Police postings: పోలీస్ నియామకాలు వచ్చే ఏడాది
రాష్ట్రంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలన్నింటిని మ్యాపింగ్ చేసి అక్కడ డ్రగ్స్
మాదకద్రవ్య రహితంగా విద్యాసంస్థలు
నేరాల్లో మహిళా బాధితులను మానవతా దృక్పథంతో చూడాలి
శాంతిభద్రతలపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలన్నింటిని మ్యాపింగ్ చేసి అక్కడ డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించిన ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే.. పంపిణీదారులెవరు? ఎక్కడి నుంచి తెస్తున్నారు? వంటి మూలాల్ని ఛేదించి అడ్డుకట్ట వేయాలని సూచించారు. నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు ఈ అంశాన్ని సవాల్గా తీసుకొని.. ప్రతి నాలుగు వారాలకోసారి తనకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం శాంతిభద్రతల అంశంపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ‘ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేని మాదకద్రవ్యాల కేసులో ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ, పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీయటమే వారి లక్ష్యం. వీటిపై అప్రమత్తంగా ఉండాల’ని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఇంకేమన్నారంటే..
దిశ బిల్లు ఇన్ని రోజులుగా పెండింగ్లోనా?
* దిశ బిల్లును శాసనసభలో ఆమోదించి ఇన్ని రోజులైనా.. పెండింగ్లో ఉండటం సరికాదు. వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలి. ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉండాలి. డౌన్లోడ్, వినియోగంపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ‘దిశ’ సమర్థంగా అమలుపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు దృష్టిపెట్టాలి.
* అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు మానవతా దృక్పథంతో స్పందించాలి. ఘటన జరిగిన నెల రోజుల్లోగా బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలి. ఎక్కడైనా ఆలస్యమైతే సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వండి.
* పోక్సో కేసులు, మహిళలపై జరిగే నేరాల విచారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానాల్లో ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదుల్ని నియమించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పనితీరుపై నిరంతరం సమీక్షించాలి.
* సైబర్ నేరాల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. ఆ విభాగంలో సమర్థులైన అధికారులు, న్యాయవాదుల్ని నియమించాలి.
* ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించాలి. ఎఫ్ఐఆర్ల సంఖ్య పెరుగుతుందని వెనుకడుగు వేయొద్దు. వాటిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
* గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు డిసెంబరు నాటికి శిక్షణ పూర్తిచేయాలి. వచ్చే ఏడాది కనీసం ఆరేడు వేల మంది పోలీసు సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టాలి.
* అధికారంలోకి రాగానే 43 వేల మద్యం బెల్ట్షాపులు తొలగించాం. మూడో వంతు దుకాణాలు తగ్గించాం. అమ్మకాల వేళలు కుదించాం. రేట్లు పెంచాం. వినియోగం తగ్గింది. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. మద్యం అక్రమ రవాణా, సారా తయారీని అరికట్టడంపై అధికారులు దృష్టిపెట్టాలి. ఇసుక అక్రమ రవాణా, గుట్కా నిషేధానికి అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకురావాలి’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. అధికారులు మాట్లాడుతూ ‘దిశయాప్ను 74,13,562 మంది డౌన్లోడ్ చేసుకోగా, ఇప్పటికే 5,238 మంది సాయం పొందారని తెలిపారు. ‘నేరాలకు ఆస్కారమున్న ప్రాంతాల్ని మ్యాపింగ్ చేశాం. మహిళలపై జరిగే నేరాల్లో ఒక్కో కేసు దర్యాప్తునకు 2017లో సగటున 189 రోజుల సమయం పడితే.. ఫోరెన్సిక్ సదుపాయాలు పెరిగినందున 2021లో 42 రోజుల్లోనే ఛార్జిషీట్లు వేస్తున్నాం. గతంలో డీఎన్ఏ నివేదికకు ఏడాది పట్టేది. ఇప్పుడు రెండు రోజుల్లో వస్తోంది. ఈ కేసుల్లో ఏడు రోజుల్లో ఛార్జిషీటు వేస్తున్నామ’ని వివరించారు.
నేడు ‘స్వేచ్ఛ’కు శ్రీకారం
ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదువుతున్న 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను అందించే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు. 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు నెలకు 10 చొప్పున న్యాప్కిన్లు అందిస్తారు. ప్రతి 2 నెలలకు ఒకసారి పాఠశాలలకు వెళ్లి విద్యార్థినులకు వీటిని ఇస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు విక్రయిస్తారు. రూ.31.48 కోట్ల వ్యయంతో పీ అండ్ జీ, నైన్ బ్రాండ్లకు చెందిన శానిటరీ న్యాప్కిన్లను ఇవ్వనున్నారు. యునిసెఫ్, పీఅండ్జీ వారి సమన్వయంతో రుతస్రావ సమయంలో పరిశుభ్రత పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
11న తిరుమల, 12న కనకదుర్గ ఆలయాలకు సీఎం జగన్
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తేదీ గరుడసేవ రోజున ముఖ్యమంత్రి జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరగనున్న నవరాత్రి ఉత్సవాల్లో ఈ నెల 12న ముఖ్యమంత్రి జగన్ పాల్గొని..కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి