్యం: 92,480 ఓట్లు) నియోజకవర్గాల్లోనూ తృణమూల్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తన పార్టీని విజయతీరానికి చేర్చగలిగిన మమత.. నందిగ్రామ్లో మాత్రం చతికిలపడిన విషయం తెలిసిందే. ఉప సమరంలో భవానీపుర్ బరిలో దిగిన ఆమె విజయంపై రాజకీయ వర్గాలు మొదటి నుంచీ ధీమాగానే ఉన్నాయి. అందుకే గెలుపుపై కంటే ఆధిక్యంపైనే అవి అంచనాలు వేశాయి.
కంచుకోట.. రికార్డు మోత..
కోల్కతా నడిబొడ్డున ఉన్న భవానీపుర్లో ఇంతవరకు ఏ అభ్యర్థీ సాధించని ఆధిక్యాన్ని మమత నమోదు చేయడంతో తృణమూల్ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మమతకు 85,263 ఓట్లు రాగా, టిబ్రెవాల్కు 26,428 ఓట్లు లభించాయి. ఏప్రిల్-మే మధ్య జరిగిన ఎన్నికల్లో భవానీపుర్ నుంచి తృణమూల్ అభ్యర్థి సోవన్దేవ్ ఛటోపాధ్యాయ 28 వేల ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. ఈసారి అది రెట్టింపునకు పైగా పెరిగింది. ఈ నియోజకవర్గం 2011 నుంచి తృణమూల్కి కంచుకోట. మమత సొంత ఇల్లు ఇక్కడే ఉంది. మరోవైపు.. భాజపా నుంచి ఇంకో నలుగురు శాసనసభ్యులు తృణమూల్లోకి వెళ్లబోతున్నారనే సమాచారం కమలనాథులను కలవరపెడుతోంది. మరోవైపు, మమత ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారని ప్రచారం మొదలైంది.
కుట్రను తిప్పికొట్టారు: మమత
భవానీపుర్ ప్రజలకు మమత కృతజ్ఞతలు తెలిపారు. ‘నందిగ్రామ్లో ఓడించినట్లే ఇక్కడా చేయాలని కుట్ర పన్నినవారికి ప్రజలు ధీటుగా సమాధానమిచ్చారు’ అని వ్యాఖ్యానించారు.
ఒడిశాలోని పిపిలిలో బిజద విజయం
గోపాలపూర్, న్యూస్టుడే: ఒడిశాలోని పూరీ జిల్లా పిపిలి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బిజూ జనతాదళ్ (బిజద) అభ్యర్థి రుద్రప్రతాప్ మహారథి 20,916 ఓట్ల తేడాతో భాజపాపై విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ధరావతు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?