Annamayya Reservoir: గూడు కూలి.. గోడు
నిన్నటి వరకు ఆ ఇళ్లన్నీ పిల్లాపాపలతోనూ, ఆ ఊళ్లన్నీ జనాలతోనూ కళకళలాడాయి. వారం క్రితం కురిసిన భారీ వర్షాలు ఆ గ్రామాలను కన్నీటి సంద్రంలో ముంచెత్తాయి. కడప జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలాశయం మట్టికట్ట (ఎర్త్బండ్) వరద ఉద్ధృతికి తెగిపోవటంతో.. చెయ్యేరు నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ఒడ్డునున్న పులపుత్తూరు, తోగూరుపేట గ్రామాలను వరద ముంచెత్తింది.
అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగి, ముంచెత్తిన వరద
పులపుత్తూరు, తోగూరుపేటల్లో కొట్టుకుపోయిన 80 శాతం ఇళ్లు
ఎవరిని కదిలించినా కన్నీటి కథలే
కడప జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ‘ఈనాడు’ క్షేత్ర పరిశీలన
కడప జిల్లా పులపుత్తూరు, తోగూరుపేట గ్రామాల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
తోగూరుపేటలో ఇల్లు కొట్టుకుపోయి.. ఇసుకదిబ్బల్లో కనిపిస్తున్న శిథిలాలు
నిన్నటి వరకు ఆ ఇళ్లన్నీ పిల్లాపాపలతోనూ, ఆ ఊళ్లన్నీ జనాలతోనూ కళకళలాడాయి. వారం క్రితం కురిసిన భారీ వర్షాలు ఆ గ్రామాలను కన్నీటి సంద్రంలో ముంచెత్తాయి. కడప జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలాశయం మట్టికట్ట (ఎర్త్బండ్) వరద ఉద్ధృతికి తెగిపోవటంతో.. చెయ్యేరు నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ఒడ్డునున్న పులపుత్తూరు, తోగూరుపేట గ్రామాలను వరద ముంచెత్తింది. ఇళ్లన్నింటినీ కూలదోసుకుంటూ.. ఉవ్వెత్తున ప్రవహించిన జలరాశి ఆ రెండూళ్లను శిథిలాల దిబ్బగా మార్చేసింది. ‘ఈనాడు ప్రతినిధి’ బుధవారం ఆ రెండు గ్రామాలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించగా.. ఇప్పుడు అక్కడ ఎవరిని కదిలించినా కన్నీటి కథలే. పైసా పైసా పోగేసి కట్టుకున్న ఇళ్లు క్షణాల్లో నేలమట్టమై నిలువనీడ కరవైన అభాగ్యుల గాథలే.
తోగూరపేటలో వరద విధ్వంసానికి నిదర్శనం ఈ ట్రాక్టర్
నిలువనీడా కరవైంది
ఈ రెండు గ్రామాల్లో 80 శాతం మందికి ఇప్పుడు నిలువనీడైనా లేకుండా పోయింది. ఇంట్లోని సామగ్రి, బంగారం, డబ్బులు, దుస్తులు అన్నీ కొట్టుకుపోయి, బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. వరద రాకముందు వారి ఇళ్లున్న స్థలాల్ని చూసుకుంటూ పగలూరాత్రీ అక్కడే నడిరోడ్డుపైనే ఉంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల వద్ద పెట్టే, దాతలు అందించే ఆహారంతో కాలం నెట్టుకొస్తున్నారు. కొందరు చిన్న చిన్న టార్పాలిన్లు వేసుకుని వాటి కింద తలదాచుకుంటున్నారు. వరద ముంచెత్తి బుధవారం నాటికి అయిదు రోజులు గడిచిపోయినా ఇప్పటికీ ఈ గ్రామాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదు. చీకట్లోనే మగ్గిపోతున్నామని పులపుత్తూరుకు చెందిన ఉమామహేశ్వరరాజు ఆవేదనగా చెప్పారు.
తర్వాత ఎక్కడుండాలి?
పులపుత్తూరు, తోగూరుపేట గ్రామాల్లో అనేక మంది అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నారు. అవి తీరకముందే కట్టుకున్న ఇళ్లు వరద ధాటికి కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలామని కన్నీటిపర్యంతమవుతున్నారు. కొందరికైతే వారి బంధువులు, స్నేహితులు దుస్తులు తెచ్చిచ్చేవరకూ మార్చుకోవడానికి మారుబట్టలు కూడా లేవు.
పిల్లలు తాగేందుకైనా పాలు లేవు
పులపుత్తూరు ఎస్సీ కాలనీలో చిన్నారులకు అయిదు రోజులుగా పాలు లేవు. పాలు అని అడిగినప్పుడు తినటానికి ఏదైనా ఇచ్చి బాబును బుజ్జగిస్తున్నామని పులపుత్తూరు ఎస్సీ కాలనీకి చెందిన ఒంటిమిట్ట భారతి వాపోయారు. వరద ప్రభావిత గ్రామాల్లో ఇలాంటి పిల్లలు అనేక మంది ఉన్నారు.
టార్పాలిన్ల కింద తలదాచుకుంటున్న కుటుంబాలు
సగం ఊరు సమాధి
ఈ ఇసుక దిబ్బల కింద సగం ఊరు ఉందని చూపిస్తున్న శివయ్య
అంతెత్తున పోగుపడిన ఇసుక మేటలపై నిల్చున్న ఈయన పేరు వెంకటశివయ్య. ఆయన చుట్టూ కనిపిస్తున్న ఇసుక దిబ్బల కింద నిన్నమొన్నటి వరకూ ఊరుండేది. చిత్రంలో కనిపిస్తున్న ఇంటిని ఆనుకుని పదుల ఇళ్లు ఉండేవి. ఈ నెల 19 వేకువజామున నిమిషాల వ్యవధిలో గ్రామాన్ని వరద ముంచెత్తటంతో అక్కడున్న ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. వరద తగ్గాక ఇళ్ల స్థానంలో ఇలా ఇసుక మేటలు కనిపించాయి. రాజంపేట మండలం తోగూరుపేట గ్రామంలో పరిస్థితి ఇది. ఈ గ్రామంలో దాదాపు 50 ఇళ్లు ఉండగా వాటిలో అక్కడక్కడ కొన్ని మాత్రమే మిగిలాయి.
ఆ ఊరు ఇప్పుడో శిథిలాల దిబ్బ
శిథిలాల దిబ్బగా మారిపోయిన పులపుత్తూరు ఎస్సీ కాలనీ
కనుచూపు మేరలో భవన శిథిలాలు.. అంతటా ఇసుక, మట్టి, రాళ్లూరప్పలతో కనిపిస్తున్న ఈ ప్రదేశంలో నిన్నమొన్నటి వరకూ వందల ఇళ్లతో ఒక ఊరే ఉండేది. ఈ నెల 18వ తేదీ రాత్రి వరకూ కళకళలాడిన ఆ గ్రామం.. 19వ తేదీ ఉదయం 6 గంటలకల్లా కనుమరుగైపోయింది. ఉప్పెనలా ఆ గ్రామాన్ని చుట్టుముట్టిన వరద ఇళ్లు-వాకిళ్లూ అన్నింటినీ ముంచెత్తింది. ఆ ఉద్ధృతికి సగానికి పైగా ఇళ్లు కొట్టుకుపోగా.. మరో సగానికి పైగా ఇళ్లు నేలమట్టమై జలసమాధి అయిపోయాయి. ఆ ఉరిలో 80 శాతం ఇప్పుడు శిథిలాల దిబ్బగా కనిపిస్తోంది. ఇది రాజంపేట మండలం పరిధిలోని పులపుత్తూరు పరిస్థితి. ఇక్కడ నదిని ఆనుకుని ఉన్న ఎస్సీ వీధిలో 130కి పైగా ఇళ్లున్నాయి. వాటిలో ఒకటీ అరా మినహా మిగతావన్నీ నదిలో కొట్టుకుపోయాయి. ఇప్పుడా వీధిలో శిథిలాలే మిగిలాయి. ఇదే గ్రామంలోని రాజులవీధిదీ ఇదే పరిస్థితే. రెడ్లవీధిలోనూ 50 శాతం ఇళ్లు కొట్టుకుపోయాయి.
అప్పయినా తీరలేదు.. అప్పుడే వీధినపడ్డాం
నేను రూ.2 లక్షలు అప్పు తెచ్చి కిందటేడాదే ఇల్లు కట్టాను. ఆ అప్పు తీరకముందే వరదకు ఇల్లు కొట్టుకుపోయింది. కట్టుబట్టలతో మిగిలా. ఇప్పుడు ఎక్కడ ఉండాలో కూడా తెలియట్లేదు.
- పులపుత్తూరు ఎస్సీ కాలనీకి చెందిన ఒంటిమిట్ట చిన్నక్క ఆవేదన
అది తలచుకుంటేనే భయమేస్తోంది
‘నా ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది. ప్రాణాలు తప్ప ఏమీ మిగల్లేదు. ఇప్పుడు మళ్లీ ఇల్లు కట్టుకోవటం సాధ్యం కాని పని. ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలనేది తలచుకుంటేనే భయమేస్తోంది’ అని భోరుమంటున్నారు తోగూరుపేటకు చెందిన ఈ జొన్నా నారాయణరావు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!